Political News

పార్టీ నేతలకు భారీ టార్గెట్ ఇచ్చేసిన కేటీఆర్

దేశమంతా కరోనా ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ రచ్చ భారీగా నడుస్తున్న వేళ.. తెలంగాణలో అదనంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలతో పాటు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చే ఎన్నికలన్నింటిలోనూ విజయం తమ సొంతమయ్యేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది.

పట్టభద్రుల ఎన్నికలు గతానికి మించి పోటాపోటీగా జరిగే అవకాశం ఉండటం.. పలువురు ప్రముఖులు బరిలోకి దిగుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ ఎన్నికలో తాము విజయం సాధించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. కోదండం మాష్టారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని భావిస్తున్న తెలంగాణ అధికారపక్షం వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు. వీరిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల ఓటరు జాబితాలో ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ నేతలంతా పని చేయాలన్నారు.

పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని.. అందులో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు చేయాలన్నారు. తాజా ఓటరు లిస్టు ఆధారంగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. ఓటర్ల నమోదు కీలకంగా మారనుంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమ తమ ఇళ్ల నుంచే పట్టభద్రుల ఓటర్లను చేర్చే కార్యక్రమాల్ని షురూ చేయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. తెలంగాణలో విపక్షాలు దివాళా తీసినట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ.. అలాంటి పరిస్థితే ఉంటే.. ఓటర్ల జాబితాకు ఇంత భారీ కసరత్తు అవసరమే అంటారా కేటీఆర్? మరి.. ఆయన ఇచ్చిన టార్గెట్ ను పార్టీ నేతలు ఏమేరకు పూర్తి చేస్తారో చూడాలి.

This post was last modified on September 25, 2020 4:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: KTRTRS

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

32 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago