ఒకవైపు సీఎం చంద్రబాబు మొత్తుకుంటున్నారు. పద్ధతిగా వ్యవహరించాలని పార్టీ ఎమ్మెల్యేలకు గీతోప దేశం చేస్తున్నారు. పరువు తక్కువ పనులు చేయొద్దని కూడా చెబుతున్నారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అయితే.. చాలా సీరియస్ కామెంట్లే చేశారు. పద్దతిగా ఉండాలని.. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు చేయొద్దని కూడా చెప్పారు. మరి బాబు ఇంతగా చెబుతున్నా.. తమ్ముళ్లు ఎక్కడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు.
తాజాగా ఓ పేరు మోసిన రౌడీషీటర్ బర్త్డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొని సందడి చేశారు. ఏకంగా రౌడీ షీటర్ కు కేకు తినిపించి.. సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు.. ఫస్ట్ విషెస్ తానే చెబుతానంటూ.. పోటీ పడిమరీ ఈ తమ్ముడు హంగామా సృష్టించారు. కానీ, ఆయన పాల్గొన్నది ఏ సమాజ సేవ చేసిన వ్యక్తి పుట్టినరోజు కాదన్న విషయాన్ని ఆయన ఎందుకు మరిచిపోయారనేది ప్రశ్న. దీంతో ప్రస్తుతం ఈ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు గోండు శంకర్. ఈయనకు తొలిసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే.. ఆయన మాత్రం.. ఫక్తు పేరు మోసిన రౌడీషీటర్లతో సావాసం చేస్తున్నారు. తాజాగా రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంతేకాదు.. స్వయంగా కేక్ తినిపించిన ఎమ్మెల్యే శంకర్.. ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, శ్రీకాకుళం నియోజకవర్గంలో గబ్బర్ గురించి తెలియనివారు.. ఆయన ఫొటోలేని పోలీసు స్టేషన్ లేదంటే.. ఆశ్చర్యం వేస్తుంది. గతంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావుకు ఈయన రైట్ హ్యాండ్. ఎన్నికలకు ముందు.. టీడీపీకి జైకొట్టి.. శంకర్ పంచన చేరిపోయారు. అంతేకాదు.. ధర్మాన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదని అంటారు. గతంలో వీరి అకృత్యాలు భరించలేక… ప్రజలు, అప్పటి ప్రతిపక్షాలతో కలిసి నగర బంద్ ను కూడా నిర్వహించారు.
అప్పటి ప్రతిపక్ష పార్టీ.. ఇప్పటి అధికార పక్ష ఎమ్మెల్యే ఇలా రౌడీషీటర్ల పుట్టినరోజు వేడుకల్లో సందడి చేయడాన్ని కేకులు కట్ చేసి కేకలు పెట్టడాన్ని ఎలా చూడాలి. అది కూడా చంద్రబాబు హెచ్చరించి 24 గంటలు కూడా కాకుండానే ఇలా రౌడీ షీటర్లతో ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. కేకులు కట్ చేసి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వారిని ఏమనాలి? మరి ఇలాంటి వారిని ఎలా దారికి తీసుకురావాలో చంద్రబాబు ఆలోచించుకోవాలి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…