Political News

క‌ర‌ణం – పొలిటిక‌ల్ క‌ల‌క‌లం … !

క‌రణం బలరామకృష్ణమూర్తి.. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. టిడిపి తో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరామకృష్ణమూర్తి అంతకుముందు కాంగ్రెస్లోనూ పనిచేశారు. టిడిపిలో సుదీర్ఘకాలం అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై విజయం సాధించిన బలరామకృష్ణమూర్తి తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరిపోయారు.

ఈ క్రమంలోనే తన కుమారుడు కరణం వెంకటేష్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో చీరాల టికెట్ ఇప్పించుకున్నారు. అయితే కూటమి పార్టీల హవా ముందు వైసీపీ ఓడిపోయినట్టే కరణం కుమారుడు కూడా విజయం సాధించలేకపోయారు. ఇక అప్పటి నుంచి కరణం కుటుంబం పక్క చూపులు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మళ్లీ పాత గుటికి వెళ్తారని టిడిపిలో చేరడమే మంచిది అని కరణం కుటుంబ భావిస్తున్నట్టు గత కొన్నాళ్లుగా చీరాలలో చర్చ జరుగుతోంది.

ముందు బలరామకృష్ణమూర్తి పార్టీలోకి తిరిగి వెళ్లి తర్వాత నెమ్మదిగా తన కుమారుడిని తీసుకొస్తారన్న చర్చ ఉంది. అందుకే ఆయన తన రిజైన్ లెటర్ ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. రేపు మాపో కరణం వెళ్ళిపోతాడంటూ స్థానికంగా కూడా నాయకులు చర్చించుకుంటున్నారు. నిజానికి చీరాలలో ప్రస్తుతం కరణం కుటుంబానికి సహకరించే నాయకులు పెద్దగా కనిపించడం లేదు. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు మొగ్గుచూపుతున్నారు.

దీంతో ఇంకా ఎంతో కాలం ఇక్కడ ఉండి రాజకీయాలు చేయలేమని నిర్ణయించుకున్న కరణం బలరామ కృష్ణమూర్తి టిడిపిలో చేర్చడం ద్వారా తన రాజకీయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇది ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న చర్చ మాత్రమే. దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. మరోవైపు కరణం వస్తానన్నా తీసుకునేది లేదన్నట్టుగానే టిడిపి వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రెండు పడవలపై కాలేసిన వారిని ఎట్టి పరిస్థితులను తీసుకోకూడదని ఆయన ఉద్దేశంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదే నిజమైతే కరణం బలరామకృష్ణమూర్తి ప్రయత్నం వృధా అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేనట్టే ఇప్పుడు టిడిపిలో కూడా కరణం బలరామకృష్ణమూర్తి వ్యవహారం నడుస్తుందని, ఆయనను తీసుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా కరణం వ్యవహారం కలకలం గా మారింది చివరికి ఎటు మలుపు తిరుగుతుందో ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on August 13, 2024 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

55 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago