Political News

మంత్రుల ప‌నితీరు పై ప్రోగ్రెస్ రిపోర్ట్‌: చంద్ర‌బాబు

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో మంత్రులుగా ఉన్న‌వారి ప‌నితీరును అంచ‌నా వేస్తున్నామ‌ని.. ముఖ్య‌మం త్రి చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. వారి ప‌నితీరును ఆధారంగా చేసుకుని వారికి ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తామ‌ని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

తాజాగా రాష్ట్ర కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మయం లో గ‌త కొన్నాళ్లుగా వివాదంగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయా నాయ‌కుల తీరును చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు.

ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాల‌కు కేంద్రంగా మారిన కొందరు ఎమ్మెల్యేలు, మ‌రికొంద‌రు మంత్రుల కుటుంబ స‌భ్యుల వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు.

ఇలాంటి వారిని కంట్రోల్ చేసుకోవాల‌ని.. లేక‌పోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మంచి ని ప‌క్క‌దారిప‌ట్టించేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఫైరైన‌ట్టు తెలిసింది. దీనిని ఎవ‌రికి వారు స‌రిచేసుకోవాల‌ని చంద్ర‌బాబు హితవు ప‌లికారు.

ఇదిలావుంటే.. వ‌చ్చే నెల‌తో కూట‌మి స‌ర్కారుకు 100 రోజుల పాల‌న పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మంత్రుల ప‌నితీరు ఎలా ఉంది? ఏయే ప‌నులు చేస్తున్నారు. ప్ర‌జ‌ల రేటింగ్ ఎలా ఉంది..? అనే కీల‌క అంశాల‌పై వారికే స్వ‌యంగా రిపోర్టు అందించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

దీనిలో కూట‌మి పార్టీల మంత్రులు కూడా ఉన్నార‌ని చెప్పారు. మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల్సి ఉంద‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌లకు మ‌రింత వివ‌రించాల‌ని కూడా చంద్ర‌బాబు సూచించిన‌ట్టు స‌మాచారం.

This post was last modified on August 29, 2024 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

2 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

3 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

6 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

7 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

9 hours ago