ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏక్షణంలో ఎలా మారుతాయో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. వారి పదవులకు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మరింత మంది పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు , వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీ ప్రభుత్వం పోయి.. మరో పార్టీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి మార్పులు కామన్గా మారాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతోంది.
దీనిని ప్రలోభాల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. నాయకులకు అవసరాలు కూడా అలానే ఉన్నాయి. వారి వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు.. వంటివి కూడా జంపింగులకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులు పార్టీలు మారుతున్నారు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా అధికారం కూడా మారిపోతున్న పరిస్థితులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏపీలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలను ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు.
అయితే.. ఇప్పటి వరకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నవారి విషయాన్ని గమనిస్తే.. రాజ్యసభ, శాసన మండలి నాయకులే ఉన్నారు. వీరు ప్రస్తుతం ఆయా పదవుల్లో ఉన్నారు. అయితే.. వీరి అవసరం కూటమి సర్కారుకు ఉంది. మండలిలో టీడీపీకి బలమైన పక్షం లేదు. రాజ్యసభలో అసలు సభ్యులే లేరు. దీంతో వారిని తీసుకునేందుకు కూటమి పార్టీలు ఒక ఫార్ములా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు జంప్ అవుతున్న వారి జాబితాలో వీరే కనిపిస్తున్నారు.
కానీ, శాసన సభకు వచ్చే సరికి కూటమికే లెక్కకు మించిన నాయకులు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేల తో కూటమి ప్రభుత్వం కిక్కిరిసి పోయింది. సో.. ఇంతకు మించి వచ్చినా.. అవసరంలేదు. మరీ ముఖ్యంగా టీడీపీకే 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి.. ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం.. అవకాశం కూడా కనిపించడం లేదు. అందుకే.. ఎమ్మెల్యేల జోలికి పోకుండా.. కూటమి పార్టీలు.. రాజ్యసభ, మండలి సభ్యులను మాత్రమే టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో.. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే.. వైసీపీకి ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 30, 2024 10:29 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…