Political News

ప‌రామ‌ర్శ‌ల చోట…. జ‌గ‌న్‌ ప‌రిహార రాజ‌కీయం!

ప‌రామ‌ర్శ‌లు వేరు.. ప‌రిహారం వేరు. ఈ రెండింటికి మ‌ధ్య సున్నిత‌మైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌. తాజాగా ఆయ‌న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి విశాఖ‌లోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి భ‌రోసా ఇవ్వాల్సిన జ‌గ‌న్‌.. దానిని త‌గ్గించి.. మీకు ప‌రిహారం అందిందా అని ప్ర‌శ్నించారు.

దీనికి స‌హ‌జంగానే కొంద‌రు ఇంకా అంద‌లేద‌ని స‌మాధానం చెప్పారు. మ‌రికొంద‌రు.. ఎంతిస్తారో.. స్ఫ‌ష్ట‌త లేద‌న్నారు. నిజానికి.. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. బాధితుల వివ‌రాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి స‌మాచారం ప్ర‌భుత్వానికి రాలేదు. ఆ స‌మాచారం రాగానే.. వారి వారి అకౌంట్ల‌లో స‌ద‌రు న‌గ‌దును వేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే స‌మ‌యంలో న‌కిలీలు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని భావించి.. క్షేత్ర‌స్థాయిలో త‌హ‌సీల్దార్‌కు బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించింది.

క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో త‌హ‌సీల్దార్ ఇచ్చిన నివేదిక‌ను ఒక‌టికి రెండు సార్లు క్షుణ్నంగా ప‌రిశీలించి.. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని స‌ర్కారు త‌ల‌పోస్తోంది. కానీ, ఈ విష‌యాలను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌.. ప‌రిహారాన్ని కాన్న‌ర్ చేసుకుని.. బాధితుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం అంద‌క‌పోతే.. తానే నేరుగా వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని.. త‌న ధ‌ర్నాతో ప్ర‌భుత్వం భ‌య‌ప‌డి మీకు ప‌రిహారం ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. ముందు ఘ‌ట‌న‌కు సంబంధించి ఆయ‌న బాధితుల‌ను ఓదార్చాలి. ఆ త‌ర్వాత‌.. సెకండ‌రీగా ప‌రిహారం గురించి మాట్లాడాలి. ప‌రిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కేవ‌లం ప‌రిహార‌మే ముందు.. అన్న‌ట్టుగా జ‌గ‌న్ మాట్లాడడం.. తాను వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని చెప్ప‌డం చూస్తే.. హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

15 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago