రాష్ట్రంలో రెండు నెలలుగా మారణహోమం సాగుతోందని.. అరాచక పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్య లకు బాధ్యులైన వారిపై నమోదు చేస్తున్న కేసులకు తోడు వారిని ప్రోత్సహిస్తున్న వారిపైనా కేసులు పెట్టా లన్నారు. అదేవిధంగా వీరికి మద్దతుగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కూడా వదిలి పెట్టుకుండా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు.
తాజాగా నంద్యాల జిల్లాలో పర్యటించిన జగన్.. ఇక్కడి మహానందిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. గత శనివారం సుబ్బారాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ.. రాళ్లతో మోది చంపేశారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మాసాలుగా దారుణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నా ఎవరూ పట్టనట్టుగానే ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటే.. హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపైనా కేసులు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకుమంచి చేయాలన్న సంకల్పం చంద్రబాబు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న జగన్.,. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.
ఆయా హామీలపై ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తాము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భయోత్పాతం సృస్టిస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు కూడా భయపడి ఏమీ ప్రశ్నించరన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నారని, ఆయా పరిణామాలపై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని జగన్ స్పస్టం చేశారు.
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…