చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్నేత మిథున్రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు, రగడ చోటు చేసుకుని.. రెడ్డప్ప ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలో రెడ్డప్ప కారు సహా కొన్ని చిన్నపాటి వాహనాలు కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా బుగ్గయింది. ఈ పరిణామాల క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి సదరు కారును బహూకరించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం.. రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్రెడ్డి ఆయనకు ఈ కారు తాళాలను అందించారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తత లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు .. తమ తప్పు లేదని వాదించుకుంటున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు విధించిన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనిపై వచ్చినా.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. తాజాగా మిధున్ రెడ్డి కూడా.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే రెడ్డప్ప ఇంటికి రావడం గమనార్హం.
This post was last modified on August 29, 2024 10:29 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…