గత కొంత కాలంగా మెగా అభిమానులకు, అల్లు అర్జున్కు మధ్య పెద్ద అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు.
ఓ వైపు మెగా ఫ్యామిలీలో అందరూ జనసేనకు అండగా ఉంటే.. బన్నీ మాత్రం ఫ్రెండు అని చెప్పి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడాన్ని జనసేన మద్దతుదారులు, మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై అప్పట్నుంచి సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవల మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇంతలో ఈ వ్యవహారంలోకి జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. ‘‘నాకు ఇష్టమైతే వస్తా.. ఫ్రెండు కోసం వస్తా’’ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
అల్లు అర్జున్ ఏమైనా పుడుంగి అనుకుంటున్నాడా.. అతను వస్తే ఏంటి రాకపోతే ఏంటి.. జనసేన 21కి 21 సీట్లలో గెలిచింది.. బన్నీ ప్రచారం చేసి పెట్టిన శిల్పా రవి గెలిచాడా.. అసలు అల్లు అర్జున్కు సొంతంగా ఫ్యాన్స్ ఉన్నారా.. అంటూ రెచ్చిపోయి మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్కు.. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు మధ్య ఇంకా పెరిగినట్లయింది.
వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. బన్నీని మరీ ఆ స్థాయిలో బొలిశెట్టి శ్రీనివాస్ టార్గెట్ చేయాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు.
బన్నీ చేసిన కామెంట్స్ మీద తనను మీడియా వాళ్లు స్పందించమంటే ఆ వ్యాఖ్యలే చేశానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు శ్రీనివాస్. జనసేనకు, బన్నీకి మధ్య శతృత్వం ఏమీ లేదని.. అతను మాట్లాడకుంటే తానూ మాట్లాడేవాడిని కాదని.. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on August 29, 2024 10:39 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…