చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్నేత మిథున్రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు, రగడ చోటు చేసుకుని.. రెడ్డప్ప ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలో రెడ్డప్ప కారు సహా కొన్ని చిన్నపాటి వాహనాలు కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా బుగ్గయింది. ఈ పరిణామాల క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి సదరు కారును బహూకరించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం.. రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్రెడ్డి ఆయనకు ఈ కారు తాళాలను అందించారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తత లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు .. తమ తప్పు లేదని వాదించుకుంటున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు విధించిన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనిపై వచ్చినా.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. తాజాగా మిధున్ రెడ్డి కూడా.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే రెడ్డప్ప ఇంటికి రావడం గమనార్హం.
This post was last modified on August 29, 2024 10:29 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…