Political News

మూడు రోజులు ఢిల్లీలోనే చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌పై చ‌ర్చ‌!?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. ప‌లు వ్యాపార వేత్త‌ల‌తో అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో భేటీ అయిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టే అంశంపై వారితో చ‌ర్చించారు. వీరిలో ప్ర‌ఖ్యాత టాటా గ్రూపు చైర్మ‌న్ న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌ కూడా ఉండ‌డం విశేషం. ఇక‌, ఈ కార్య‌క్ర‌మాల అనంత‌రం.. చంద్ర‌బాబు సాయంత్రం ఢిల్లీకి ప్ర‌త్యేక విమానంలో చేరుకున్నారు. శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం సాయంత్రం వ‌ర‌కు కూడా ఆయ‌న ఢిల్లీలోనే ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో చంద్ర‌బాబు భేటీ కానున్నారు.

శుక్ర‌వారం రాత్రికి ఢిల్లీలో అడుగు పెడుతూనే కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి పాటిల్‌తో చంద్ర‌బాబు భేటీ అవుతారు. కీల‌క‌మైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిధులపైనా ఆయ‌న చర్చించనున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ప‌నులు, ఇప్ప‌టికే పెండింగులో ఉన్న నిధుల అంశాల‌ను కూడా తేల్చుకోనున్నారు. అనంతరం టీడీపీ ఎంపీలు ఇచ్చే విందులో చంద్ర‌బాబు పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా కూడా చంద్ర‌బాబు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై వారితో చ‌ర్చించనున్నారు. అన్న క్యాంటీన్ల‌కు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నుంచి విరాళాలు సేక‌రించే కార్య‌క్ర‌మంలో వారిని కూడా భాగ‌స్వామ్యం చేయ‌నున్నారు.

ఇక, శ‌నివారం ఉద‌యం పార్టీ ఎంపీల‌తో చంద్ర‌బాబు భేటీ అయి.. జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం.. ఢిల్లీలోని తెలుగు వారితోనూ చంద్ర‌బాబు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దాదాపు 40 నిమిషాల‌పాటు మోడీ ఆయ‌న‌కు స‌మ‌యం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి నిర్మాణానికి ఇటీవ‌ల బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన రూ.15 వేల కోట్ల సాయం స‌హా.. వెనుక బ‌డిన జిల్లాలకు సాయంపైనా చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితిని వివ‌రించి.. ఎక్కువ మొత్తంలో ప‌న్నుల్లో వాటా తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌నున్నారు.

శ‌నివారం రాత్రి 7 గంటలకు లేదా.. 9 గంట‌ల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ అవుతారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ వ్య‌వ‌హారం.. ఇటీవ‌ల జ‌గ‌న్ ఢిల్లీలో చేసిన ధ‌ర్నా, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు, వైసీపీ నేత‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే అంశాల‌పైనా అమిత్‌షాతో చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్నారు. ఇటీవ‌ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. అమిత్‌షాను క‌లిసి.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేయ‌డం..త‌మ‌కు, త‌మ నాయ‌కుడికి భ‌ద్ర‌త త‌గ్గిస్తున్నార‌ని చెప్పిన నేప‌థ్యంలో షాకు.. వాస్త‌వ ప‌రిస్థితిని చంద్ర‌బాబు వివ‌రించ‌నున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

42 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago