Political News

పిఠాపురంలో ఉన్న‌తాధికారుల డిష్యుం-డిష్యుం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోని విధంగా ఇక్క‌డ ఉన్న‌తాధికారులు ఒక‌రినొకరు బూతులు తిట్టుకుని.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు రోజులు అయిన త‌ర్వాత‌.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పిఠాపురం మునిసిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు.. త‌మ వార్డుల్లో ప‌నులు చేయ‌డం లేద‌ని.. క‌నీసం చెత్త కూడా తీయ‌డం లేద‌ని ఆరోపించారు. దీనికి క‌మిష‌న‌ర్ క‌న‌కారావు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశా రు. దీంతో ఆయ‌న స‌మాధానం చెబుతూ.. డీఈఈ భ‌వానీ శంక‌ర్‌.. నిద్ర పోతున్నార‌ని.. ఆయ‌న అల‌స‌త్వం కార‌ణంగానే ప‌నులు నిలిచిపోతున్నాయ‌ని.. ఇప్ప‌టికైనా.. ఆయ‌న మేల్కొని రాష్ట్రంలో అధికారం మారింద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సాధార‌ణంగా క‌మిష‌న‌ర్ ఉన్న‌త స్థాయి అధికారి. డీఈఈ ఆయ‌న కింద ప‌నిచేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ స‌మ‌యంలో డీఈఈ భ‌వానీ శంక‌ర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. క‌మిష‌న‌ర్ క‌న‌కారావుపై రివ‌ర్స్ దాడి చేశారు. నీవ‌ల్లే ఎలాంటి ప‌నులు కావ‌డం లేద‌ని.. నీ వ‌ల్ల అవినీతి పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. స‌హ‌నం కోల్పోయిన‌.. డీఈఈ క‌మిష‌న‌ర్‌పై చేయి చేసుకున్నారు.

దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశం అయింది. సాధార‌ణంగా.. ఎక్క‌డ కౌన్సిల్ స‌మావేశాలు జ‌రిగినా అధికార ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కౌన్సిల‌ర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మ‌రి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on September 1, 2024 10:41 am

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

11 minutes ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

2 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

4 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

6 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

6 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

7 hours ago