రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు ఇంకేముంది ఆగస్టు నెల ఆఖరిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని ఆగస్టు 15న దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అక్టోబర్ నాటికి పదవులను భర్తీ చేసే అంశంపై ఆయన ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. దీనికి కారణం నాయకులేనని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు కొన్నాళ్ల కిందట సర్వే నిర్వహించారు. దీనికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులను వినియోగించుకున్నారు. దీనిలో పొరపాట్లు జరిగాయి అన్నది తాజాగా వెలుగు చూసిన అంశం. అంటే క్షేత్రస్థాయిలో నాయకులను ప్రభావితం చేసిన కొంతమంది పదవులు విషయంలో పోటీ పడటం ఒక పదవికి ముగ్గురు నుంచి నలుగురు పేర్లు వినిపిస్తుండడం గమనార్హం.
అంతేకాదు.. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారై ఉండడంతో ఎవరిని ఎంపిక చేసినా వివాదాలు తప్పవని భావించిన చంద్రబాబు ప్రస్తుతానికి నామినేటెడ్ పదవులు విషయాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. నిజానికి ఒక పదవికి ఇద్దరిని ఎంపిక చేయాలని పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మాత్రం ఒక పదవికి నాలుగు నుంచి ఐదుగురు చొప్పున పేర్లు వచ్చాయి.
అంతేకాదు.. అనేకమంది నాయకులు దొడ్డిదారుల్లో ప్రయత్నాలు చేయడం చంద్రబాబుకు విసుగు తెప్పించింది. దీంతో ఈ పదవులు వ్యవహారాన్ని పక్కన పెట్టి తర్వాత చూద్దాం అన్నవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా అక్టోబర్ వరకు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది.
This post was last modified on August 21, 2024 12:33 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…