ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించరు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా రెండేళ్ల ముందే యాత్ర ప్రారంభించి రెండు విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెప్తున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.
మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట.
దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతుండడం గమనార్హం. అయితే ఇది అధికారికంగా కాదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…