ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్లో మంత్రి అనిత ఛాంబర్లో కలిసి కొద్దిసేపు చర్చించారు. వారి సంభాషణల్లో వివేకా దారుణ హత్యకు సంబంధించిన విషయాలే వినిపించా యి. డీజీపీ కార్యాలయంలో ఒకసారికలవాలంటూ సునీతకు హోం మంత్రి అనిత సూచించారు. తాను కూడా డీజీపీతో మాట్లాడానని అన్నారు. మొత్తంగా 20 నిమిషాలకు పైగానే వీరి మధ్య చర్చలు సాగాయి.
అయితే.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిలను గెలిపించాలని, న్యాయాన్ని గెలిపించాలని సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. పాదయాత్రగా వెళ్లి ప్రతి ఇంట్లో ని ఓటర్లను కూడా కలిశారు. తన తండ్రి దారుణ హత్య ఉదంతాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. అయితే.. ఎక్కడా ఆమెకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజకీయంగా వైసీపీ తన తండ్రి కేసును తొక్కి పెడుతోందని భావించిన ఆమె విభేదించారు.
తాజా ఎన్నిక్లలో వైసీపీకి వ్యతిరేకింగా సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమ ప్రాణాలకు కూడా ము ప్పు ఉందని పేర్కొన్నారు. మొత్తానికి అన్నపై కసి తీర్చుకున్న సునీత.. ఎన్నికల ప్రచారం తర్వాత సుమారు రెండు మాసాలకు ఇలా ప్రత్యక్షం కావడం గమనార్హం. అది కూడా రాష్ట్ర హోం శాఖ మంత్రిని కలుసుకోవడం.. తన తండ్రి దారుణ హత్యకు సంబంధించిన వ్యవహారాలపైనే చర్చించడం గమనార్హం. ఎన్నికలకు ముందు తర్వాతకూడా.. వైఎస్ వివేకాహత్య కేసు రాజకీయంగా పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే.
This post was last modified on August 7, 2024 11:30 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…