ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
గత వైసీపీ హయాంలో సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా దక్కలేదు. ఈ క్రమంలో అభివృద్దితోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సర్పంచులు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సర్పంచ్ కల్యాణి.. తన ఫిర్యాదును పురందేశ్వరికి అందించారు. తమ గ్రామంలో నిర్వహించిన కేంద్ర మంత్రి సీతారామన్ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశానని కల్యాణి తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాలని, సొమ్ములు అందించాలని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హయాంలో సర్పంచులు ఆర్థికంగా ఎంతగా నలిగిపోయారన్న దానికి ఈ కేసు ఉదాహరణ. అందుకే ఇది హైలెట్ అయింది. మరి కల్యాణికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం.
This post was last modified on August 29, 2024 10:26 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…