ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏక్షణంలో ఎలా మారుతాయో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. వారి పదవులకు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మరింత మంది పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు , వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీ ప్రభుత్వం పోయి.. మరో పార్టీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి మార్పులు కామన్గా మారాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతోంది.
దీనిని ప్రలోభాల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. నాయకులకు అవసరాలు కూడా అలానే ఉన్నాయి. వారి వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు.. వంటివి కూడా జంపింగులకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు పార్టీలు మారుతున్నారు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అధికారం కూడా మారిపోతున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏపీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు.
అయితే.. ఇప్పటి వరకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నవారి విషయాన్ని గమనిస్తే.. రాజ్యసభ, శాసన మండలి నాయకులే ఉన్నారు. వీరు ప్రస్తుతం ఆయా పదవుల్లో ఉన్నారు. అయితే.. వీరి అవసరం కూటమి సర్కారుకు ఉంది. మండలిలో టీడీపీకి బలమైన పక్షం లేదు. రాజ్యసభలో అసలు సభ్యులే లేరు. దీంతో వారిని తీసుకునేందుకు కూటమి పార్టీలు ఒక ఫార్ములా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు జంప్ అవుతున్న వారి జాబితాలో వీరే కనిపిస్తున్నారు.
కానీ, శాసన సభకు వచ్చే సరికి కూటమికే లెక్కకు మించిన నాయకులు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేల తో కూటమి ప్రభుత్వం కిక్కిరిసి పోయింది. సో.. ఇంతకు మించి వచ్చినా.. అవసరంలేదు. మరీ ముఖ్యంగా టీడీపీకే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం.. అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే.. ఎమ్మెల్యేల జోలికి పోకుండా.. కూటమి పార్టీలు.. రాజ్యసభ, మండలి సభ్యులను మాత్రమే టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే.. వైసీపీకి ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 30, 2024 10:29 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…