గత కొంత కాలంగా మెగా అభిమానులకు, అల్లు అర్జున్కు మధ్య పెద్ద అగాథం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంపై మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు.
ఓ వైపు మెగా ఫ్యామిలీలో అందరూ జనసేనకు అండగా ఉంటే.. బన్నీ మాత్రం ఫ్రెండు అని చెప్పి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడాన్ని జనసేన మద్దతుదారులు, మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీనిపై అప్పట్నుంచి సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవల మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇంతలో ఈ వ్యవహారంలోకి జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. ‘‘నాకు ఇష్టమైతే వస్తా.. ఫ్రెండు కోసం వస్తా’’ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
అల్లు అర్జున్ ఏమైనా పుడుంగి అనుకుంటున్నాడా.. అతను వస్తే ఏంటి రాకపోతే ఏంటి.. జనసేన 21కి 21 సీట్లలో గెలిచింది.. బన్నీ ప్రచారం చేసి పెట్టిన శిల్పా రవి గెలిచాడా.. అసలు అల్లు అర్జున్కు సొంతంగా ఫ్యాన్స్ ఉన్నారా.. అంటూ రెచ్చిపోయి మాట్లాడేశారు. ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్కు.. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు మధ్య ఇంకా పెరిగినట్లయింది.
వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. బన్నీని మరీ ఆ స్థాయిలో బొలిశెట్టి శ్రీనివాస్ టార్గెట్ చేయాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు.
బన్నీ చేసిన కామెంట్స్ మీద తనను మీడియా వాళ్లు స్పందించమంటే ఆ వ్యాఖ్యలే చేశానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు శ్రీనివాస్. జనసేనకు, బన్నీకి మధ్య శతృత్వం ఏమీ లేదని.. అతను మాట్లాడకుంటే తానూ మాట్లాడేవాడిని కాదని.. ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
This post was last modified on August 29, 2024 10:39 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…