చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ పై కేసులు పెట్టాలి: జ‌గ‌న్‌

రాష్ట్రంలో రెండు నెల‌లుగా మార‌ణ‌హోమం సాగుతోంద‌ని.. అరాచ‌క పాల‌న‌లో రాష్ట్రం రావ‌ణ కాష్టంలా ర‌గులుతూనే ఉంద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న వ‌రుస హ‌త్య ల‌కు బాధ్యులైన వారిపై న‌మోదు చేస్తున్న కేసుల‌కు తోడు వారిని ప్రోత్స‌హిస్తున్న వారిపైనా కేసులు పెట్టా ల‌న్నారు. అదేవిధంగా వీరికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను కూడా వ‌దిలి పెట్టుకుండా కేసులు పెట్టాల‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా నంద్యాల జిల్లాలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ఇక్క‌డి మ‌హానందిలో ఇటీవ‌ల దారుణ హ‌త్యకు గురైన వైసీపీ నాయ‌కుడు ప‌సుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. గ‌త శ‌నివారం సుబ్బారాయుడు హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు లాగి మ‌రీ.. రాళ్లతో మోది చంపేశారు. ఈ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌.. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మాసాలుగా దారుణాలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు కొనసాగుతున్నా ఎవ‌రూ ప‌ట్ట‌న‌ట్టుగానే ఉన్నార‌ని తెలిపారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాలంటే.. హ‌త్య‌లు, దాడుల‌ను ప్రోత్స‌హిస్తున్న సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌పైనా కేసులు పెట్టాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌కుమంచి చేయాల‌న్న సంక‌ల్పం చంద్ర‌బాబు లేద‌న్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చలేక‌పోతున్నార‌ని దుయ్య బ‌ట్టారు. ఎన్నికల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చార‌న్న జ‌గ‌న్‌.,. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమ‌ర్శించారు.

ఆయా హామీల‌పై ఇప్పుడు ప్ర‌తిప‌క్షంగా ఉన్న తాము ప్ర‌శ్నిస్తామ‌న్న ఉద్దేశంతోనే త‌మ పార్టీ నేత‌ల‌పై దాడులు చేస్తూ.. రాష్ట్రంలో భ‌యోత్పాతం సృస్టిస్తున్నార‌ని అన్నారు. దీంతో ప్ర‌జ‌లు కూడా భ‌య‌ప‌డి ఏమీ ప్ర‌శ్నించ‌ర‌న్న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ తెరిచి, కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు రెచ్చిపోతున్నార‌ని, ఆయా ప‌రిణామాల‌పై హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామ‌ని జ‌గ‌న్ స్ప‌స్టం చేశారు.

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

50 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago