Political News

జ‌మిలికి జై! కేంద్ర కేబినెట్ ఓకే!!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప‌దే ప‌దే చెబుతున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాజాగా మ‌రింత ముంద‌డుగు ప‌డింది. జ‌మిలి ఎన్నిక‌ల‌కు తాజాగా జ‌రిగిన మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వ‌ర్గం జై కొట్టింది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌కు ఓకే చెప్పింది.

జ‌మిలి ఎన్నిక‌ల‌ను ముక్త‌కంఠంతో కేంద్ర కేబినెట్ స్వాగ‌తించింది. “వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్‌” నినాదాన్ని అందిపుచ్చుకుంది. ప్ర‌ధాని గ‌త ఆగ‌స్టు 15న ఎర్ర‌కోట‌పై చేసిన ప్ర‌సంగంలో జ‌మిలి ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. త‌మ టెర్మ్‌(ఈ పాల‌న‌లో)లోనే జ‌మిలిని నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

అప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల‌పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవ‌డం, జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించ‌డం ల‌క్ష్యంగా మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ కొన్ని సిఫార‌సులు చేస్తూ.. నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పంపించింది.

మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమొదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను అందించిన విష‌యం తెలిసింది. ఈ నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌.. కేంద్ర హోం శాఖ‌కు ఇటీవ‌ల పంపించింది.

దీనిపై తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మోడీ స‌హా మంత్రులు ఆమోదం తెలిపారు. అయితే.. ఈ సిఫార‌సుల్లో జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యం ఉంద‌ని పేర్కొన్నారు. ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి.

జ‌మిలి ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు రెండంచల విధానం అమ‌లు చేయాల‌ని సిఫారసు చేశారు. మొదట లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు. మొదటి దశ పూర్త‌యిన వంద రోజుల్లోపు… రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఏదైనా కారణంతో పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని మాజీ రాష్ట్ర‌ప‌తి కోవింద్ నేతృత్వంలోని క‌మిటీ సిఫారసు చేసింది. అదేవిధంగా అభ్య‌ర్థులు మ‌ర‌ణించినా.. ఇత‌ర కార‌ణాల‌తో ఎన్నిక‌లు ఆగిపోయినా.. మిగిలిన కాలానికే ఆయా స్థానాలకు(అవి ఏవైనా కూడా) ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింది. కాగా.. దీనిపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీలోనూ తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే.. కీల‌క‌మైన కేంద్ర కేబినెట్ మాత్రం తాజాగా అంగీకారం తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 18, 2024 7:12 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

39 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

1 hour ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

3 hours ago