Political News

పిఠాపురంలో ఉన్న‌తాధికారుల డిష్యుం-డిష్యుం!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు చోటు చేసుకోని విధంగా ఇక్క‌డ ఉన్న‌తాధికారులు ఒక‌రినొకరు బూతులు తిట్టుకుని.. ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకునే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు రోజులు అయిన త‌ర్వాత‌.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పిఠాపురం మునిసిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో కౌన్సిల‌ర్లు.. త‌మ వార్డుల్లో ప‌నులు చేయ‌డం లేద‌ని.. క‌నీసం చెత్త కూడా తీయ‌డం లేద‌ని ఆరోపించారు. దీనికి క‌మిష‌న‌ర్ క‌న‌కారావు స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశా రు. దీంతో ఆయ‌న స‌మాధానం చెబుతూ.. డీఈఈ భ‌వానీ శంక‌ర్‌.. నిద్ర పోతున్నార‌ని.. ఆయ‌న అల‌స‌త్వం కార‌ణంగానే ప‌నులు నిలిచిపోతున్నాయ‌ని.. ఇప్ప‌టికైనా.. ఆయ‌న మేల్కొని రాష్ట్రంలో అధికారం మారింద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

సాధార‌ణంగా క‌మిష‌న‌ర్ ఉన్న‌త స్థాయి అధికారి. డీఈఈ ఆయ‌న కింద ప‌నిచేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ స‌మ‌యంలో డీఈఈ భ‌వానీ శంక‌ర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. క‌మిష‌న‌ర్ క‌న‌కారావుపై రివ‌ర్స్ దాడి చేశారు. నీవ‌ల్లే ఎలాంటి ప‌నులు కావ‌డం లేద‌ని.. నీ వ‌ల్ల అవినీతి పెరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. స‌హ‌నం కోల్పోయిన‌.. డీఈఈ క‌మిష‌న‌ర్‌పై చేయి చేసుకున్నారు.

దీంతో ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశం అయింది. సాధార‌ణంగా.. ఎక్క‌డ కౌన్సిల్ స‌మావేశాలు జ‌రిగినా అధికార ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కౌన్సిల‌ర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మ‌రి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on September 1, 2024 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago