Political News

జోగి కొడుకు త‌ప్పు చేశాడు.. వ‌దిలేదే లేదు: నారా లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్‌.. జోగి కొడుకు త‌ప్పు చేశాడ‌ని.. అలాంటి వ్య‌క్తిని వ‌దిలేయాలా? అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసిన వారిని ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి రెడ్‌బుక్‌గురించి ప్ర‌స్తావించారు.

రెడ్ బుక్‌లో పేరున్న ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది ట్రయ‌లరేన‌ని.. మున్ముందు సినిమా ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గ‌తంలో ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన ప్ర‌తి మీటింగ్‌లో నూ దీని గురించి మాట్లాడాన‌ని తెలిపారు. ఇప్పుడు దానిని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పారు.

ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నిక‌ల్లో త‌మ‌కు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడ‌ని, అత‌నిని వదిలేయాలా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఏ ఒక్క‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తిలేద‌ని తేల్చిచెప్పారు. తాము వ‌దిలేస్తే.. ప్ర‌జ‌లు బాధ‌ప‌డ‌తార‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన మేండేట్ ఇదేన‌ని వెల్ల‌డించారు.

This post was last modified on August 16, 2024 4:11 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

44 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago