ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
గత వైసీపీ హయాంలో సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా దక్కలేదు. ఈ క్రమంలో అభివృద్దితోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సర్పంచులు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సర్పంచ్ కల్యాణి.. తన ఫిర్యాదును పురందేశ్వరికి అందించారు. తమ గ్రామంలో నిర్వహించిన కేంద్ర మంత్రి సీతారామన్ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశానని కల్యాణి తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాలని, సొమ్ములు అందించాలని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హయాంలో సర్పంచులు ఆర్థికంగా ఎంతగా నలిగిపోయారన్న దానికి ఈ కేసు ఉదాహరణ. అందుకే ఇది హైలెట్ అయింది. మరి కల్యాణికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం.
This post was last modified on August 29, 2024 10:26 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…