Political News

పిఠాపురంలో ఉన్న‌తాధికారుల డిష్యుం-డిష్యుం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోని విధంగా ఇక్క‌డ ఉన్న‌తాధికారులు ఒక‌రినొకరు బూతులు తిట్టుకుని.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు రోజులు అయిన త‌ర్వాత‌.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పిఠాపురం మునిసిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు.. త‌మ వార్డుల్లో ప‌నులు చేయ‌డం లేద‌ని.. క‌నీసం చెత్త కూడా తీయ‌డం లేద‌ని ఆరోపించారు. దీనికి క‌మిష‌న‌ర్ క‌న‌కారావు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశా రు. దీంతో ఆయ‌న స‌మాధానం చెబుతూ.. డీఈఈ భ‌వానీ శంక‌ర్‌.. నిద్ర పోతున్నార‌ని.. ఆయ‌న అల‌స‌త్వం కార‌ణంగానే ప‌నులు నిలిచిపోతున్నాయ‌ని.. ఇప్ప‌టికైనా.. ఆయ‌న మేల్కొని రాష్ట్రంలో అధికారం మారింద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సాధార‌ణంగా క‌మిష‌న‌ర్ ఉన్న‌త స్థాయి అధికారి. డీఈఈ ఆయ‌న కింద ప‌నిచేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ స‌మ‌యంలో డీఈఈ భ‌వానీ శంక‌ర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. క‌మిష‌న‌ర్ క‌న‌కారావుపై రివ‌ర్స్ దాడి చేశారు. నీవ‌ల్లే ఎలాంటి ప‌నులు కావ‌డం లేద‌ని.. నీ వ‌ల్ల అవినీతి పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. స‌హ‌నం కోల్పోయిన‌.. డీఈఈ క‌మిష‌న‌ర్‌పై చేయి చేసుకున్నారు.

దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశం అయింది. సాధార‌ణంగా.. ఎక్క‌డ కౌన్సిల్ స‌మావేశాలు జ‌రిగినా అధికార ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కౌన్సిల‌ర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మ‌రి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on September 1, 2024 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago