Political News

జోగి కొడుకు త‌ప్పు చేశాడు.. వ‌దిలేదే లేదు: నారా లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్‌.. జోగి కొడుకు త‌ప్పు చేశాడ‌ని.. అలాంటి వ్య‌క్తిని వ‌దిలేయాలా? అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసిన వారిని ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి రెడ్‌బుక్‌గురించి ప్ర‌స్తావించారు.

రెడ్ బుక్‌లో పేరున్న ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది ట్రయ‌లరేన‌ని.. మున్ముందు సినిమా ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గ‌తంలో ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన ప్ర‌తి మీటింగ్‌లో నూ దీని గురించి మాట్లాడాన‌ని తెలిపారు. ఇప్పుడు దానిని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పారు.

ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నిక‌ల్లో త‌మ‌కు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడ‌ని, అత‌నిని వదిలేయాలా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఏ ఒక్క‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తిలేద‌ని తేల్చిచెప్పారు. తాము వ‌దిలేస్తే.. ప్ర‌జ‌లు బాధ‌ప‌డ‌తార‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన మేండేట్ ఇదేన‌ని వెల్ల‌డించారు.

This post was last modified on August 16, 2024 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago