Political News

మోడీ – వ‌య‌నాడ్ – పాలిటిక్స్‌!

“దేనినైనా రాజ‌కీయంగా ఆలోచించే ముందు అది ప్ర‌జాహిత‌మా? నాయ‌కుల అభిమ‌త‌మా? అన్న‌ది ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఆలోచించుకోవాలి!” – దాదాపు రెండు ద‌శాబ్దాల కింద‌ట ప్ర‌ధానిగా ఉన్న వాజ్‌పేయి పార్ల‌మెంటు వేదిక‌గా చెప్పిన మాట‌. ఫొక్రాన్ అణు ప‌రీక్ష‌లు చేసిన స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలుగెత్తిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న చెప్పిన మాట‌.. నేటికీ స‌జీవం. ప్ర‌తి విష‌యాన్నీ పొలిటిక‌ల్ అద్దంలో చూస్తున్న ప‌రిస్థితి రాష్ట్రాల నుంచి కేంద్రం వ‌ర‌కు ఎగ‌బాకింది!

కేర‌ళ‌లో వ‌య‌నాడ్ ఉత్పాతం.. జాతీయంగా కంటే కూడా అంత‌ర్జాతీయంగా మీడియా ఘోషించిన తీరు అక్క‌డ సంభ‌వించిన వ‌ర‌దల బీభ‌త్సాన్ని అక్ష‌రీకృతం చేసి.. పాల‌కుల నిర్ల‌క్ష్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టాయి. ఇది ఊహించ‌ని విప‌త్తుగా ఇటు కేర‌ళ‌, అటు కేంద్రం చెబుతున్నా.. వాస్త‌వాలు నిగ్గు తేల్చ‌డంలో మ‌న‌కన్నా.. పొరుగు దేశాల మీడియా బాగా ప‌నిచేసింది. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన అనేక మంది స్వ‌తంత్ర రిపోర్ట‌ర్లు కూడా అస‌లు ఏం జ‌రిగిందో చెప్పారు.

ఇక‌, కేర‌ళ ప్ర‌భుత్వం ప‌రంగా.. చేయాల్సింది చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 1000 మందికిపైగా మృతి చెందార‌న్న‌ది అంత‌ర్జాతీయ మీడియా చెప్పిన మాట‌. దీనికి కొంత అటు ఇటుగా.. స్థానిక మీడియా కూడా తేల్చింది. కానీ, కేంద్రం లెక్క‌లు వేరే ఉన్నాయి. అవే రాజ‌కీయ గ‌ణాంకాలు. అక్క‌డ ఉన్న ఇండియా కూట‌మి ప్ర‌భుత్వం కావ‌డంతో ఈ లెక్క‌లు స‌ద‌రు నేత‌ల క‌నుస‌న్న‌ల్లో వ‌చ్చిన క‌రోనా లెక్క‌ల‌ను మించి పోయాయి. పైగా.. దీనిని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌న్న పార్ల‌మెంటు స‌భ్యుల ఘోష‌ను ప‌ట్టించుకున్న నాధుడు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

జాతీయ విప‌త్తు అంటే.. మూడుకు మించిన రాష్ట్రాల్లో ఒకే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ప్పుడు ప్ర‌క‌టిస్తార‌న్న ఒక్క ప్ర‌క‌ట‌న‌తో మోడీ స‌ర్కారు వ‌య‌నాడ్ విప‌త్తుకు మంగ‌ళం పాడింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాయం చేస్తామ‌న్నారే కానీ.. రూపాయి విదిలించింది లేక‌పోయింద‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ చేసిన విమ‌ర్శ‌లో స‌హేతుక‌త స్ప‌ష్టంగా ఉంది. అయినా.. మోడీ స‌ర్కారుకు చీమ కుట్ట‌లేదు. ఈ లోగా.. రాజ్య‌స‌భ‌లో రేగిన జ‌యా బ‌చ్చ‌న్ వ‌ర్సెస్ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ వివాదంతో వ‌య‌నాడ్ గుర్తుకు వ‌చ్చింది.

తాజాగా శనివారం .. ప్ర‌ధాని మోడీ వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. స్వీయ నేత్రాల‌తో ప్ర‌కృతి ఉత్పాతాన్ని ఆయ‌న ప‌రిశీలించేందుకు వస్తున్నారు. మంచిదే. కానీ, చూసి ఏం చేస్తారు? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. క‌నీసంలో క‌నీసం త‌మ‌కు 3 వేల కోట్ల‌యినా ఇవ్వాల‌న్న విజ‌య‌న్ అభ్య‌ర్థ‌న‌పై ఇప్ప‌టికీ మౌనంగా ఉన్నారు. మ‌రిదీనికి మొగ్గు చూపుతారా? లేక యధాలాపంగా యాభైయ్యో.. వంద కోట్లో ఇచ్చి.. కేంద్ర బృందాలు ప‌రిశీలించాక‌.. అంటూ చేతులు దులుపుకొంటారా చూడాలి.

This post was last modified on August 10, 2024 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…

47 minutes ago

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

4 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

4 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

8 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

13 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

14 hours ago