Political News

‘నిర్మ‌ల‌మ్మ‌ ప‌ర్య‌ట‌న‌కు 4 వేలు ఖ‌ర్చు పెట్టా.. ఇప్పించండి’

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామ‌న్ ప‌ర్య‌ట‌న నిమిత్తం తాను రూ.4,230 ఖ‌ర్చు పెట్టాన‌ని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాల‌ని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రికి ఓ మ‌హిళా నాయ‌కురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వార‌ధి పేరుతో బీజేపీ ప్ర‌జ‌ల నుంచి విన్న‌పాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ స‌మీపంలోని గొల్ల‌పూడి మండ‌లం, రాయ‌పాడు గ్రామానికి చెందిన స‌ర్పంచ్ కాట‌మ‌నేని క‌ల్యాణి ఫిర్యాదు చేశారు.

ఏం జ‌రిగింది?

గ‌త వైసీపీ హ‌యాంలో స‌ర్పంచులు త‌మ సొంత నిధులు ఖ‌ర్చు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం నుంచి రూపాయి కూడా ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో అభివృద్దితోపాటు.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు కూడా స‌ర్పంచులు ఖ‌ర్చు చేశారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. స‌ర్పంచ్ క‌ల్యాణి.. త‌న ఫిర్యాదును పురందేశ్వ‌రికి అందించారు. త‌మ గ్రామంలో నిర్వ‌హించిన‌ కేంద్ర మంత్రి సీతారామ‌న్‌ సభకు ప్రొటోకాల్ ఖర్చులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గొల్లపూడి మండలం రాయనపాడు గ్రామంలో 2023, డిసెంబర్ 9న కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభలో పాల్గొన్నారు. ఈసందర్బంగా అప్పటి కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు మేరకు రూ.4,230 అప్పు చేసి ఖర్చు చేశాన‌ని క‌ల్యాణి తెలిపారు. త‌ర్వాత వైసీపీ ప్రభుత్వం ఒక్క నయాపైసా కూడా చెల్లించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సొమ్మును త‌న‌కు తిరిగి ఇప్పించాల‌ని.. వ‌డ్డీలు కూడా పెరిగిపోతున్నాయ‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతో పురంధేశ్వరి ప్రస్తుత కలెక్టర్ కు వెంట‌నే ఫోన్ చేసి క‌ల్యాణి విన్న‌పాన్ని స్పెషల్ కేసు గా పరిగణిం చాల‌ని, సొమ్ములు అందించాల‌ని కోరారు. దీనికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే… ఇంత చిన్న ఎమౌంటుకే ఫిర్యాదా? అని సందేహాలు రావొచ్చు. కానీ, వైసీపీ హ‌యాంలో స‌ర్పంచులు ఆర్థికంగా ఎంత‌గా న‌లిగిపోయార‌న్న దానికి ఈ కేసు ఉదాహ‌ర‌ణ‌. అందుకే ఇది హైలెట్ అయింది. మ‌రి క‌ల్యాణికి న్యాయం జ‌రుగుతుంద‌నే ఆశిద్దాం.

Satya

Recent Posts

SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…

37 seconds ago

వాళ్లెవ్వరికీ దక్కని గౌరవం సింగీతానికి?

ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…

12 minutes ago

‘మెట్రో’పై ముక్కోణపు పోరు!

ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…

12 minutes ago

రిషికొండ ప్యాలెస్… కూటమికి గుదిబండేనా?

రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…

24 minutes ago

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

1 hour ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

2 hours ago