ఏపీలో సలహాదారులు కొత్తకాదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ.. అనేక శాఖలకు సలహాదారులు ఉన్నారు. అయితే.. వైసీపీ హయాంలో మాత్రం లెక్కకు మించి ప్రతి ఒక్కరికీ సలహాదారులను నియమిం చారు. ఇది వివాదానికి దారితీసింది. ఏకంగా హైకోర్టు వరకు కూడా వెళ్లింది. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదా రుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ మరిన్ని వివాదాలు ముసురుకున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టు సీరియస్గానే రియాక్ట్ అయింది.
ఇక, అప్పటి సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా సలహాదారుల నియామకాలు ప్రారంభం అయ్యాయి. అయితే.. వైసీపీ హయాంలో గుడ్డిగా జరిగిన నియామకాల మాదిరిగా కాకుండా.. ఆచి తూచి చంద్రబాబు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తొలి సలహాదారును నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖలోని మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడిని నియమిస్తూ.. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
బ్యారేజీలకు గేట్లు నిర్మించడంలోనూ.. మెకానికల్ అంశాల్లోనూ కన్నయ్య నాయుడికి 40 ఏళ్లకుపైగానే అనుభవం ఉంది. దేశంలోని పలు కీలక ప్రాజెక్టులకు ఆయన గేట్లు అమర్చారు. ఇటీవల తుంగ భద్ర నదిపై ఉన్న బ్యారేజీకి 60 అడుగుల గేటు వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆయన జల నష్టం నివారించేలా.. అంత భారీ వరదలోనూ గేటును ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు ఆయననే చంద్రబాబు జలవనరుల శాఖలోని మెకానికల్ విభాగం సలహాదారుగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
This post was last modified on August 29, 2024 10:19 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…