Political News

‘జోగి’ కులం కార్డుకు టీడీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి ర‌మేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయ‌న కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్ప‌టికే జోగిపై చంద్ర‌బాబు ఇంటిపై దాడికి ప్ర‌య‌త్నించార‌న్న కేసు ఉండ‌నే ఉంది. ఇప్పుడు.. ఆయ‌న‌కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని కూడా పిలిచారు. ఈ ప‌రిణామాల‌తో జోగి ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఒకే రోజు త‌న కుమారుడిని అరెస్టు చేయ‌డం, అదే రోజు త‌న‌ను విచార‌ణ‌కు ర‌మ్మంటూ నోటీసులు ఇవ్వ‌డంతో ఆయ‌న ర‌గిలిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కులం కార్డును బ‌య‌ట‌కు తీశారు.

తాను ఎన్నో క‌ష్టాలు ప‌డి.. ఒక వెనుక బ‌డిన సామాజిక వ‌ర్గం నుంచి అనేక ఆటుపోట్లుఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగాన‌ని చెప్పిన జోగి.. త‌న‌పై క‌క్ష‌క‌ట్టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేస్తోంద‌న్నారు. అంతటితో ఆగ‌కుండా.. ఇది గౌడ సామాజిక వ‌ర్గంపై కూట‌మి స‌ర్కారు చేస్తున్న‌యుద్ధంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన జోగి.. వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. దీనిని ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త అంశాల‌కు జోడించుకుని..త‌న‌పై దాడిని కులంపై జ‌రిగిన దాడిగా పేర్కొంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. దీనికి టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్ వ‌చ్చింది.

ఇదే గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ స్పందించారు. గ‌తంలో గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక బాలుడు అమ‌ర్నాథ్ గౌడ్‌పై జ‌రిగిన అమానుషాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా ఉన్నారా? అని నిల‌దీశారు. అంతేకాదు.. బాధితుల‌కు అండ‌గా వ‌చ్చిన వారిపైనా పోలీసుల‌ను ప్ర‌యోగించి.. లాఠీ చార్జీ చేయించ‌లేదా? అని ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌త కేసుల్లో ఇరుక్కుని.. ఇప్పుడు కులం కార్డును అడ్డు పెట్టుకుని రాజ‌కీయం చేయ‌డాన్ని మంత్రి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మ‌రోవైపు టీడీపీకి చెందిన గౌడ సామాజిక వ‌ర్గం నాయ‌కులు కూడా జోగి వ్య‌వ‌హారంపై నిప్పులు చెరుగుతున్నారు.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2022-23 మ‌ధ్య కాలంలో తెనాలికి చెందిన అమ‌ర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్క‌పై కొంద‌రు వ్య‌క్తులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. దీనిని అమ‌ర్నాథ్ గౌడ్ ప్ర‌శ్నించారు. అయితే.. అమ‌ర్నాథ్‌ను కొంద‌రు దుండ‌గులు అప‌హ‌రించి.. పెట్రోల్ పోసి త‌గుల‌పెట్టారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. దీనివెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాన్ని వెలికి తీయ‌డంలోనూ.. బాధితుల‌కు అండ‌గా ఉండ‌డంలోనూ వైసీపీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంతో గౌడ‌లు అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మానికి కూడా పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

This post was last modified on August 14, 2024 12:08 pm

Share

Recent Posts

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

44 minutes ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

9 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

10 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

12 hours ago