వైసీపీ మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. ‘అగ్రిగోల్డ్’ భూములకు సంబంధించిన అవకతవకల వ్యవహారంలో జోగి రమేష్పై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
సుమారు 15 మందితో కూడిన అధికారుల బృందం పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. సోదాలు జరిగిన సమయంలో రమేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై రాజీవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే తమపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
రెండు దశాబ్దాల కిందట అగ్రిగోల్డ్ సంస్థ.. ప్రజల నుంచి సొమ్ములు సేకరించి బోర్డు తిప్పేసింది. దీనిపై దాఖలైన కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి.. డిపాజిట్ దారులకు న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా భూములను విక్రయించే ప్రయత్నం చేశారు. ఇక్కడే వైసీపీ హయాంలో కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి.
సీఐడీ జప్తులో ఉన్న భూములను జోగి రమేష్ కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. ఆయా భూములను అమ్మేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. దీనిని ఎన్నికల ముందు కూడా టీడీపీ నాయకు లు పేర్కొన్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కథేంటో తేల్చేందుకు ఏసీబీకి అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా ఏసీబీ అధికారులు జోగి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన లేకపోయేసరికి ఆయన కుమారుడు రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు.
This post was last modified on August 13, 2024 12:59 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…