Political News

మోడీ – వ‌య‌నాడ్ – పాలిటిక్స్‌!

“దేనినైనా రాజ‌కీయంగా ఆలోచించే ముందు అది ప్ర‌జాహిత‌మా? నాయ‌కుల అభిమ‌త‌మా? అన్న‌ది ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఆలోచించుకోవాలి!” – దాదాపు రెండు ద‌శాబ్దాల కింద‌ట ప్ర‌ధానిగా ఉన్న వాజ్‌పేయి పార్ల‌మెంటు వేదిక‌గా చెప్పిన మాట‌. ఫొక్రాన్ అణు ప‌రీక్ష‌లు చేసిన స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలుగెత్తిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఆయ‌న చెప్పిన మాట‌.. నేటికీ స‌జీవం. ప్ర‌తి విష‌యాన్నీ పొలిటిక‌ల్ అద్దంలో చూస్తున్న ప‌రిస్థితి రాష్ట్రాల నుంచి కేంద్రం వ‌ర‌కు ఎగ‌బాకింది!

కేర‌ళ‌లో వ‌య‌నాడ్ ఉత్పాతం.. జాతీయంగా కంటే కూడా అంత‌ర్జాతీయంగా మీడియా ఘోషించిన తీరు అక్క‌డ సంభ‌వించిన వ‌ర‌దల బీభ‌త్సాన్ని అక్ష‌రీకృతం చేసి.. పాల‌కుల నిర్ల‌క్ష్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టాయి. ఇది ఊహించ‌ని విప‌త్తుగా ఇటు కేర‌ళ‌, అటు కేంద్రం చెబుతున్నా.. వాస్త‌వాలు నిగ్గు తేల్చ‌డంలో మ‌న‌కన్నా.. పొరుగు దేశాల మీడియా బాగా ప‌నిచేసింది. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన అనేక మంది స్వ‌తంత్ర రిపోర్ట‌ర్లు కూడా అస‌లు ఏం జ‌రిగిందో చెప్పారు.

ఇక‌, కేర‌ళ ప్ర‌భుత్వం ప‌రంగా.. చేయాల్సింది చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 1000 మందికిపైగా మృతి చెందార‌న్న‌ది అంత‌ర్జాతీయ మీడియా చెప్పిన మాట‌. దీనికి కొంత అటు ఇటుగా.. స్థానిక మీడియా కూడా తేల్చింది. కానీ, కేంద్రం లెక్క‌లు వేరే ఉన్నాయి. అవే రాజ‌కీయ గ‌ణాంకాలు. అక్క‌డ ఉన్న ఇండియా కూట‌మి ప్ర‌భుత్వం కావ‌డంతో ఈ లెక్క‌లు స‌ద‌రు నేత‌ల క‌నుస‌న్న‌ల్లో వ‌చ్చిన క‌రోనా లెక్క‌ల‌ను మించి పోయాయి. పైగా.. దీనిని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌న్న పార్ల‌మెంటు స‌భ్యుల ఘోష‌ను ప‌ట్టించుకున్న నాధుడు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

జాతీయ విప‌త్తు అంటే.. మూడుకు మించిన రాష్ట్రాల్లో ఒకే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ప్పుడు ప్ర‌క‌టిస్తార‌న్న ఒక్క ప్ర‌క‌ట‌న‌తో మోడీ స‌ర్కారు వ‌య‌నాడ్ విప‌త్తుకు మంగ‌ళం పాడింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాయం చేస్తామ‌న్నారే కానీ.. రూపాయి విదిలించింది లేక‌పోయింద‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ చేసిన విమ‌ర్శ‌లో స‌హేతుక‌త స్ప‌ష్టంగా ఉంది. అయినా.. మోడీ స‌ర్కారుకు చీమ కుట్ట‌లేదు. ఈ లోగా.. రాజ్య‌స‌భ‌లో రేగిన జ‌యా బ‌చ్చ‌న్ వ‌ర్సెస్ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ వివాదంతో వ‌య‌నాడ్ గుర్తుకు వ‌చ్చింది.

తాజాగా శనివారం .. ప్ర‌ధాని మోడీ వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. స్వీయ నేత్రాల‌తో ప్ర‌కృతి ఉత్పాతాన్ని ఆయ‌న ప‌రిశీలించేందుకు వస్తున్నారు. మంచిదే. కానీ, చూసి ఏం చేస్తారు? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. క‌నీసంలో క‌నీసం త‌మ‌కు 3 వేల కోట్ల‌యినా ఇవ్వాల‌న్న విజ‌య‌న్ అభ్య‌ర్థ‌న‌పై ఇప్ప‌టికీ మౌనంగా ఉన్నారు. మ‌రిదీనికి మొగ్గు చూపుతారా? లేక యధాలాపంగా యాభైయ్యో.. వంద కోట్లో ఇచ్చి.. కేంద్ర బృందాలు ప‌రిశీలించాక‌.. అంటూ చేతులు దులుపుకొంటారా చూడాలి.

This post was last modified on August 10, 2024 1:31 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

11 minutes ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

51 minutes ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

2 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

3 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

5 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago