Political News

జ‌గ‌న‌న్న‌కు రోజా షాక్.. పార్టీకి బై!?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. ఆ పార్టీకి దూర‌మ‌వుతున్నారా? ఇక‌, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా త‌న మ‌కాం.. త‌మిళ‌నాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గ‌త రెండు రోజులుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా ఆధారాలు ల‌భించ‌లేదు. దీంతో ఇది నిజ‌మో కాదో.. అన్న చ‌ర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో రోజా ఇక‌, జ‌గ‌న‌న్న‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టేన‌ని అంటున్నారు.

చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019లో విజ‌యం ద‌క్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్ల‌పాటు అవ‌కాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. పైగా కూట‌మి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా క‌నిపించ‌డం లేద‌ని సీనియ‌ర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా త‌మిళ‌నాడులోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. అక్క‌డి ఆల‌యాల చుట్టూ తిరుగుతున్నారు.

పైగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను త‌ర‌చుగా రోజా దంపతులు క‌లుస్తుండ‌డం.. అక్క‌డి సంక్షేమ కార్య‌క్ర మాల‌కు చెక్కుల రూపంలో సాయం చేస్తుండ‌డం కూడా.. తెలిసిందే. ఇక‌, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగ‌మం చేసుకున్నార‌నేది చ‌ర్చ‌గా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. దీనికి ద‌న్నుగా.. ఎప్పుడూ త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాలైన‌.. ఫేస్ బుక్‌, ఇన్ స్టా, వాట్సాప్‌ల‌లో జ‌గ‌న్ ఫొటోలు, వైసీపీ జెండాల‌ను ఆమె తీసేశారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫొటోల‌ను, జెండాల‌ను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖ‌రి మారిపోయింది. తాజాగా ఆమె డీపీల‌ను మార్చేసి.. పూర్తిగా త‌న పేరును మాత్ర‌మే పెట్టుకున్నారు. ఎక్క‌డా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌తో ఇక‌, రోజా.. పార్టీ మార్పు ఖాయ‌మైంద‌నే చ‌ర్చ‌కు బ‌లం చేకూరింది. ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణికి త‌మిళ‌నాడు నేప‌థ్యం ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డ ఆయ‌న అగ్ర‌ద‌ర్శ‌కుడు కూడా. ఈ నేప‌థ్యంలోనే రోజా త‌న రాజీక‌య రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది.

This post was last modified on August 29, 2024 11:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago