ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజయవాడ పరిసరప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడం తో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వకుండా.. పదే పదే వారి నుంచి కూడా సమాచారం సేకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే సీఎం ఉన్నారు. అక్కడి నుంచే విజయవాడ పరిస్థితిని ఆయన గంట గంటకూ సమీక్షించారు. బాధితులకు ఆహారం , తాగునీరు అందించే బాధ్యతలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్పగించారు.
ఇదేసమయంలో మంత్రులు ఎక్కడున్నా తక్షణమే విజయవాడకు రావాలని ఆదేశించారు. ఆకలితో అలమటిస్తున్నవారిని ఎంత రాత్రయినా కూడా ఆదుకోవాలని.. వారికి పులిహోర, పెరుగన్నం తక్షణం అందించాలని అన్ని ప్రైవేటు హోటళ్లను చంద్రబాబు ఆదేశించారు. అదేసమయంలో 5 లక్షల వాటర్ బాటిళ్లను తక్షణం బాధిత ప్రాంతాలకు తరలించాలని కూడా చంద్రబాబు సూచించారు. ఈ బాధ్యతలను కూడా పార్టీ నాయకులు, మంత్రులు తీసుకోవాలన్నారు. ఎక్కడా అలసత్వం చేస్తే.. సహించేది లేదన్నారు. రాత్రి పూట కూడా.. మరో సారి సింగ్ నగర్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్నవారిని పరామర్శించారు.
కేంద్రం నుంచి సాయం
చంద్రబాబుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి.. విజయవాడ సహా.. రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని.. అన్ని విధాలా సాయం చేస్తామని చంద్రబాబుకు ఆయన భరోసా ఇచ్చారు. ఆవెంటనే 6 హెలికాప్టర్లను విజయవాడకు పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం అందించేందుకు మిలటరీ సాయం కూడా అందిస్తామని తెలిపింది. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు తాము కూడా పనిచేస్తామన్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని కూడా.. పంపించారు. కాగా.. రాత్రి వేళల్లో కూడా చంద్రబాబు నేతృత్వంలో సహాయం అందించేందుకు సిబ్బంది యుద్ధప్రాతిపదికన ముందుకు కదిలారు.
This post was last modified on September 2, 2024 11:19 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…