Political News

ప‌రామ‌ర్శ‌ల చోట…. జ‌గ‌న్‌ ప‌రిహార రాజ‌కీయం!

ప‌రామ‌ర్శ‌లు వేరు.. ప‌రిహారం వేరు. ఈ రెండింటికి మ‌ధ్య సున్నిత‌మైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌. తాజాగా ఆయ‌న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి విశాఖ‌లోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి భ‌రోసా ఇవ్వాల్సిన జ‌గ‌న్‌.. దానిని త‌గ్గించి.. మీకు ప‌రిహారం అందిందా అని ప్ర‌శ్నించారు.

దీనికి స‌హ‌జంగానే కొంద‌రు ఇంకా అంద‌లేద‌ని స‌మాధానం చెప్పారు. మ‌రికొంద‌రు.. ఎంతిస్తారో.. స్ఫ‌ష్ట‌త లేద‌న్నారు. నిజానికి.. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. బాధితుల వివ‌రాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి స‌మాచారం ప్ర‌భుత్వానికి రాలేదు. ఆ స‌మాచారం రాగానే.. వారి వారి అకౌంట్ల‌లో స‌ద‌రు న‌గ‌దును వేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే స‌మ‌యంలో న‌కిలీలు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని భావించి.. క్షేత్ర‌స్థాయిలో త‌హ‌సీల్దార్‌కు బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించింది.

క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో త‌హ‌సీల్దార్ ఇచ్చిన నివేదిక‌ను ఒక‌టికి రెండు సార్లు క్షుణ్నంగా ప‌రిశీలించి.. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని స‌ర్కారు త‌ల‌పోస్తోంది. కానీ, ఈ విష‌యాలను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌.. ప‌రిహారాన్ని కాన్న‌ర్ చేసుకుని.. బాధితుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం అంద‌క‌పోతే.. తానే నేరుగా వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని.. త‌న ధ‌ర్నాతో ప్ర‌భుత్వం భ‌య‌ప‌డి మీకు ప‌రిహారం ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. ముందు ఘ‌ట‌న‌కు సంబంధించి ఆయ‌న బాధితుల‌ను ఓదార్చాలి. ఆ త‌ర్వాత‌.. సెకండ‌రీగా ప‌రిహారం గురించి మాట్లాడాలి. ప‌రిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కేవ‌లం ప‌రిహార‌మే ముందు.. అన్న‌ట్టుగా జ‌గ‌న్ మాట్లాడడం.. తాను వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని చెప్ప‌డం చూస్తే.. హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 24, 2024 11:01 am

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

3 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

3 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago