ఏపీ మాజీ సీఎం జగన్పై వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైరయ్యారు. నీకు మాట్లాడే అర్హత లేదు.. కొన్నిరోజులు నోరెత్తకుండా ఉంటే మంచిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్ వంటి అసమర్థుడి కారణంగా ఎదురైన దెబ్బలను సర్దుబాటు చేసుకునేందుకే తమకు సమయం సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు విషయంపై తాజాగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలుచేశారు. తమ హయాంలో రెండు టన్నెళ్లను పూర్తి చేశామని.. మిగిలిన అరకొర పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శలు గుప్పించారు.
జగన్ చేసిన ఈ విమర్శలపై స్పందించిన గొట్టిపాటి.. తీవ్రంగా స్పందించారు. కొన్నాళ్ల పాటు జగన్ నోరెత్తకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది ఆయనేనని తెలిపారు. గతంలో చంద్రబాబు సూచనల మేరకు ప్రకాశం జిల్లా నేతలు కలిసి ఢిల్లీ వెళ్లామని, వెలిగొండ ప్రాజెక్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని తెలిపారు. కానీ, ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్.. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్తో కలిసి.. ప్రాజెక్టును అడ్డుకున్నారని, తద్వారా ప్రాజెక్టుకు నోటిఫికేషన్ కూడా రాలేదని తెలిపారు.
ఇప్పుడు నీతులు చెబుతున్నారని గొట్టిపాటి విమర్శలు గుప్పించారు. ఒక్క వెలిగొండే ప్రాజెక్టే కాకుండా.. గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా నాశనం చేశారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన.. మూడేళ్లయినా.. జగన్ కనీసం సమీక్షించలేదని, గేటును తిరిగి పెట్టే ప్రయత్నం కూడా చేయలేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. అప్పటి బాధితులకు పరిహారం కూడా పూర్తిగా ఇవ్వకుండా వారిని వేధించారని విమర్శించారు. పులిచింతల గేటు కొట్టుకుపోయినా ఇదే వైఖరి అనుసరించారని అన్నారు. ఇన్ని తప్పులు చేసిన జగన్.. ఇప్పుడేదో నీతులు చెబుతున్నారని.. కొన్నాళ్లు ఆయన నోరు ఎత్తకుండా ఉంటే బాగుంటుందని తెలిపారు.
This post was last modified on August 21, 2024 7:17 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…