ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
గత వైసీపీ హయాంలో సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా దక్కలేదు. ఈ క్రమంలో అభివృద్దితోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సర్పంచులు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సర్పంచ్ కల్యాణి.. తన ఫిర్యాదును పురందేశ్వరికి అందించారు. తమ గ్రామంలో నిర్వహించిన కేంద్ర మంత్రి సీతారామన్ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశానని కల్యాణి తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాలని, సొమ్ములు అందించాలని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హయాంలో సర్పంచులు ఆర్థికంగా ఎంతగా నలిగిపోయారన్న దానికి ఈ కేసు ఉదాహరణ. అందుకే ఇది హైలెట్ అయింది. మరి కల్యాణికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం.
This post was last modified on August 29, 2024 10:26 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…