ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చోటు చేసుకోని విధంగా ఇక్కడ ఉన్నతాధికారులు ఒకరినొకరు బూతులు తిట్టుకుని.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయిన తర్వాత.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు.. తమ వార్డుల్లో పనులు చేయడం లేదని.. కనీసం చెత్త కూడా తీయడం లేదని ఆరోపించారు. దీనికి కమిషనర్ కనకారావు సమాధానం చెప్పాలని నిలదీశా రు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. డీఈఈ భవానీ శంకర్.. నిద్ర పోతున్నారని.. ఆయన అలసత్వం కారణంగానే పనులు నిలిచిపోతున్నాయని.. ఇప్పటికైనా.. ఆయన మేల్కొని రాష్ట్రంలో అధికారం మారిందన్న విషయాన్ని గుర్తించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా కమిషనర్ ఉన్నత స్థాయి అధికారి. డీఈఈ ఆయన కింద పనిచేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ సమయంలో డీఈఈ భవానీ శంకర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. కమిషనర్ కనకారావుపై రివర్స్ దాడి చేశారు. నీవల్లే ఎలాంటి పనులు కావడం లేదని.. నీ వల్ల అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. సహనం కోల్పోయిన.. డీఈఈ కమిషనర్పై చేయి చేసుకున్నారు.
దీంతో ఈ వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. సాధారణంగా.. ఎక్కడ కౌన్సిల్ సమావేశాలు జరిగినా అధికార ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మరి తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on September 1, 2024 10:41 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…