ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా ఇంకో మాటలో చెప్పాలంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయతీలు.. లక్ష రూపాయలు కళ్ల చూస్తున్నాయి. వాస్తవానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితిలో పంచాయతీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేరకు కోలుకునే పరిస్థితి వచ్చింది. జగన్ పాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలను దారి మళ్లించారనే అపవాదు ఉంది.
దీంతో అప్పటి వరకు అంతో ఇంతో స్వావలంబన సాధించిన పంచాయతీలు.. ఇబ్బందుల్లో కూరుకుపోవడం ప్రారంభమైంది. ఫలితంగా పంచాయతీ సభ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, పనుల సంగతి దేవుడెరుగు. మరోవైపు.. సర్పంచులు.. బిక్షాటన చేసుకున్న పరిస్తితి నుంచి.. చిరు వ్యాపారాలు చేసుకుని.. ఓలా డ్రైవర్లుగా పనిచేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరు జొమాటోలో కూడా పనిచేశారు.
ఇలా.. గ్రామ పంచాయతీలు ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఖచ్చితంగా ఇంత కీలక సమయంలో పంచాయతీలు పుంజుకునేలా డిప్యూటీ సీఎం పవన్ వ్యవహరించిన తీరు నభూతో అనే చెప్పాలి. తన సొంత సొమ్ముల నుంచి రూ.4 కోట్లను పంచాయతీలకు రూ.లక్ష చొప్పున ఆయన విరాళంగా అందించారు. ఇది ఒకరకంగా.. వెంటిలేటర్పై ఉన్న పంచాయతీలకు ఆక్సిజన్ అందించినట్టు అయింది. చనిపోతున్న వ్యక్తికి ప్రాణం పోసినట్టుగా మారింది.
లక్ష రూపాయలు చిన్న మొత్తమే అయినా.. ఇవి ఇప్పుడున్న ఒక కీలక సందర్భంతో పోల్చుకుంటే.. పంచాయతీలకు ప్రాణంతో సమానం. అందుకే.. పంచాయతీల్లో పండగ నెలకొంది. పవన్ కల్యాణ్కు పంచాయతీల్లో జేజేలు కొడుతున్నారు. చిన్నపాటి పనులు చేసేందుకు.. సర్పంచులు, సభ్యులు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. పవన్-పంచాయతీ- వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 12, 2024 10:08 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…