ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చోటు చేసుకోని విధంగా ఇక్కడ ఉన్నతాధికారులు ఒకరినొకరు బూతులు తిట్టుకుని.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయిన తర్వాత.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు.. తమ వార్డుల్లో పనులు చేయడం లేదని.. కనీసం చెత్త కూడా తీయడం లేదని ఆరోపించారు. దీనికి కమిషనర్ కనకారావు సమాధానం చెప్పాలని నిలదీశా రు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. డీఈఈ భవానీ శంకర్.. నిద్ర పోతున్నారని.. ఆయన అలసత్వం కారణంగానే పనులు నిలిచిపోతున్నాయని.. ఇప్పటికైనా.. ఆయన మేల్కొని రాష్ట్రంలో అధికారం మారిందన్న విషయాన్ని గుర్తించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా కమిషనర్ ఉన్నత స్థాయి అధికారి. డీఈఈ ఆయన కింద పనిచేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ సమయంలో డీఈఈ భవానీ శంకర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. కమిషనర్ కనకారావుపై రివర్స్ దాడి చేశారు. నీవల్లే ఎలాంటి పనులు కావడం లేదని.. నీ వల్ల అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. సహనం కోల్పోయిన.. డీఈఈ కమిషనర్పై చేయి చేసుకున్నారు.
దీంతో ఈ వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. సాధారణంగా.. ఎక్కడ కౌన్సిల్ సమావేశాలు జరిగినా అధికార ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మరి తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…