ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్లో మంత్రి అనిత ఛాంబర్లో కలిసి కొద్దిసేపు చర్చించారు. వారి సంభాషణల్లో వివేకా దారుణ హత్యకు సంబంధించిన విషయాలే వినిపించా యి. డీజీపీ కార్యాలయంలో ఒకసారికలవాలంటూ సునీతకు హోం మంత్రి అనిత సూచించారు. తాను కూడా డీజీపీతో మాట్లాడానని అన్నారు. మొత్తంగా 20 నిమిషాలకు పైగానే వీరి మధ్య చర్చలు సాగాయి.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించాలని, న్యాయాన్ని గెలిపించాలని సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రగా వెళ్లి ప్రతి ఇంట్లో ని ఓటర్లను కూడా కలిశారు. తన తండ్రి దారుణ హత్య ఉదంతాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అయితే.. ఎక్కడా ఆమెకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజకీయంగా వైసీపీ తన తండ్రి కేసును తొక్కి పెడుతోందని భావించిన ఆమె విభేదించారు.
తాజా ఎన్నిక్లలో వైసీపీకి వ్యతిరేకింగా సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమ ప్రాణాలకు కూడా ము ప్పు ఉందని పేర్కొన్నారు. మొత్తానికి అన్నపై కసి తీర్చుకున్న సునీత.. ఎన్నికల ప్రచారం తర్వాత సుమారు రెండు మాసాలకు ఇలా ప్రత్యక్షం కావడం గమనార్హం. అది కూడా రాష్ట్ర హోం శాఖ మంత్రిని కలుసుకోవడం.. తన తండ్రి దారుణ హత్యకు సంబంధించిన వ్యవహారాలపైనే చర్చించడం గమనార్హం. ఎన్నికలకు ముందు తర్వాతకూడా.. వైఎస్ వివేకాహత్య కేసు రాజకీయంగా పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…