పరామర్శలు వేరు.. పరిహారం వేరు. ఈ రెండింటికి మధ్య సున్నితమైన తేడా ఉంది. అయితే.. దీనిని చెరిపేసినట్టుగా వ్యవహరించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తాజాగా ఆయన అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇవ్వాల్సిన జగన్.. దానిని తగ్గించి.. మీకు పరిహారం అందిందా అని ప్రశ్నించారు.
దీనికి సహజంగానే కొందరు ఇంకా అందలేదని సమాధానం చెప్పారు. మరికొందరు.. ఎంతిస్తారో.. స్ఫష్టత లేదన్నారు. నిజానికి.. ఘటన జరిగిన తర్వాత.. బాధితుల వివరాలు తెలియాలి. ఇంకా దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వానికి రాలేదు. ఆ సమాచారం రాగానే.. వారి వారి అకౌంట్లలో సదరు నగదును వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇదే సమయంలో నకిలీలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని భావించి.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్కు బాధ్యతలు కూడా అప్పగించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇచ్చిన నివేదికను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించి.. బాధితులకు న్యాయం చేయాలని సర్కారు తలపోస్తోంది. కానీ, ఈ విషయాలను పక్కన పెట్టిన జగన్.. పరిహారాన్ని కాన్నర్ చేసుకుని.. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందకపోతే.. తానే నేరుగా వచ్చి ధర్నా చేస్తానని.. తన ధర్నాతో ప్రభుత్వం భయపడి మీకు పరిహారం ఇస్తుందని ఆయన చెప్పుకొ చ్చారు. కానీ, ఇలా వ్యాఖ్యానించడం సరికాదనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. ముందు ఘటనకు సంబంధించి ఆయన బాధితులను ఓదార్చాలి. ఆ తర్వాత.. సెకండరీగా పరిహారం గురించి మాట్లాడాలి. పరిహారం ఇవ్వాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, కేవలం పరిహారమే ముందు.. అన్నట్టుగా జగన్ మాట్లాడడం.. తాను వచ్చి ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే.. హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 24, 2024 11:01 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…