వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో రోజా ఇక, జగనన్నకు గుడ్ బై చెప్పేసినట్టేనని అంటున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో విజయం దక్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్లపాటు అవకాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం.. పైగా కూటమి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా కనిపించడం లేదని సీనియర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పైగా తమిళనాడు సీఎం స్టాలిన్ను తరచుగా రోజా దంపతులు కలుస్తుండడం.. అక్కడి సంక్షేమ కార్యక్ర మాలకు చెక్కుల రూపంలో సాయం చేస్తుండడం కూడా.. తెలిసిందే. ఇక, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగమం చేసుకున్నారనేది చర్చగా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి దన్నుగా.. ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాలైన.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్లలో జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలను ఆమె తీసేశారు.
నిన్న మొన్నటి వరకు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జగన్ ఫొటోలను, జెండాలను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖరి మారిపోయింది. తాజాగా ఆమె డీపీలను మార్చేసి.. పూర్తిగా తన పేరును మాత్రమే పెట్టుకున్నారు. ఎక్కడా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పరిణామాలతో ఇక, రోజా.. పార్టీ మార్పు ఖాయమైందనే చర్చకు బలం చేకూరింది. ఆమె భర్త సెల్వమణికి తమిళనాడు నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన అగ్రదర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే రోజా తన రాజీకయ రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది.
This post was last modified on August 29, 2024 11:22 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…