Political News

జ‌న‌సేన అష్ట‌దిగ్భంధం.. ప‌వ‌న్ నిర్ణయం ..!

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల దూకుడుకు ఆయ‌న అష్ట‌దిగ్భంధం వేశారు. స‌హ‌జంగానే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అది ఏ పార్టీ అయినా.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల దూకుడు ఎక్కువ‌గానే ఉంటుంది. అది ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో క‌నిపిస్తుంది. రాక రాక వ‌చ్చిన అధికారం, ప‌దేళ్ల‌కుపైగా నిరీక్ష‌ణం వంటి కార‌ణాల నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో కొత్త జోష్ వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవ‌కాశం ఉంది. త‌మ పార్టీ మ‌ద్ద‌తు లేక‌పోతే టీడీపీ గెలిచేది కాద‌ని, త‌మ పార్టీ ద‌న్ను లేక‌పోతే.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది కాద‌న్న వాద‌న ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో చూచాయ‌గా వినిపిస్తోంది. ఇది స‌హ‌జంగానే జ‌న‌సేన దూకుడుకు అద్దం ప‌డుతుంది. అదేస‌మయంలో నాయ‌కులు క‌ట్టుదాటేందుకు కూడా ఒక ఇంధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతుంది . దీనివల్ల మంచి క‌న్నా చెడు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

దీనిని ఇప్ప‌డు గ్ర‌హించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌ర్మ‌గ‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌ను అదుపు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయ‌న త‌న‌ను తాను ముందుగా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాన‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు నుంచి నేర్చుకునే ద‌శ‌లో ఉన్నార‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మ‌రింత విడ‌మ‌రిచి మ‌రీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు.

అంటే.. తానే నేరుగా చంద్ర‌బాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాబ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాల‌న్న బ‌ల‌మైన సంకేతాల‌ను పంపించారు. దీని వ‌ల్ల నాయ‌కులు టీడీపీకి దూరంగా ఉండ‌డంతోపాటు.. ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేసి.. త‌ద్వారా రెండు పార్టీల మ‌ధ్య దూరం పెంచకుండా ఉండేందుకు ప‌వ‌న్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. దీనివ‌ల్ల పార్టీల మ‌ధ్య విభేదాలు రాకుండా ఉండ‌డంతోపాటు.. త‌నే చంద్ర‌బాబు శిష్యుడిగా మారుతున్న నేప‌థ్యంలో మీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రి జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌కర్త‌లు దీనిని ఏమేర‌కు పాజిటివ్‌గా తీసుకుంటార‌నేది చూడాలి.

This post was last modified on August 11, 2024 7:19 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago