Political News

జోగి కొడుకు త‌ప్పు చేశాడు.. వ‌దిలేదే లేదు: నారా లోకేష్‌

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన నారా లోకేష్‌.. జోగి కొడుకు త‌ప్పు చేశాడ‌ని.. అలాంటి వ్య‌క్తిని వ‌దిలేయాలా? అని ప్ర‌శ్నించారు. త‌ప్పు చేసిన వారిని ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి రెడ్‌బుక్‌గురించి ప్ర‌స్తావించారు.

రెడ్ బుక్‌లో పేరున్న ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది ట్రయ‌లరేన‌ని.. మున్ముందు సినిమా ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రెడ్ బుక్కులో చేర్చామని పేర్కొన్నారు. రెడ్ బుక్ అంటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదని తెలిపారు. గ‌తంలో ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన ప్ర‌తి మీటింగ్‌లో నూ దీని గురించి మాట్లాడాన‌ని తెలిపారు. ఇప్పుడు దానిని వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పారు.

ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే ఎన్నిక‌ల్లో త‌మ‌కు భారీ మెజారిటీతో తీర్పు ఇచ్చారని నారా లోకేష్ చెప్పారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడ‌ని, అత‌నిని వదిలేయాలా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి స్కాం మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ఏ ఒక్క‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తిలేద‌ని తేల్చిచెప్పారు. తాము వ‌దిలేస్తే.. ప్ర‌జ‌లు బాధ‌ప‌డ‌తార‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన మేండేట్ ఇదేన‌ని వెల్ల‌డించారు.

This post was last modified on August 16, 2024 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

8 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

59 minutes ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

1 hour ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

1 hour ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

5 hours ago