Political News

జ‌న‌సేన అష్ట‌దిగ్భంధం.. ప‌వ‌న్ నిర్ణయం ..!

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల దూకుడుకు ఆయ‌న అష్ట‌దిగ్భంధం వేశారు. స‌హ‌జంగానే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అది ఏ పార్టీ అయినా.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల దూకుడు ఎక్కువ‌గానే ఉంటుంది. అది ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో క‌నిపిస్తుంది. రాక రాక వ‌చ్చిన అధికారం, ప‌దేళ్ల‌కుపైగా నిరీక్ష‌ణం వంటి కార‌ణాల నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో కొత్త జోష్ వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవ‌కాశం ఉంది. త‌మ పార్టీ మ‌ద్ద‌తు లేక‌పోతే టీడీపీ గెలిచేది కాద‌ని, త‌మ పార్టీ ద‌న్ను లేక‌పోతే.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది కాద‌న్న వాద‌న ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో చూచాయ‌గా వినిపిస్తోంది. ఇది స‌హ‌జంగానే జ‌న‌సేన దూకుడుకు అద్దం ప‌డుతుంది. అదేస‌మయంలో నాయ‌కులు క‌ట్టుదాటేందుకు కూడా ఒక ఇంధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతుంది . దీనివల్ల మంచి క‌న్నా చెడు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

దీనిని ఇప్ప‌డు గ్ర‌హించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌ర్మ‌గ‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌ను అదుపు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయ‌న త‌న‌ను తాను ముందుగా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాన‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు నుంచి నేర్చుకునే ద‌శ‌లో ఉన్నార‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మ‌రింత విడ‌మ‌రిచి మ‌రీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు.

అంటే.. తానే నేరుగా చంద్ర‌బాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాబ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాల‌న్న బ‌ల‌మైన సంకేతాల‌ను పంపించారు. దీని వ‌ల్ల నాయ‌కులు టీడీపీకి దూరంగా ఉండ‌డంతోపాటు.. ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేసి.. త‌ద్వారా రెండు పార్టీల మ‌ధ్య దూరం పెంచకుండా ఉండేందుకు ప‌వ‌న్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. దీనివ‌ల్ల పార్టీల మ‌ధ్య విభేదాలు రాకుండా ఉండ‌డంతోపాటు.. త‌నే చంద్ర‌బాబు శిష్యుడిగా మారుతున్న నేప‌థ్యంలో మీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రి జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌కర్త‌లు దీనిని ఏమేర‌కు పాజిటివ్‌గా తీసుకుంటార‌నేది చూడాలి.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

37 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

3 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

3 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

3 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

5 hours ago