ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అరెస్టు చేయడం, ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్.. జోగి కొడుకు తప్పు చేశాడని.. అలాంటి వ్యక్తిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి రెడ్బుక్గురించి ప్రస్తావించారు.
రెడ్ బుక్లో పేరున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ట్రయలరేనని.. మున్ముందు సినిమా ఉంటుందని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రతి మీటింగ్లో నూ దీని గురించి మాట్లాడానని తెలిపారు. ఇప్పుడు దానిని వదిలే ప్రసక్తి లేదని చెప్పారు.
ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడని, అతనిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. త్వరలోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. తాము వదిలేస్తే.. ప్రజలు బాధపడతారని, ప్రజలు తమకు ఇచ్చిన మేండేట్ ఇదేనని వెల్లడించారు.
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…