ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పండగ వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా ఇంకో మాటలో చెప్పాలంటే.. గడిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయతీలు.. లక్ష రూపాయలు కళ్ల చూస్తున్నాయి. వాస్తవానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న పరిస్థితిలో పంచాయతీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేరకు కోలుకునే పరిస్థితి వచ్చింది. జగన్ పాలన కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలను దారి మళ్లించారనే అపవాదు ఉంది.
దీంతో అప్పటి వరకు అంతో ఇంతో స్వావలంబన సాధించిన పంచాయతీలు.. ఇబ్బందుల్లో కూరుకుపోవడం ప్రారంభమైంది. ఫలితంగా పంచాయతీ సభ్యులు టీ తాగేందుకు కూడా సొంత జేబులో నుంచి రూపాయి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, పనుల సంగతి దేవుడెరుగు. మరోవైపు.. సర్పంచులు.. బిక్షాటన చేసుకున్న పరిస్తితి నుంచి.. చిరు వ్యాపారాలు చేసుకుని.. ఓలా డ్రైవర్లుగా పనిచేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరు జొమాటోలో కూడా పనిచేశారు.
ఇలా.. గ్రామ పంచాయతీలు ఒక ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఖచ్చితంగా ఇంత కీలక సమయంలో పంచాయతీలు పుంజుకునేలా డిప్యూటీ సీఎం పవన్ వ్యవహరించిన తీరు నభూతో అనే చెప్పాలి. తన సొంత సొమ్ముల నుంచి రూ.4 కోట్లను పంచాయతీలకు రూ.లక్ష చొప్పున ఆయన విరాళంగా అందించారు. ఇది ఒకరకంగా.. వెంటిలేటర్పై ఉన్న పంచాయతీలకు ఆక్సిజన్ అందించినట్టు అయింది. చనిపోతున్న వ్యక్తికి ప్రాణం పోసినట్టుగా మారింది.
లక్ష రూపాయలు చిన్న మొత్తమే అయినా.. ఇవి ఇప్పుడున్న ఒక కీలక సందర్భంతో పోల్చుకుంటే.. పంచాయతీలకు ప్రాణంతో సమానం. అందుకే.. పంచాయతీల్లో పండగ నెలకొంది. పవన్ కల్యాణ్కు పంచాయతీల్లో జేజేలు కొడుతున్నారు. చిన్నపాటి పనులు చేసేందుకు.. సర్పంచులు, సభ్యులు కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. పవన్-పంచాయతీ- వితౌట్ పాలిటిక్స్ అనే మాట జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…