రాష్ట్రంలో రెండు నెలలుగా మారణహోమం సాగుతోందని.. అరాచక పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్య లకు బాధ్యులైన వారిపై నమోదు చేస్తున్న కేసులకు తోడు వారిని ప్రోత్సహిస్తున్న వారిపైనా కేసులు పెట్టా లన్నారు. అదేవిధంగా వీరికి మద్దతుగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను కూడా వదిలి పెట్టుకుండా కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారు.
తాజాగా నంద్యాల జిల్లాలో పర్యటించిన జగన్.. ఇక్కడి మహానందిలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. గత శనివారం సుబ్బారాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ.. రాళ్లతో మోది చంపేశారు. ఈ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మాసాలుగా దారుణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నా ఎవరూ పట్టనట్టుగానే ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలంటే.. హత్యలు, దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపైనా కేసులు పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజలకుమంచి చేయాలన్న సంకల్పం చంద్రబాబు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని దుయ్య బట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న జగన్.,. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.
ఆయా హామీలపై ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తాము ప్రశ్నిస్తామన్న ఉద్దేశంతోనే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భయోత్పాతం సృస్టిస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు కూడా భయపడి ఏమీ ప్రశ్నించరన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నారని, ఆయా పరిణామాలపై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని జగన్ స్పస్టం చేశారు.
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…