రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు.
కింజారపు యర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత కోపాన్ని జగన్ ఇపుడు తీర్చుకుంటున్నట్లు చంద్రబాబు విమర్శలు చేశారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అప్పట్లో యర్రన్నాయుడు, అశోక్ లు కూడా ఇంప్లీడ్ అయ్యారన్న కోపంతోనే ఇపుడు అచ్చెన్నాయుడును జైలుకు పంపినట్లు చెప్పారు. అలాగే అశోక్ ను మన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా తీసేసినట్లు చంద్రబాబు ధ్వజమెత్తారు. సింహాచలం దేవాలయంపై మొదలైన జగన్ దాడి చివరకు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇదే సందర్భంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లాగే ఇతర మతస్తుల ప్రార్ధనా మందిరాలపైన కూడా దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సుంటుందని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అన్యమతస్తుల ప్రార్ధనా మందిరాలపై దాడులతో భక్తల మనోభావాలు దెబ్బతింటున్నట్లు మండిపోయారు. జగన్ ఇచ్చిన అలుసుతోనే మంత్రులు, నేతలు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనాలను రెచ్చగొడుతున్నారంటూ చంద్రబాబు చేసిన కామెంట్లను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిందే. మంత్రుల నోటికి వెంటనే తాళం వేస్తేనే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరి చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలను ఉత్త ఆరోపణలు, విమర్శలుగా కొట్టిపారేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ప్రతిపక్షాలను కేవలం ప్రతిపక్షాలుగా చూడకుండా వాళ్ళ సీనియారిటిని గౌరవించి సద్విమర్శలుగా తీసుకోవాలి. అప్పుడే దారితప్పుతున్న వ్యవస్ధలను గాడిలో పెట్టటానికి వీలౌతుందన్న వాస్తవాన్ని జగన్ గుర్తించాలి.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…