వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి జోగి రమేష్ కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికే జోగిపై చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారన్న కేసు ఉండనే ఉంది. ఇప్పుడు.. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాలని కూడా పిలిచారు. ఈ పరిణామాలతో జోగి ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఒకే రోజు తన కుమారుడిని అరెస్టు చేయడం, అదే రోజు తనను విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వడంతో ఆయన రగిలిపోయారు. ఈ క్రమంలో ఆయన కులం కార్డును బయటకు తీశారు.
తాను ఎన్నో కష్టాలు పడి.. ఒక వెనుక బడిన సామాజిక వర్గం నుంచి అనేక ఆటుపోట్లుఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగానని చెప్పిన జోగి.. తనపై కక్షకట్టి చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందన్నారు. అంతటితో ఆగకుండా.. ఇది గౌడ సామాజిక వర్గంపై కూటమి సర్కారు చేస్తున్నయుద్ధంగా ఆయన అభివర్ణించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి.. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దీనిని ఆయన తన వ్యక్తిగత అంశాలకు జోడించుకుని..తనపై దాడిని కులంపై జరిగిన దాడిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. అయితే.. దీనికి టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది.
ఇదే గౌడ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. గతంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బాలుడు అమర్నాథ్ గౌడ్పై జరిగిన అమానుషాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో బాధితులకు అండగా ఉన్నారా? అని నిలదీశారు. అంతేకాదు.. బాధితులకు అండగా వచ్చిన వారిపైనా పోలీసులను ప్రయోగించి.. లాఠీ చార్జీ చేయించలేదా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కేసుల్లో ఇరుక్కుని.. ఇప్పుడు కులం కార్డును అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు టీడీపీకి చెందిన గౌడ సామాజిక వర్గం నాయకులు కూడా జోగి వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
2022-23 మధ్య కాలంలో తెనాలికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి అక్కపై కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. దీనిని అమర్నాథ్ గౌడ్ ప్రశ్నించారు. అయితే.. అమర్నాథ్ను కొందరు దుండగులు అపహరించి.. పెట్రోల్ పోసి తగులపెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీనివెనుక ఎవరున్నారనే విషయాన్ని వెలికి తీయడంలోనూ.. బాధితులకు అండగా ఉండడంలోనూ వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలోనే జగన్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంతో గౌడలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
This post was last modified on August 14, 2024 12:08 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…