ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అరెస్టు చేయడం, ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. జోగి కొడుకు తప్పు చేశాడని.. అలాంటి వ్యక్తిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్బుక్గురించి ప్రస్తావించారు.
రెడ్ బుక్లో పేరున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ట్రయలరేనని.. మున్ముందు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రతి మీటింగ్లో నూ దీని గురించి మాట్లాడానని తెలిపారు. ఇప్పుడు దానిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.
ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడని, అతనిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. త్వరలోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. తాము వదిలేస్తే.. ప్రజలు బాధపడతారని, ప్రజలు తమకు ఇచ్చిన మేండేట్ ఇదేనని వెల్లడించారు.
This post was last modified on August 16, 2024 4:11 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…