Political News

చంద్ర‌బాబు జాగారం.. రాత్రంతా స‌మీక్ష‌లు.. కాన్ఫ‌రెన్సులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజ‌య‌వాడ ప‌రిస‌రప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోవ‌డం తో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వ‌కుండా.. ప‌దే ప‌దే వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్క‌డి నుంచే విజ‌య‌వాడ ప‌రిస్థితిని ఆయ‌న గంట గంట‌కూ స‌మీక్షించారు. బాధితుల‌కు ఆహారం , తాగునీరు అందించే బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్ప‌గించారు.

ఇదేస‌మ‌యంలో మంత్రులు ఎక్క‌డున్నా త‌క్ష‌ణ‌మే విజ‌య‌వాడ‌కు రావాల‌ని ఆదేశించారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారిని ఎంత రాత్ర‌యినా కూడా ఆదుకోవాల‌ని.. వారికి పులిహోర‌, పెరుగ‌న్నం త‌క్ష‌ణం అందించాల‌ని అన్ని ప్రైవేటు హోట‌ళ్ల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. అదేస‌మ‌యంలో 5 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్ల‌ను త‌క్ష‌ణం బాధిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించారు. ఈ బాధ్య‌త‌ల‌ను కూడా పార్టీ నాయ‌కులు, మంత్రులు తీసుకోవాల‌న్నారు. ఎక్క‌డా అల‌స‌త్వం చేస్తే.. స‌హించేది లేద‌న్నారు. రాత్రి పూట కూడా.. మ‌రో సారి సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌వారిని ప‌రామ‌ర్శించారు.

కేంద్రం నుంచి సాయం

చంద్ర‌బాబుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఫోన్ చేసి.. విజ‌య‌వాడ స‌హా.. రాష్ట్రంలో నెల‌కొన్న వ‌ర‌ద ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండ‌గా ఉంటామ‌ని.. అన్ని విధాలా సాయం చేస్తామ‌ని చంద్ర‌బాబుకు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఆవెంట‌నే 6 హెలికాప్ట‌ర్ల‌ను విజ‌య‌వాడ‌కు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పున‌రావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిల‌ట‌రీ సాయం కూడా అందిస్తామ‌ని తెలిపింది. బాధితుల‌కు అన్ని విధాలా అండ‌గా ఉండేందుకు తాము కూడా ప‌నిచేస్తామ‌న్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళ‌ల్లో కూడా చంద్ర‌బాబు నేతృత్వంలో స‌హాయం అందించేందుకు సిబ్బంది యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ముందుకు క‌దిలారు.

This post was last modified on September 2, 2024 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

37 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago