చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్నేత మిథున్రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు పక్షాల మధ్య వివాదాలు, రగడ చోటు చేసుకుని.. రెడ్డప్ప ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలో రెడ్డప్ప కారు సహా కొన్ని చిన్నపాటి వాహనాలు కూడా దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కారు పూర్తిగా బుగ్గయింది. ఈ పరిణామాల క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి సదరు కారును బహూకరించినట్టు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం.. రెడ్డప్ప ఇంటికి వెళ్లిన మిథున్రెడ్డి ఆయనకు ఈ కారు తాళాలను అందించారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తత లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసు పికెట్లు కొనసాగుతున్నాయి. అయితే.. ఎవరికి వారు .. తమ తప్పు లేదని వాదించుకుంటున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు ఇంటికే పరిమితం కావాలని పోలీసులు విధించిన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో వారు బయటకు రావడం లేదు. ఏదైనా అత్యవసర పనిపై వచ్చినా.. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. తాజాగా మిధున్ రెడ్డి కూడా.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే రెడ్డప్ప ఇంటికి రావడం గమనార్హం.
This post was last modified on August 29, 2024 10:29 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…