ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
గత వైసీపీ హయాంలో సర్పంచులు తమ సొంత నిధులు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా దక్కలేదు. ఈ క్రమంలో అభివృద్దితోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా సర్పంచులు ఖర్చు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సర్పంచ్ కల్యాణి.. తన ఫిర్యాదును పురందేశ్వరికి అందించారు. తమ గ్రామంలో నిర్వహించిన కేంద్ర మంత్రి సీతారామన్ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశానని కల్యాణి తెలిపారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును తనకు తిరిగి ఇప్పించాలని.. వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి కల్యాణి విన్నపాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాలని, సొమ్ములు అందించాలని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హయాంలో సర్పంచులు ఆర్థికంగా ఎంతగా నలిగిపోయారన్న దానికి ఈ కేసు ఉదాహరణ. అందుకే ఇది హైలెట్ అయింది. మరి కల్యాణికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం.
This post was last modified on August 29, 2024 10:26 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…