Political News

జ‌న‌సేన అష్ట‌దిగ్భంధం.. ప‌వ‌న్ నిర్ణయం ..!

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల దూకుడుకు ఆయ‌న అష్ట‌దిగ్భంధం వేశారు. స‌హ‌జంగానే పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అది ఏ పార్టీ అయినా.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల దూకుడు ఎక్కువ‌గానే ఉంటుంది. అది ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే నాలుగేళ్ల‌లో క‌నిపిస్తుంది. రాక రాక వ‌చ్చిన అధికారం, ప‌దేళ్ల‌కుపైగా నిరీక్ష‌ణం వంటి కార‌ణాల నేప‌థ్యంలో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో కొత్త జోష్ వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు వేచి చూస్తున్నా.. రాబోయే రోజుల్లో వారు కూడా రెచ్చిపోయే అవ‌కాశం ఉంది. త‌మ పార్టీ మ‌ద్ద‌తు లేక‌పోతే టీడీపీ గెలిచేది కాద‌ని, త‌మ పార్టీ ద‌న్ను లేక‌పోతే.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చేది కాద‌న్న వాద‌న ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో చూచాయ‌గా వినిపిస్తోంది. ఇది స‌హ‌జంగానే జ‌న‌సేన దూకుడుకు అద్దం ప‌డుతుంది. అదేస‌మయంలో నాయ‌కులు క‌ట్టుదాటేందుకు కూడా ఒక ఇంధ‌నంగా ఉప‌యోగ‌ప‌డుతుంది . దీనివల్ల మంచి క‌న్నా చెడు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

దీనిని ఇప్ప‌డు గ్ర‌హించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. న‌ర్మ‌గ‌ర్భంగా పార్టీ నాయ‌కుల‌ను అదుపు చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అందుకే ఆయ‌న త‌న‌ను తాను ముందుగా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాన‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు నుంచి నేర్చుకునే ద‌శ‌లో ఉన్నార‌ని అంటున్నారు. తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మ‌రింత విడ‌మ‌రిచి మ‌రీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నుంచి తాను నేర్చుకునేది ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు.

అంటే.. తానే నేరుగా చంద్ర‌బాబు చెప్పింది వినేందుకు ఉత్సాహంగా ఉన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కాబ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండాల‌న్న బ‌ల‌మైన సంకేతాల‌ను పంపించారు. దీని వ‌ల్ల నాయ‌కులు టీడీపీకి దూరంగా ఉండ‌డంతోపాటు.. ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేసి.. త‌ద్వారా రెండు పార్టీల మ‌ధ్య దూరం పెంచకుండా ఉండేందుకు ప‌వ‌న్ త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. దీనివ‌ల్ల పార్టీల మ‌ధ్య విభేదాలు రాకుండా ఉండ‌డంతోపాటు.. త‌నే చంద్ర‌బాబు శిష్యుడిగా మారుతున్న నేప‌థ్యంలో మీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రి జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌కర్త‌లు దీనిని ఏమేర‌కు పాజిటివ్‌గా తీసుకుంటార‌నేది చూడాలి.

This post was last modified on August 11, 2024 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

2 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

2 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

3 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

3 hours ago

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…

4 hours ago

IBOMMA 2.0: అరెస్ట్ అయినా ఆగలేదేంటి?

చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…

5 hours ago