ఏపీలో ఒకవైపు వరదలు మరోవైపు.. వర్షాలు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయకులను గత అర్థరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
వీరిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను గురువారం తెల్లవారు జామున మంగళగిరిలోని ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న విజయవాడ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ భర్త.. ప్రముఖ కాంట్రాక్టర్ అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు యువ నాయకుడు దేవినేని అవినాష్ను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. ఆయన పోలీసుల కళ్లుగప్పి.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఎమ్మెల్సీలు.. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల అరెస్టుకు కూడా రంగం రెడీ అయినట్టు సమాచారం. వారిద్దరినీ అరెస్టు చేయాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని.. మండలి చైర్మన్.. మోషేన్ రాజుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆయన అందుబాటులో లేకపోవడంతో అరెస్టు వాయిదా పడినట్టు తెలుస్తోంది. బుధవారం వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా తగిన గడువు ఇవ్వకపోవడంతోపాటు.. కుట్రకోణం ఉందంటూ.. న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో రాత్రికి రాత్రి.. టీడీపీ ఆఫీసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రోజు రేపట్లో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…