Political News

పాద‌యాత్ర.. మ‌ళ్లీ సై అంటున్న ష‌ర్మిల‌!

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా రెండేళ్ల ముందే యాత్ర ప్రారంభించి రెండు విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వస‌నీయ‌త‌ను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించిన‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెప్తున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గ‌త‌ చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.

మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట.

దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతుండడం గమనార్హం. అయితే ఇది అధికారికంగా కాదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

2 hours ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

2 hours ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

3 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

3 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

5 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

5 hours ago