ఏపీలో ఒకవైపు వరదలు మరోవైపు.. వర్షాలు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వైసీపీ నాయకులను గత అర్థరాత్రి నుంచి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతానికి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
వీరిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను గురువారం తెల్లవారు జామున మంగళగిరిలోని ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న విజయవాడ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ భర్త.. ప్రముఖ కాంట్రాక్టర్ అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు యువ నాయకుడు దేవినేని అవినాష్ను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. ఆయన పోలీసుల కళ్లుగప్పి.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఎమ్మెల్సీలు.. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిల అరెస్టుకు కూడా రంగం రెడీ అయినట్టు సమాచారం. వారిద్దరినీ అరెస్టు చేయాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని.. మండలి చైర్మన్.. మోషేన్ రాజుకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆయన అందుబాటులో లేకపోవడంతో అరెస్టు వాయిదా పడినట్టు తెలుస్తోంది. బుధవారం వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
అంతేకాదు.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా తగిన గడువు ఇవ్వకపోవడంతోపాటు.. కుట్రకోణం ఉందంటూ.. న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో రాత్రికి రాత్రి.. టీడీపీ ఆఫీసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రోజు రేపట్లో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on September 5, 2024 12:51 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…