పరామర్శలు వేరు.. పరిహారం వేరు. ఈ రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసినట్టుగా వ్యవహరించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వాల్సిన జగన్.. దానిని తగ్గించి.. మీకు పరిహారం అందిందా అని ప్రశ్నించారు.
దీనికి సహజంగానే కొందరు ఇంకా అందలేదని సమాధానం చెప్పారు. మరికొందరు.. ఎంతిస్తారో.. స్ఫష్టత లేదన్నారు. నిజానికి.. ఘటన జరిగిన తర్వాత.. బాధితుల వివరాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వానికి రాలేదు. ఆ సమాచారం రాగానే.. వారి వారి అకౌంట్లలో సదరు నగదును వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే సమయంలో నకిలీలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని భావించి.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్కు బాధ్యతలు కూడా అప్పగించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇచ్చిన నివేదికను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించి.. బాధితులకు న్యాయం చేయాలని సర్కారు తలపోస్తోంది. కానీ, ఈ విషయాలను పక్కన పెట్టిన జగన్.. పరిహారాన్ని కాన్నర్ చేసుకుని.. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోతే.. తానే నేరుగా వచ్చి ధర్నా చేస్తానని.. తన ధర్నాతో ప్రభుత్వం భయపడి మీకు పరిహారం ఇస్తుందని ఆయన చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించడం సరికాదనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. ముందు ఘటనకు సంబంధించి ఆయన బాధితులను ఓదార్చాలి. ఆ తర్వాత.. సెకండరీగా పరిహారం గురించి మాట్లాడాలి. పరిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, కేవలం పరిహారమే ముందు.. అన్నట్టుగా జగన్ మాట్లాడడం.. తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే.. హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 24, 2024 11:01 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…