పరామర్శలు వేరు.. పరిహారం వేరు. ఈ రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసినట్టుగా వ్యవహరించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వాల్సిన జగన్.. దానిని తగ్గించి.. మీకు పరిహారం అందిందా అని ప్రశ్నించారు.
దీనికి సహజంగానే కొందరు ఇంకా అందలేదని సమాధానం చెప్పారు. మరికొందరు.. ఎంతిస్తారో.. స్ఫష్టత లేదన్నారు. నిజానికి.. ఘటన జరిగిన తర్వాత.. బాధితుల వివరాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వానికి రాలేదు. ఆ సమాచారం రాగానే.. వారి వారి అకౌంట్లలో సదరు నగదును వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే సమయంలో నకిలీలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని భావించి.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్కు బాధ్యతలు కూడా అప్పగించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇచ్చిన నివేదికను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించి.. బాధితులకు న్యాయం చేయాలని సర్కారు తలపోస్తోంది. కానీ, ఈ విషయాలను పక్కన పెట్టిన జగన్.. పరిహారాన్ని కాన్నర్ చేసుకుని.. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోతే.. తానే నేరుగా వచ్చి ధర్నా చేస్తానని.. తన ధర్నాతో ప్రభుత్వం భయపడి మీకు పరిహారం ఇస్తుందని ఆయన చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించడం సరికాదనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. ముందు ఘటనకు సంబంధించి ఆయన బాధితులను ఓదార్చాలి. ఆ తర్వాత.. సెకండరీగా పరిహారం గురించి మాట్లాడాలి. పరిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, కేవలం పరిహారమే ముందు.. అన్నట్టుగా జగన్ మాట్లాడడం.. తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే.. హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 24, 2024 11:01 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…