Political News

చంద్ర‌బాబు జాగారం.. రాత్రంతా స‌మీక్ష‌లు.. కాన్ఫ‌రెన్సులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజ‌య‌వాడ ప‌రిస‌రప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోవ‌డం తో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వ‌కుండా.. ప‌దే ప‌దే వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్క‌డి నుంచే విజ‌య‌వాడ ప‌రిస్థితిని ఆయ‌న గంట గంట‌కూ స‌మీక్షించారు. బాధితుల‌కు ఆహారం , తాగునీరు అందించే బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్ప‌గించారు.

ఇదేస‌మ‌యంలో మంత్రులు ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే విజ‌య‌వాడ‌కు రావాల‌ని ఆదేశించారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారిని ఎంత రాత్ర‌యినా కూడా ఆదుకోవాల‌ని.. వారికి పులిహోర‌, పెరుగ‌న్నం త‌క్ష‌ణం అందించాల‌ని అన్ని ప్రైవేటు హోట‌ళ్ల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అదేస‌మ‌యంలో 5 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను త‌క్ష‌ణం బాధిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. ఈ బాధ్య‌త‌ల‌ను కూడా పార్టీ నాయ‌కులు, మంత్రులు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా అల‌స‌త్వం చేస్తే.. స‌హించేది లేద‌న్నారు. రాత్రి పూట కూడా.. మ‌రో సారి సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌వారిని ప‌రామ‌ర్శించారు.

కేంద్రం నుంచి సాయం

చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఫోన్ చేసి.. విజ‌య‌వాడ స‌హా.. రాష్ట్రంలో నెల‌కొన్న వ‌ర‌ద ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండ‌గా ఉంటామ‌ని.. అన్ని విధాలా సాయం చేస్తామ‌ని చంద్ర‌బాబుకు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆవెంట‌నే 6 హెలికాప్ట‌ర్ల‌ను విజ‌య‌వాడ‌కు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పున‌రావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిల‌ట‌రీ సాయం కూడా అందిస్తామ‌ని తెలిపింది. బాధితుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండేందుకు తాము కూడా ప‌నిచేస్తామ‌న్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళ‌ల్లో కూడా చంద్ర‌బాబు నేతృత్వంలో స‌హాయం అందించేందుకు సిబ్బంది యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ముందుకు క‌దిలారు.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

1 hour ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago