ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెబుతున్నారని.. ఇప్పుడు రాష్ట్రం బాధ్యతను ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంటు నిధుల ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి.. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రం బాధ్యత నాది అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ బాధ్యతను ప్రజల భుజాలపై మోపుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ‘హామీలకు నాదీ గ్యారెంటీ’ అని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోయారని వ్యాఖ్యానించారు. ఇది పచ్చి మోసం కాదా? అని ప్రశ్నించారు. శ్వేత పత్రాలు విడుదల చేసి.. ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని వ్యాఖ్యానించారు.
తల్లికి వందనం కింద రూ.15 వేలు, రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు వాటి ఊసెత్తలేదని అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు మాటేంటని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలను ఎత్తేశారని వ్యాఖ్యానించారు. వలంటీర్లను మోసం చేశారని అన్నారు. మొత్తంగా చంద్రబాబుపై జగన్ పలు విమర్శలు గుప్పించారు. పథకాలను అమలు చేయకపోవడాన్ని ఆయన నిలదీశారు.
కట్ చేస్తే..
ఇవన్నీ.. చంద్రబాబుకు తెలియదా? అంటే తెలుసు. కానీ, జగన్కు చంద్రబాబుకు తేడా ఇదేనని టీడీపీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినప్పుడు.. అప్పులు చేసి పంచడం కంటే సంపద సృష్టించి.. తర్వాత అమలు చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయొచ్చన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని వారు చెబుతున్నారు. అయినా.. రెండు మాసాలకే ఇంత గగ్గోలు ఎందుకని.. ఆరు మాసాలైనా ఆగిన తర్వాత.. చంద్రబాబు పాలనను చూడాలని వారు సూచిస్తున్నారు.
This post was last modified on August 11, 2024 7:09 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…