ఏపీ మాజీ సీఎం జగన్పై వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైరయ్యారు. నీకు మాట్లాడే అర్హత లేదు.. కొన్నిరోజులు నోరెత్తకుండా ఉంటే మంచిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్ వంటి అసమర్థుడి కారణంగా ఎదురైన దెబ్బలను సర్దుబాటు చేసుకునేందుకే తమకు సమయం సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు విషయంపై తాజాగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలుచేశారు. తమ హయాంలో రెండు టన్నెళ్లను పూర్తి చేశామని.. మిగిలిన అరకొర పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శలు గుప్పించారు.
జగన్ చేసిన ఈ విమర్శలపై స్పందించిన గొట్టిపాటి.. తీవ్రంగా స్పందించారు. కొన్నాళ్ల పాటు జగన్ నోరెత్తకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది ఆయనేనని తెలిపారు. గతంలో చంద్రబాబు సూచనల మేరకు ప్రకాశం జిల్లా నేతలు కలిసి ఢిల్లీ వెళ్లామని, వెలిగొండ ప్రాజెక్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని తెలిపారు. కానీ, ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్.. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి.. ప్రాజెక్టును అడ్డుకున్నారని, తద్వారా ప్రాజెక్టుకు నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు.
ఇప్పుడు నీతులు చెబుతున్నారని గొట్టిపాటి విమర్శలు గుప్పించారు. ఒక్క వెలిగొండే ప్రాజెక్టే కాకుండా.. గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా నాశనం చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన.. మూడేళ్లయినా.. జగన్ కనీసం సమీక్షించలేదని, గేటును తిరిగి పెట్టే ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. అప్పటి బాధితులకు పరిహారం కూడా పూర్తిగా ఇవ్వకుండా వారిని వేధించారని విమర్శించారు. పులిచింతల గేటు కొట్టుకుపోయినా ఇదే వైఖరి అనుసరించారని అన్నారు. ఇన్ని తప్పులు చేసిన జగన్.. ఇప్పుడేదో నీతులు చెబుతున్నారని.. కొన్నాళ్లు ఆయన నోరు ఎత్తకుండా ఉంటే బాగుంటుందని తెలిపారు.
This post was last modified on August 21, 2024 7:17 am
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…
ఏదో కామెడీతో ఆడేస్తుందనుకున్న ఫంకీ మొదటి వారంలోనే చేతులెత్తేయడం ఊహించని పరిణామం. పెద్దగా పోటీ లేని అవకాశాన్ని వాడుకోలేకపోవడం విశ్వక్…