Political News

అమరావతి పోరాటంలోకి అశ్వినీద‌త్‌

సినీ నిర్మాత‌, పార్ట్ టైం పొలిటీషియ‌న్ కూడా అయిన అశ్వినీద‌త్ తెలుగుదేశం పార్టీకి గ‌ట్టి మ‌ద్ద‌తుదార‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది అధికారంలోకి వ‌చ్చిన వైకాపా స‌ర్కారు అమ‌రావతి నుంచి రాజ‌ధానిని విశాఖ‌ప‌ట్నానికి త‌ర‌లించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి రైతుల కోసం పోరాడుతుంటే అత‌డి అన్న‌య్య‌ మెగాస్టార్ చిరంజీవి వెళ్లి ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కల‌వ‌డాన్ని అశ్వినీద‌త్ త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ద‌త్ అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించ‌డాన్ని నిర‌సిస్తూ కోర్టుకెక్కారు. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో గన్నవరం ఎయిర్‌పోర్టు కోసం ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఆయ‌న‌ 39 ఎకరాలు ఇచ్చారు.

ఐతే దానికి సంబంధించి ఆ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌ను వైకాపా స‌ర్కారు తుంగ‌లో తొక్క‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. తాను ప్ర‌భుత్వానికి ఇచ్చిన‌ భూమి ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని.. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని.. కానీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం రాజధానిని వేరే చోటకు తరలించాలని నిర్ణయించిందని.. దీంతో తన‌కు అమ‌రావ‌తిలో ఇస్తామ‌న్న‌ భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి నెలకొందని ద‌త్ త‌న పిటిష‌న్లో తెలిపారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ‌ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని.. భూసేక‌ర‌ణ చ‌ట్టం కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని ఆయ‌న‌‌ పేర్కొన్నారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ దత్‌ పిటిషన్‌ వేశారు.

suman

Recent Posts

తెలంగాణ విషయంలో పవన్ కు బాబు మద్దతు

తెలంగాణ‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన…

7 minutes ago

లేబర్ అడ్డా అదిరిందండోయ్!

ఏదైనా భవన నిర్మాణమైనా, రోడ్డు నిర్మాణమైనా… అందుకోసం చాలా మంది కార్మికులు అవసరం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని…

10 minutes ago

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

1 hour ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

3 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

4 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

5 hours ago