రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు.
కింజారపు యర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత కోపాన్ని జగన్ ఇపుడు తీర్చుకుంటున్నట్లు చంద్రబాబు విమర్శలు చేశారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అప్పట్లో యర్రన్నాయుడు, అశోక్ లు కూడా ఇంప్లీడ్ అయ్యారన్న కోపంతోనే ఇపుడు అచ్చెన్నాయుడును జైలుకు పంపినట్లు చెప్పారు. అలాగే అశోక్ ను మన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా తీసేసినట్లు చంద్రబాబు ధ్వజమెత్తారు. సింహాచలం దేవాలయంపై మొదలైన జగన్ దాడి చివరకు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇదే సందర్భంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లాగే ఇతర మతస్తుల ప్రార్ధనా మందిరాలపైన కూడా దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సుంటుందని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అన్యమతస్తుల ప్రార్ధనా మందిరాలపై దాడులతో భక్తల మనోభావాలు దెబ్బతింటున్నట్లు మండిపోయారు. జగన్ ఇచ్చిన అలుసుతోనే మంత్రులు, నేతలు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనాలను రెచ్చగొడుతున్నారంటూ చంద్రబాబు చేసిన కామెంట్లను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిందే. మంత్రుల నోటికి వెంటనే తాళం వేస్తేనే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరి చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలను ఉత్త ఆరోపణలు, విమర్శలుగా కొట్టిపారేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ప్రతిపక్షాలను కేవలం ప్రతిపక్షాలుగా చూడకుండా వాళ్ళ సీనియారిటిని గౌరవించి సద్విమర్శలుగా తీసుకోవాలి. అప్పుడే దారితప్పుతున్న వ్యవస్ధలను గాడిలో పెట్టటానికి వీలౌతుందన్న వాస్తవాన్ని జగన్ గుర్తించాలి.
This post was last modified on September 26, 2020 9:44 am
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…