రాష్ట్రంలో రెండు నెలలుగా మారణహోమం సాగుతోందని.. అరాచక పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్య లకు బాధ్యులైన వారిపై నమోదు చేస్తున్న కేసులకు తోడు వారిని ప్రోత్సహిస్తున్న వారిపైనా కేసులు పెట్టా లన్నారు. అదేవిధంగా వీరికి మద్దతుగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కూడా వదిలి పెట్టుకుండా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు.
తాజాగా నంద్యాల జిల్లాలో పర్యటించిన జగన్.. ఇక్కడి మహానందిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. గత శనివారం సుబ్బారాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ.. రాళ్లతో మోది చంపేశారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మాసాలుగా దారుణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నా ఎవరూ పట్టనట్టుగానే ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటే.. హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపైనా కేసులు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకుమంచి చేయాలన్న సంకల్పం చంద్రబాబు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న జగన్.,. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.
ఆయా హామీలపై ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తాము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భయోత్పాతం సృస్టిస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు కూడా భయపడి ఏమీ ప్రశ్నించరన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నారని, ఆయా పరిణామాలపై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని జగన్ స్పస్టం చేశారు.
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…