Political News

గులాబీ బాస్ ఎక్కడ? ఏం చేస్తున్నారు?

ప్రజానాయకుడు అనేటోడు ఎవరైనా సరే.. ప్రజల మధ్యనే ఉండాలి. వారి సమస్యల గురించి మాట్లాడాలి. వారికి జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తాలి. మొత్తంగా తాను ఉన్నానన్న విషయానని చెప్పే ప్రయత్నం చేస్తుండాలి.

కానీ.. అలాంటివేమీ లేకుండా.. పవర్ ఇస్తేనే పలుకరించేది.. పవర్ తీసేసుకున్న తర్వాత నాకేం పని అన్నట్లుగా పత్తా లేకుండా పోవటమే ప్రజానాయకుడి లక్షణమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తీర్పు చెప్పిన వేళ.. ఆ పాత్రకు న్యాయం చేయాల్సిన అవసరం కేసీఆర్ మీద ఉండదా? అన్నది ప్రశ్న. ఇక్కడే కేసీఆర్ తీరు గురించి మాట్లాడుకోవాలి. గతాన్ని గుర్తు తెచ్చుకోవాలి.

కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్లైయితే.. ఆయన తనదైన టైం కోసం వెయిట్ చేయటం కనిపిస్తుంది. తన టైం వచ్చిందన్నంతనే వాయు వేగంతో నిర్ణయాలు తీసుకోవటం.. అమలు చేయటం చేస్తారు. అయితే.. ఇదంతా మొదటిసారి బాగుంటుంది. కానీ.. అదే వ్యూహాన్ని ఎప్పుడూ అమలు చేస్తానంటే వర్కువుట్ అయ్యే అవకాశం ఉండదు.

ఏపీలో చంద్రబాబును చూడండి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. తనను తాను ప్రజల మనిషిగా చూపించుకునేందుకు తపిస్తుంటారు. కేసీఆర్ లో మాత్రం ఆ గుణం కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అయినా.. విపక్ష నేతగా అయినా తనను తాను లిమిట్ చేసుకోవటం కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా వ్యవహరించే వేళలోనూ.. అయితే ప్రగతిభవన్ లేదంటే ఫామ్ హౌస్ అన్నట్లే వ్యవహరించేవారు. దీనిపై విమర్శలు చెలరేగినా ఆయన పట్టించుకునే వారు కాదు.

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి మూడునాలుగు సార్లు మాత్రమే హాజరయ్యారు. మొన్నటికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ.. బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రోజున అసెంబ్లీకి వచ్చిన ఆయన.. రేవంత్ సర్కారుపై తాను యుద్ధం చేస్తానని.. కత్తి పట్టుకొని చెలరేగిపోతానంటూ చాలానే మాటలు చెప్పారు. ఆ వెంటనే ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని.. చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తనకు తాను మాత్రమే ముఖ్యమన్నట్లు.. తనకు తోచినట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తనను తాను పరిమితం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.

మౌనాన్ని వ్యూహంగా చెప్పుకుంటూ.. ఫామ్ హౌస్ కు పరిమితం కావటం ప్రజానేతకు ఉండాల్సిన లక్షణమా? అన్నది ప్రశ్న. అదేదో.. ప్రజల మధ్య ఉండొచ్చు కదా? మైలేజీ కోసం నిత్యం మాట్లాడాలని చెప్పట్లేదు కానీ.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపటం లాంటి కనీస పనుల్ని కేసీఆర్ ఎందుకు చేయరు? అన్నది మరో ప్రశ్న. త్వరలోనే తెలంగాణ ప్రజల తరఫున పొడిచేస్తానంటూ అడ్డం పొడుగు మాటలు మాట్లాడిన కేసీఆర్.. తర్వాత పత్తా లేకుండాపోవటాన్ని మర్చిపోకూడదు. ఫామ్ హౌస్ లో వ్యవసాయాన్ని చూసుకుంటూ.. కొత్త పంటలు ఏమేం వేయాలన్న ఆలోచన చేస్తున్న కేసీఆర్ ను చూసినప్పుడు అనిపించేదొక్కటే.. సొంత ఫామ్ హౌస్ మీద ఉన్న ప్రేమ.. తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ప్రదర్శించరు అని.

This post was last modified on August 22, 2024 1:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: KCR

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago