Political News

‘జోగి’ కులం కార్డుకు టీడీపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి ర‌మేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయ‌న కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్ప‌టికే జోగిపై చంద్ర‌బాబు ఇంటిపై దాడికి ప్ర‌య‌త్నించార‌న్న కేసు ఉండ‌నే ఉంది. ఇప్పుడు.. ఆయ‌న‌కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచార‌ణ‌కు రావాల‌ని కూడా పిలిచారు. ఈ ప‌రిణామాల‌తో జోగి ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఒకే రోజు త‌న కుమారుడిని అరెస్టు చేయ‌డం, అదే రోజు త‌న‌ను విచార‌ణ‌కు ర‌మ్మంటూ నోటీసులు ఇవ్వ‌డంతో ఆయ‌న ర‌గిలిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కులం కార్డును బ‌య‌ట‌కు తీశారు.

తాను ఎన్నో క‌ష్టాలు ప‌డి.. ఒక వెనుక బ‌డిన సామాజిక వ‌ర్గం నుంచి అనేక ఆటుపోట్లుఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగాన‌ని చెప్పిన జోగి.. త‌న‌పై క‌క్ష‌క‌ట్టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేస్తోంద‌న్నారు. అంతటితో ఆగ‌కుండా.. ఇది గౌడ సామాజిక వ‌ర్గంపై కూట‌మి స‌ర్కారు చేస్తున్న‌యుద్ధంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన జోగి.. వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. దీనిని ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త అంశాల‌కు జోడించుకుని..త‌న‌పై దాడిని కులంపై జ‌రిగిన దాడిగా పేర్కొంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. దీనికి టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్ వ‌చ్చింది.

ఇదే గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ స్పందించారు. గ‌తంలో గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక బాలుడు అమ‌ర్నాథ్ గౌడ్‌పై జ‌రిగిన అమానుషాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా ఉన్నారా? అని నిల‌దీశారు. అంతేకాదు.. బాధితుల‌కు అండ‌గా వ‌చ్చిన వారిపైనా పోలీసుల‌ను ప్ర‌యోగించి.. లాఠీ చార్జీ చేయించ‌లేదా? అని ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌త కేసుల్లో ఇరుక్కుని.. ఇప్పుడు కులం కార్డును అడ్డు పెట్టుకుని రాజ‌కీయం చేయ‌డాన్ని మంత్రి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మ‌రోవైపు టీడీపీకి చెందిన గౌడ సామాజిక వ‌ర్గం నాయ‌కులు కూడా జోగి వ్య‌వ‌హారంపై నిప్పులు చెరుగుతున్నారు.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

2022-23 మ‌ధ్య కాలంలో తెనాలికి చెందిన అమ‌ర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్క‌పై కొంద‌రు వ్య‌క్తులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. దీనిని అమ‌ర్నాథ్ గౌడ్ ప్ర‌శ్నించారు. అయితే.. అమ‌ర్నాథ్‌ను కొంద‌రు దుండ‌గులు అప‌హ‌రించి.. పెట్రోల్ పోసి త‌గుల‌పెట్టారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. దీనివెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాన్ని వెలికి తీయ‌డంలోనూ.. బాధితుల‌కు అండ‌గా ఉండ‌డంలోనూ వైసీపీ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారంతో గౌడ‌లు అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మానికి కూడా పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

13 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago