గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కార్యకర్తల కృషి ఒకటి. అదే పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిందన్నా దాని వెనుక కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవాలి.
అంటే వాళ్లు పనిగట్టుకుని ఓడించారు అని కాదు. కార్యకర్తలను వైసీపీ సరిగా పట్టించుకోవడంతో గత ఎన్నికలకు ముందులా వాళ్లు కసిగా పని చేయలేదని.. ఈ పార్టీతో ఒరిగేది ఏముంది అనే నైరాశ్యం వాళ్లను ఆవహించి సైలెంటుగా ఉండిపోయారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో పెద్ద నాయకులు బాగుపడ్డారు, తప్ప.. కింది స్థాయి కార్యకర్తలు దారుణంగా దెబ్బ తిన్నారని.. గ్రామీణ స్థాయిలో కాంట్రాక్టులు కూడా లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైందనే చర్చ జరిగింది.
కార్యకర్తలను పట్టించుకోలేదనే చెడ్డ పేరును జగన్ మూటగట్టుకున్నారు. తనను ఎంతో అభిమానించే కార్యకర్తలను గత ఐదేళ్లలో ఎక్కడా కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం, వారికి ఏ రకంగానూ అండగా నిలవకపోవడం వ్యతిరేకతను పెంచింది. అసలు ఆయనకు కార్యకర్తల పట్ల ఆయన ఫీలింగ్ ఏంటి అన్నది వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో వివిధ ఫైళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు సంతకాల కోసం జగన్ను కలిసేవారని.. ఆ టైంలో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ బిల్స్ కూడా తెచ్చేవారని.. కానీ వాటి విషయంలో జగన్ విముఖత ప్రదర్శించేవారని వసంత వెల్లడించారు.
ఓ సందర్భంలో 30 మంది ఎమ్మెల్యేలు చుట్టూ ఉండగా.. కార్యకర్తల గురించి ఆయనన్న మాట తనను షాక్ గురిచేసిందన్నారు. కార్యకర్తలు దొంగ బిల్లులు పెడతారని చెబుతూ.. అందుకే కదా ఈ ఫైల్స్ తెస్తారు అని ప్రశ్నించిన జగన్ తనకు ఇలాంటివి ఇష్టం ఉండవంటూ వాటిని తిరస్కరించిన విషయాన్ని వసంత గుర్తు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. కార్యకర్తల పట్ల జగన్ ఫీలింగ్ ఇదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on August 7, 2024 11:18 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…