ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏక్షణంలో ఎలా మారుతాయో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. వారి పదవులకు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మరింత మంది పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు , వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీ ప్రభుత్వం పోయి.. మరో పార్టీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి మార్పులు కామన్గా మారాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతోంది.
దీనిని ప్రలోభాల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. నాయకులకు అవసరాలు కూడా అలానే ఉన్నాయి. వారి వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు.. వంటివి కూడా జంపింగులకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు పార్టీలు మారుతున్నారు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అధికారం కూడా మారిపోతున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏపీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు.
అయితే.. ఇప్పటి వరకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నవారి విషయాన్ని గమనిస్తే.. రాజ్యసభ, శాసన మండలి నాయకులే ఉన్నారు. వీరు ప్రస్తుతం ఆయా పదవుల్లో ఉన్నారు. అయితే.. వీరి అవసరం కూటమి సర్కారుకు ఉంది. మండలిలో టీడీపీకి బలమైన పక్షం లేదు. రాజ్యసభలో అసలు సభ్యులే లేరు. దీంతో వారిని తీసుకునేందుకు కూటమి పార్టీలు ఒక ఫార్ములా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు జంప్ అవుతున్న వారి జాబితాలో వీరే కనిపిస్తున్నారు.
కానీ, శాసన సభకు వచ్చే సరికి కూటమికే లెక్కకు మించిన నాయకులు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేల తో కూటమి ప్రభుత్వం కిక్కిరిసి పోయింది. సో.. ఇంతకు మించి వచ్చినా.. అవసరంలేదు. మరీ ముఖ్యంగా టీడీపీకే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం.. అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే.. ఎమ్మెల్యేల జోలికి పోకుండా.. కూటమి పార్టీలు.. రాజ్యసభ, మండలి సభ్యులను మాత్రమే టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే.. వైసీపీకి ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 30, 2024 10:29 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…