ఏపీలోని కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్నవారి పనితీరును అంచనా వేస్తున్నామని.. ముఖ్యమం త్రి చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. వారి పనితీరును ఆధారంగా చేసుకుని వారికి ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమయం లో గత కొన్నాళ్లుగా వివాదంగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నాయకుల తీరును చంద్రబాబు ప్రస్తావించారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిన కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రుల కుటుంబ సభ్యుల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఇలాంటి వారిని కంట్రోల్ చేసుకోవాలని.. లేకపోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు చేస్తున్న మంచి ని పక్కదారిపట్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆయన ఫైరైనట్టు తెలిసింది. దీనిని ఎవరికి వారు సరిచేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
ఇదిలావుంటే.. వచ్చే నెలతో కూటమి సర్కారుకు 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఏయే పనులు చేస్తున్నారు. ప్రజల రేటింగ్ ఎలా ఉంది..? అనే కీలక అంశాలపై వారికే స్వయంగా రిపోర్టు అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
దీనిలో కూటమి పార్టీల మంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. మరింతగా ప్రజలకు చేరువ కావాల్సి ఉందని.. ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు మరింత వివరించాలని కూడా చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
This post was last modified on August 29, 2024 5:59 pm
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…