ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూతన మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీని ప్రకారం.. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం మేరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉంది.
కానీ, ఇప్పుడు మరో గంట సమయాన్ని పొడిగించారు. ఇది రాత్రివేళ(నైట్) పనులు చేసుకుని ఉదయం ఇంటికి చేరుకునే కార్మికుల కోసం తీసుకువచ్చిన వెసులుబాటుగా సర్కారు పేర్కొంది.
ఇక, అన్నీ నాణ్యమైన బ్రాండ్లనే అందుబాటులో ఉంచనున్నారు. దీని ప్రకారం సాధారణ మద్యం ప్రారంభ ధర రూ.99 నుంచి మొదలవుతుంది. అయితే.. నాణ్యమైన బ్రాండ్ల ధరలు కంపెనీలు.. ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయిస్తాయి. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులను రిజర్వ్ చేశారు.
ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే వాటిని కేటాయించనున్నారు. ఈ డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉండడం గమనార్హం. అయితే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇక, దీనివల్ల కల్లుగీత కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందన్నారు.
వైసీపీ హయాంలో కొన్ని రకాల మద్యమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు కూటమి సర్కారు అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇవి రెండేళ్లపాటు ఉంటాయి.
దీనికిగాను తిరిగి చెల్లించని విధానంలో సర్కారు వారు 2 లక్షల రూపాయలను దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. వ్యాపారంలో యజమానికి 20 శాతం లాభం వచ్చేలా మద్యం పాలసీని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మంది జనాభాకు ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఏపీలో 12 ప్రీమియర్ లిక్కర్ షాపులను ఏర్పాటు చేయనున్నారు.
This post was last modified on September 18, 2024 8:57 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…