ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా ఇంకో మాటలో చెప్పాలంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయతీలు.. లక్ష రూపాయలు కళ్ల చూస్తున్నాయి. వాస్తవానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితిలో పంచాయతీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేరకు కోలుకునే పరిస్థితి వచ్చింది. జగన్ పాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలను దారి మళ్లించారనే అపవాదు ఉంది.
దీంతో అప్పటి వరకు అంతో ఇంతో స్వావలంబన సాధించిన పంచాయతీలు.. ఇబ్బందుల్లో కూరుకుపోవడం ప్రారంభమైంది. ఫలితంగా పంచాయతీ సభ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, పనుల సంగతి దేవుడెరుగు. మరోవైపు.. సర్పంచులు.. బిక్షాటన చేసుకున్న పరిస్తితి నుంచి.. చిరు వ్యాపారాలు చేసుకుని.. ఓలా డ్రైవర్లుగా పనిచేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరు జొమాటోలో కూడా పనిచేశారు.
ఇలా.. గ్రామ పంచాయతీలు ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఖచ్చితంగా ఇంత కీలక సమయంలో పంచాయతీలు పుంజుకునేలా డిప్యూటీ సీఎం పవన్ వ్యవహరించిన తీరు నభూతో అనే చెప్పాలి. తన సొంత సొమ్ముల నుంచి రూ.4 కోట్లను పంచాయతీలకు రూ.లక్ష చొప్పున ఆయన విరాళంగా అందించారు. ఇది ఒకరకంగా.. వెంటిలేటర్పై ఉన్న పంచాయతీలకు ఆక్సిజన్ అందించినట్టు అయింది. చనిపోతున్న వ్యక్తికి ప్రాణం పోసినట్టుగా మారింది.
లక్ష రూపాయలు చిన్న మొత్తమే అయినా.. ఇవి ఇప్పుడున్న ఒక కీలక సందర్భంతో పోల్చుకుంటే.. పంచాయతీలకు ప్రాణంతో సమానం. అందుకే.. పంచాయతీల్లో పండగ నెలకొంది. పవన్ కల్యాణ్కు పంచాయతీల్లో జేజేలు కొడుతున్నారు. చిన్నపాటి పనులు చేసేందుకు.. సర్పంచులు, సభ్యులు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. పవన్-పంచాయతీ- వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 12, 2024 10:08 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…