చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్నేత మిథున్రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు, రగడ చోటు చేసుకుని.. రెడ్డప్ప ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలో రెడ్డప్ప కారు సహా కొన్ని చిన్నపాటి వాహనాలు కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా బుగ్గయింది. ఈ పరిణామాల క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి సదరు కారును బహూకరించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం.. రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్రెడ్డి ఆయనకు ఈ కారు తాళాలను అందించారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తత లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు .. తమ తప్పు లేదని వాదించుకుంటున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు విధించిన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనిపై వచ్చినా.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. తాజాగా మిధున్ రెడ్డి కూడా.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే రెడ్డప్ప ఇంటికి రావడం గమనార్హం.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…