Political News

అగ్రిగోల్డ్ ఎఫెక్ట్‌: వైసీపీ నేత‌ కొడుకు అరెస్టు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘అగ్రిగోల్డ్‌’ భూముల‌కు సంబంధించిన అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేష్‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఇబ్ర‌హీంప‌ట్నంలోని జోగి ఇంట్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు.

సుమారు 15 మందితో కూడిన అధికారుల బృందం ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. సోదాలు జ‌రిగిన స‌మ‌యంలో ర‌మేష్ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిసింది. దీనిపై రాజీవ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి ప్ర‌భుత్వం త‌మ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. తాము అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌పై దాడులు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

అస‌లేం జ‌రిగింది?

రెండు ద‌శాబ్దాల కింద‌ట అగ్రిగోల్డ్ సంస్థ‌.. ప్ర‌జ‌ల నుంచి సొమ్ములు సేక‌రించి బోర్డు తిప్పేసింది. దీనిపై దాఖ‌లైన కేసుల విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను విక్రయించి.. డిపాజిట్ దారుల‌కు న్యాయం చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఆయా భూముల‌ను విక్ర‌యించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక్క‌డే వైసీపీ హ‌యాంలో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి.

సీఐడీ జ‌ప్తులో ఉన్న భూముల‌ను జోగి ర‌మేష్ కొనుగోలు చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాదు.. ఆయా భూముల‌ను అమ్మేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీనిని ఎన్నిక‌ల ముందు కూడా టీడీపీ నాయ‌కు లు పేర్కొన్నారు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ కథేంటో తేల్చేందుకు ఏసీబీకి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏసీబీ అధికారులు జోగి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయ‌న లేక‌పోయేస‌రికి ఆయ‌న కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

This post was last modified on August 13, 2024 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

13 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago