ఏపీ రాజకీయాల నుంచి వచ్చే ఒకటి రెండేళ్లలో చాలా మంది సీనియర్ నేతలు.. టాప్ పొలిటికల్ లీడర్లు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు… ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్టాపిక్గా మారింది. ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ సీనియర్ల సమస్య వెంటాడుతోంది. 2029 ఎన్నికల నాటికి సీనియర్ నాయకుల సంఖ్య తగ్గుముఖం పట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది యువత ముందుకు వచ్చారు. అయితే.. ఇలా యువ రక్తం వస్తే తప్పేంటి? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తుంది. తప్పులేదు. కానీ.. సీనియర్లు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. వారి ఆలోచనా విధానం.. వారి దూర దృష్టి వంటివి పార్టీకి మేలు చేస్తాయి.
పార్టీల పరంగా చూస్తే.. వైసీపీలో ఇప్పటికే బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. అయినా.. ఈసారికి పోటీ చేయాలంటూ జగన్ ఆయనను ఒప్పించారు. అదేవిధంగా ధర్మాన బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. వీరు కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దూరంగానే ఉంటానని చెప్పారు. కానీ, జగన్ ఫోర్స్ చేశారు. ఇక, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే బాటలో ఉన్నారు. వీరు కొందరు మాత్రమే కానీ, ఇలాంటివారు చాలా మందే ఉన్నారు.
టీడీపీ విషయాన్ని తీసుకుంటే.. ఈ పార్టీలోనూ చాలా మంది సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. యనమల రామకృష్ణుడు, టీజీ వెంకటేష్, కొనకళ్ల నారాయణ వంటివారు దూరమయ్యారు. ఒకరిద్దరు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలిచినా.. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం పోటీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీనికి పరిమితి ఏమీ పెట్టకపోయినా.. వచ్చే నాలుగేళ్లలో పార్టీ పగ్గాలను నారా లోకేష్కు అప్పగించే అవకాశం ఉంది. అందుకే.. యువతకు అవకాశం పెంచుతున్నారు.
ఇక, జనసేనలో ఉన్నవారే కొనసాగుతారు తప్ప.. కొత్తగా వచ్చే సీనియర్లు.. లేరు. ఇక, బీజేపీ విషయాన్ని గమనిస్తే 75 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ వయసు దాటిని వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఎలానూ లేదు. దీంతో రాజకీయంగా ఇప్పుడు అన్ని పార్టీలకూ యువతే కీలకంగా మారనున్నారు. ఈ విషయంలో టీడీపీ దూకుడుగానే ఉంది. యువతకు, కొత్త తరం వారికి ప్రాధాన్యం ఇస్తూ.. అటు ఎమ్మెల్యే సీట్లు, ఇటు మంత్రి పదవుల విషయంలోనూ వారిని ప్రోత్సహిస్తుండడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 6:15 pm
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…