ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా నిలబెట్టుకునేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఇక, రాజకీయంగా కూడా ప్లాంటును నిలబెట్టుకునేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, మరోవైపు ప్లాంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నర్మగర్భంగా వ్యవహరిస్తోంది దీనిని నిలబెడతామని, ప్రైవేటు పరం చేయబోమని బీజేపీ నాయకులు చెబుతున్నా.. వాస్తవానికి మాత్రం క్షేత్రస్థాయిలో మరో వ్యవహారం నడుస్తోంది.
తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారులను వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తూ.. జాతీయ గనుల విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 100 మంది ఎగ్జిక్యూటివ్ అధికారులను ఛత్తీస్గఢ్లోని స్టీల్ ప్లాంటుకు డిప్యుటేషన్పై బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామం.. విశాఖ ఉక్కుకు భారీ షాకిచ్చింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఖాళీ చేసే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నదన్న అభిప్రాయం మరింత బలపడుతోంది. ఇప్పటికే అనేక రూపాల్లో విశాఖ ఉక్కును కేంద్రం పక్కన పెట్టింది.
స్టీల్ ప్లాంట్ నిర్వహణకు నిధులూ ఇవ్వక, ఉన్న ఉద్యోగులను దేశంలోని వివిధ ప్లాంట్లలో గుట్టుచప్పుడు కాకుండా సర్దేసి… చివరకు ఏం చేద్దామని అంటూ.. కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఉద్యోగులను కూడా వాలంటరీ రిటైర్మెంట్ వైపు బలవంతంగా నెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అసలు విశాఖ ఉక్కు పరిస్థితి తీవ్ర అగమ్యగోచరంగా మారిపోయింది. ఇంకోవైపు.. “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయం… తిరిగి పునర్ వైభవం తీసుకు వస్తాం“ అని చెబుతున్న బీజేపీ నాయకులు(ముఖ్యంగా విశాఖలోని అనకాపల్లి ఎంపీ బీజేపీ నాయకుడు) ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 17, 2024 10:06 pm
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…