ఏపీ రాజకీయాల నుంచి వచ్చే ఒకటి రెండేళ్లలో చాలా మంది సీనియర్ నేతలు.. టాప్ పొలిటికల్ లీడర్లు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు… ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్టాపిక్గా మారింది. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ సీనియర్ల సమస్య వెంటాడుతోంది. 2029 ఎన్నికల నాటికి సీనియర్ నాయకుల సంఖ్య తగ్గుముఖం పట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది యువత ముందుకు వచ్చారు. అయితే.. ఇలా యువ రక్తం వస్తే తప్పేంటి? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. తప్పులేదు. కానీ.. సీనియర్లు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. వారి ఆలోచనా విధానం.. వారి దూర దృష్టి వంటివి పార్టీకి మేలు చేస్తాయి.
పార్టీల పరంగా చూస్తే.. వైసీపీలో ఇప్పటికే బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. అయినా.. ఈసారికి పోటీ చేయాలంటూ జగన్ ఆయనను ఒప్పించారు. అదేవిధంగా ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. వీరు కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దూరంగానే ఉంటానని చెప్పారు. కానీ, జగన్ ఫోర్స్ చేశారు. ఇక, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే బాటలో ఉన్నారు. వీరు కొందరు మాత్రమే కానీ, ఇలాంటివారు చాలా మందే ఉన్నారు.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. ఈ పార్టీలోనూ చాలా మంది సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. యనమల రామకృష్ణుడు, టీజీ వెంకటేష్, కొనకళ్ల నారాయణ వంటివారు దూరమయ్యారు. ఒకరిద్దరు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలిచినా.. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం పోటీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీనికి పరిమితి ఏమీ పెట్టకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో పార్టీ పగ్గాలను నారా లోకేష్కు అప్పగించే అవకాశం ఉంది. అందుకే.. యువతకు అవకాశం పెంచుతున్నారు.
ఇక, జనసేనలో ఉన్నవారే కొనసాగుతారు తప్ప.. కొత్తగా వచ్చే సీనియర్లు.. లేరు. ఇక, బీజేపీ విషయాన్ని గమనిస్తే 75 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ వయసు దాటిని వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఎలానూ లేదు. దీంతో రాజకీయంగా ఇప్పుడు అన్ని పార్టీలకూ యువతే కీలకంగా మారనున్నారు. ఈ విషయంలో టీడీపీ దూకుడుగానే ఉంది. యువతకు, కొత్త తరం వారికి ప్రాధాన్యం ఇస్తూ.. అటు ఎమ్మెల్యే సీట్లు, ఇటు మంత్రి పదవుల విషయంలోనూ వారిని ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 6:15 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…