జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల దూకుడుకు ఆయన అష్టదిగ్భంధం వేశారు. సహజంగానే పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది ఏ పార్టీ అయినా.. కార్యకర్తలు, నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో కనిపిస్తుంది. రాక రాక వచ్చిన అధికారం, పదేళ్లకుపైగా నిరీక్షణం వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది.
దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. తమ పార్టీ మద్దతు లేకపోతే టీడీపీ గెలిచేది కాదని, తమ పార్టీ దన్ను లేకపోతే.. టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదన్న వాదన ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూచాయగా వినిపిస్తోంది. ఇది సహజంగానే జనసేన దూకుడుకు అద్దం పడుతుంది. అదేసమయంలో నాయకులు కట్టుదాటేందుకు కూడా ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది . దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
దీనిని ఇప్పడు గ్రహించిన పవన్ కల్యాణ్.. నర్మగర్భంగా పార్టీ నాయకులను అదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయన తనను తాను ముందుగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నానని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకునే దశలో ఉన్నారని అంటున్నారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో మరింత విడమరిచి మరీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువగా ఉంటుందన్నారు.
అంటే.. తానే నేరుగా చంద్రబాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కాబట్టి క్షేత్రస్థాయిలో నాయకులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాలన్న బలమైన సంకేతాలను పంపించారు. దీని వల్ల నాయకులు టీడీపీకి దూరంగా ఉండడంతోపాటు.. ఆ పార్టీపై విమర్శలు చేసి.. తద్వారా రెండు పార్టీల మధ్య దూరం పెంచకుండా ఉండేందుకు పవన్ తనవంతు ప్రయత్నం చేశారు. దీనివల్ల పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉండడంతోపాటు.. తనే చంద్రబాబు శిష్యుడిగా మారుతున్న నేపథ్యంలో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పకనే చెప్పారు. మరి జనసేన నాయకులు, కార్యకర్తలు దీనిని ఏమేరకు పాజిటివ్గా తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on August 11, 2024 7:19 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…