ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అరెస్టు చేయడం, ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. జోగి కొడుకు తప్పు చేశాడని.. అలాంటి వ్యక్తిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్బుక్గురించి ప్రస్తావించారు.
రెడ్ బుక్లో పేరున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ట్రయలరేనని.. మున్ముందు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రతి మీటింగ్లో నూ దీని గురించి మాట్లాడానని తెలిపారు. ఇప్పుడు దానిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.
ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడని, అతనిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. త్వరలోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. తాము వదిలేస్తే.. ప్రజలు బాధపడతారని, ప్రజలు తమకు ఇచ్చిన మేండేట్ ఇదేనని వెల్లడించారు.
జనసేన తన 12 ఏళ్ల ప్రస్థానంలో తొలి పదేళ్ల పాటు ఎలాంటి చట్టసభల ఎంట్రీ లేకుండానే సాగింది. అయినా జనసేనాని,…
కొన్ని నెలలుగా సరైన పెద్ద సినిమా లేని టైంలో రిలీజైంది పెద్ది. ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్న టైంలో విడుదల కావడం…
జూన్ నెల వచ్చేసింది. కొత్త రిలీజులు క్యూ కడుతున్నాయి. పెద్ది ఆల్రెడీ ఓపెనింగ్ రికార్డులు మొదలుపెట్టేసింది. వచ్చే వారం నుంచి…
తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని…
ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. అది కూడా కొత్త వాళ్లతో ఒక ప్రేమకథ చేసిన వాడు.. మెగా పవర్…
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…