గడిచిన కొంతకాలంగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన ఒక అక్రమ నిర్మాణంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే న్యాయస్థానానికి వెళ్లారు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన కట్టడంపై అభ్యంతరాలు ఉన్నాయి. భీమిలి బీచ్ సముద్రానికి అతి సమీపంలో.. సీఆర్ జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారికి షాకిచ్చే ఆదేశాల్ని హైకోర్టు జారీ చేసింది.
అంతేకాదు.. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యల్ని అపొద్దని పేర్కొంది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు అవసరం లేదన్న న్యాయస్థానం.. ‘మీ పని మీరు చేయండి’ అంటూ అధికారులకు సూచన చేసింది. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో పాటు స్థాయి నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ నేహారెడ్డి తరఫు లాయర్ కోరగా.. అందుకే హైకోర్టు నో చెప్పింది.
నేహా రెడ్డి అక్రమ నిర్మాణంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. నేహారెడ్డి తరఫు సీనియర్ న్యాయమవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాము సీఆర్ జెడ్ 2లోనే నిర్మాణాలు చేశామని.. అది సీఆర్ జెడ్ 1 పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కక్ష తోనే పిల్ దాఖలు చేశారన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. సముద్రానికి అతి సమీపంలో ప్రహరీ నిర్మించారని.. నిర్మాణాల అనుమతులు.. ఇతర అంశాలను సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యంలో తెచ్చుకోవాలన్నారు. ఇక.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. నిర్మాణానికి సంబంధించి మొత్తం విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు అడిగామని.. ఇప్పటివరకు నేహా రెడ్డి స్పందించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స్పందించిన హైకోర్టు.. స్టే లేని నేపథ్యంలో కూల్చేయాలని పేర్కొన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 19, 2024 10:54 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…