తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ పరిణమాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదు. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ది చేసింది.
ఈ లోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఎలా పెడతారని, అక్కడ కాకుండా మరెక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తరువాత దానిని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈ సారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఇక తెలంగాణ కవులు, కళాకారులు, బుద్దిజీవులు, రచయితలు, పాత్రికేయుల పక్షాన ఏకంగా రాహుల్ గాంధీకి బహిరంగలేఖ రాయడం ఈ సంధర్భంగా కొత్త చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ సాంస్కృతిక ఆశయాలను గౌరవిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయడం తెలంగాణవాదుల మనోభావాలను గాయపరచడమేనని, అక్కడ కాకుండా మరో చోట విగ్రహం పెట్టుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎటు దారితీస్తుందో అన్న చర్చ నడుస్తున్నది.
This post was last modified on August 20, 2024 10:10 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…