Political News

ప‌రామ‌ర్శ‌ల చోట…. జ‌గ‌న్‌ ప‌రిహార రాజ‌కీయం!

ప‌రామ‌ర్శ‌లు వేరు.. ప‌రిహారం వేరు. ఈ రెండింటికి మ‌ధ్య సున్నిత‌మైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌. తాజాగా ఆయ‌న అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డి విశాఖ‌లోని కింగ్ జార్జ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి భ‌రోసా ఇవ్వాల్సిన జ‌గ‌న్‌.. దానిని త‌గ్గించి.. మీకు ప‌రిహారం అందిందా అని ప్ర‌శ్నించారు.

దీనికి స‌హ‌జంగానే కొంద‌రు ఇంకా అంద‌లేద‌ని స‌మాధానం చెప్పారు. మ‌రికొంద‌రు.. ఎంతిస్తారో.. స్ఫ‌ష్ట‌త లేద‌న్నారు. నిజానికి.. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. బాధితుల వివ‌రాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి స‌మాచారం ప్ర‌భుత్వానికి రాలేదు. ఆ స‌మాచారం రాగానే.. వారి వారి అకౌంట్ల‌లో స‌ద‌రు న‌గ‌దును వేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే స‌మ‌యంలో న‌కిలీలు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని భావించి.. క్షేత్ర‌స్థాయిలో త‌హ‌సీల్దార్‌కు బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించింది.

క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో త‌హ‌సీల్దార్ ఇచ్చిన నివేదిక‌ను ఒక‌టికి రెండు సార్లు క్షుణ్నంగా ప‌రిశీలించి.. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని స‌ర్కారు త‌ల‌పోస్తోంది. కానీ, ఈ విష‌యాలను ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌.. ప‌రిహారాన్ని కాన్న‌ర్ చేసుకుని.. బాధితుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం అంద‌క‌పోతే.. తానే నేరుగా వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని.. త‌న ధ‌ర్నాతో ప్ర‌భుత్వం భ‌య‌ప‌డి మీకు ప‌రిహారం ఇస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. ముందు ఘ‌ట‌న‌కు సంబంధించి ఆయ‌న బాధితుల‌ను ఓదార్చాలి. ఆ త‌ర్వాత‌.. సెకండ‌రీగా ప‌రిహారం గురించి మాట్లాడాలి. ప‌రిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, కేవ‌లం ప‌రిహార‌మే ముందు.. అన్న‌ట్టుగా జ‌గ‌న్ మాట్లాడడం.. తాను వ‌చ్చి ధ‌ర్నా చేస్తాన‌ని చెప్ప‌డం చూస్తే.. హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 24, 2024 11:01 am

Share

Recent Posts

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

4 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

6 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

7 hours ago