జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల దూకుడుకు ఆయన అష్టదిగ్భంధం వేశారు. సహజంగానే పార్టీ అధికారంలోకి వచ్చాక.. అది ఏ పార్టీ అయినా.. కార్యకర్తలు, నాయకుల దూకుడు ఎక్కువగానే ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో కనిపిస్తుంది. రాక రాక వచ్చిన అధికారం, పదేళ్లకుపైగా నిరీక్షణం వంటి కారణాల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది.
దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. తమ పార్టీ మద్దతు లేకపోతే టీడీపీ గెలిచేది కాదని, తమ పార్టీ దన్ను లేకపోతే.. టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదన్న వాదన ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూచాయగా వినిపిస్తోంది. ఇది సహజంగానే జనసేన దూకుడుకు అద్దం పడుతుంది. అదేసమయంలో నాయకులు కట్టుదాటేందుకు కూడా ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది . దీనివల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
దీనిని ఇప్పడు గ్రహించిన పవన్ కల్యాణ్.. నర్మగర్భంగా పార్టీ నాయకులను అదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయన తనను తాను ముందుగా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నానని చెబుతున్నారు. చంద్రబాబు నుంచి నేర్చుకునే దశలో ఉన్నారని అంటున్నారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో మరింత విడమరిచి మరీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువగా ఉంటుందన్నారు.
అంటే.. తానే నేరుగా చంద్రబాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. కాబట్టి క్షేత్రస్థాయిలో నాయకులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాలన్న బలమైన సంకేతాలను పంపించారు. దీని వల్ల నాయకులు టీడీపీకి దూరంగా ఉండడంతోపాటు.. ఆ పార్టీపై విమర్శలు చేసి.. తద్వారా రెండు పార్టీల మధ్య దూరం పెంచకుండా ఉండేందుకు పవన్ తనవంతు ప్రయత్నం చేశారు. దీనివల్ల పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉండడంతోపాటు.. తనే చంద్రబాబు శిష్యుడిగా మారుతున్న నేపథ్యంలో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పకనే చెప్పారు. మరి జనసేన నాయకులు, కార్యకర్తలు దీనిని ఏమేరకు పాజిటివ్గా తీసుకుంటారనేది చూడాలి.
This post was last modified on August 11, 2024 7:19 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…