Political News

ఏఐ న‌గ‌రంగా అమ‌రావతి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి.. ఇక ఏఐ న‌గ‌రంగా అవ‌త‌రించ‌నుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రం గా మార‌నుంది. ప్ర‌స్తుత ప్ర‌పంచం మొత్తం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే 10 ఏళ్ల‌లో అన్ని ప్రాంతాలు, న‌గ‌రాలు, రాష్ట్రాలు కూడా.. ఏఐని అందిపు చ్చుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఉపాధి ఉద్యోగ అవ‌కాశాలు కూడా.. ఏఐలోనే ల‌భించ‌నున్నాయి. దీనిని ముందుగానే గుర్తించిన సీఎం చంద్ర‌బాబు తాజాగా.. అమ‌రావ‌తిని ఏఐ సిటీగా పేర్కొంటూ తీర్మానం చేశారు.

గురువారం అమ‌రావ‌తిపై నిర్వ‌హించిన ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌లో చంద్ర‌బాబు రాజ‌ధాని న‌గ‌రాన్ని ప్ర‌పం చ దేశాల‌కు చేరువ చేయాలంటే..ఏఐ మంత్రాన్ని ప‌ఠించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా అమరావతి లోగో ఉండాలని పేర్కొన్నారు. రాజధాని పేరులో ఇంగ్లీష్‌లో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

  • ఇక‌, ఈ స‌మీక్ష‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అమ‌రావ‌తిలో ప్ర‌స్తుతం చేప‌ట్టిన జంగిల్ క్లియ‌రెన్స్‌ను నెల రోజుల్లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.
  • అమ‌రావ‌తిలో సాంకేతిక వ్య‌వ‌స్థ‌లు మెరుగు ప‌డాల‌ని, 5జీ వ్య‌వ‌స్థ అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి పట్టే సమయంపైనా ఆయ‌న దృష్టి పెట్టారు.
  • హ్యాపీ నెస్ట్‌( రాజ‌ధాని ప్రాంతంలో నివాసం ఉండే వారికి నిర్మించి ఇచ్చే భ‌వ‌నాలు)పైనా చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. దీనిని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. ఈ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలోనే కొనేశార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.
  • విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ప‌రుగులు పెట్టించాల‌ని .. కేంద్రం నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉంద‌ని పేర్కొన్నారు.
  • అమరావతిలో రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వ‌చ్చే నెల 15 లోగా వార్షిక కౌలు చెల్లించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. దీనికి సంబంధించిన నిధుల‌ను కూడా రెడీ చేయాల‌ని ఆర్థిక శాఖ‌ను ఆయ‌న ఆదేశించారు. ఎన్నిక‌ష్టాలు ఉన్నా.. కౌలును ఆపొద్ద‌ని పేర్కొన్నారు.

This post was last modified on August 29, 2024 10:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 minute ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

1 hour ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

2 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

3 hours ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

5 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

5 hours ago