Political News

పిఠాపురంలో ఉన్న‌తాధికారుల డిష్యుం-డిష్యుం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోని విధంగా ఇక్క‌డ ఉన్న‌తాధికారులు ఒక‌రినొకరు బూతులు తిట్టుకుని.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు రోజులు అయిన త‌ర్వాత‌.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పిఠాపురం మునిసిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు.. త‌మ వార్డుల్లో ప‌నులు చేయ‌డం లేద‌ని.. క‌నీసం చెత్త కూడా తీయ‌డం లేద‌ని ఆరోపించారు. దీనికి క‌మిష‌న‌ర్ క‌న‌కారావు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశా రు. దీంతో ఆయ‌న స‌మాధానం చెబుతూ.. డీఈఈ భ‌వానీ శంక‌ర్‌.. నిద్ర పోతున్నార‌ని.. ఆయ‌న అల‌స‌త్వం కార‌ణంగానే ప‌నులు నిలిచిపోతున్నాయ‌ని.. ఇప్ప‌టికైనా.. ఆయ‌న మేల్కొని రాష్ట్రంలో అధికారం మారింద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సాధార‌ణంగా క‌మిష‌న‌ర్ ఉన్న‌త స్థాయి అధికారి. డీఈఈ ఆయ‌న కింద ప‌నిచేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ స‌మ‌యంలో డీఈఈ భ‌వానీ శంక‌ర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. క‌మిష‌న‌ర్ క‌న‌కారావుపై రివ‌ర్స్ దాడి చేశారు. నీవ‌ల్లే ఎలాంటి ప‌నులు కావ‌డం లేద‌ని.. నీ వ‌ల్ల అవినీతి పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. స‌హ‌నం కోల్పోయిన‌.. డీఈఈ క‌మిష‌న‌ర్‌పై చేయి చేసుకున్నారు.

దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశం అయింది. సాధార‌ణంగా.. ఎక్క‌డ కౌన్సిల్ స‌మావేశాలు జ‌రిగినా అధికార ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కౌన్సిల‌ర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మ‌రి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on September 1, 2024 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago