Political News

చంద్ర‌బాబు జాగారం.. రాత్రంతా స‌మీక్ష‌లు.. కాన్ఫ‌రెన్సులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజ‌య‌వాడ ప‌రిస‌రప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోవ‌డం తో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వ‌కుండా.. ప‌దే ప‌దే వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్క‌డి నుంచే విజ‌య‌వాడ ప‌రిస్థితిని ఆయ‌న గంట గంట‌కూ స‌మీక్షించారు. బాధితుల‌కు ఆహారం , తాగునీరు అందించే బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్ప‌గించారు.

ఇదేస‌మ‌యంలో మంత్రులు ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే విజ‌య‌వాడ‌కు రావాల‌ని ఆదేశించారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారిని ఎంత రాత్ర‌యినా కూడా ఆదుకోవాల‌ని.. వారికి పులిహోర‌, పెరుగ‌న్నం త‌క్ష‌ణం అందించాల‌ని అన్ని ప్రైవేటు హోట‌ళ్ల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అదేస‌మ‌యంలో 5 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను త‌క్ష‌ణం బాధిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. ఈ బాధ్య‌త‌ల‌ను కూడా పార్టీ నాయ‌కులు, మంత్రులు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా అల‌స‌త్వం చేస్తే.. స‌హించేది లేద‌న్నారు. రాత్రి పూట కూడా.. మ‌రో సారి సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌వారిని ప‌రామ‌ర్శించారు.

కేంద్రం నుంచి సాయం

చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఫోన్ చేసి.. విజ‌య‌వాడ స‌హా.. రాష్ట్రంలో నెల‌కొన్న వ‌ర‌ద ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండ‌గా ఉంటామ‌ని.. అన్ని విధాలా సాయం చేస్తామ‌ని చంద్ర‌బాబుకు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆవెంట‌నే 6 హెలికాప్ట‌ర్ల‌ను విజ‌య‌వాడ‌కు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పున‌రావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిల‌ట‌రీ సాయం కూడా అందిస్తామ‌ని తెలిపింది. బాధితుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండేందుకు తాము కూడా ప‌నిచేస్తామ‌న్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళ‌ల్లో కూడా చంద్ర‌బాబు నేతృత్వంలో స‌హాయం అందించేందుకు సిబ్బంది యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ముందుకు క‌దిలారు.

This post was last modified on September 2, 2024 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago