ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించరు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించారు. అలాగే భారత్ జూడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కూడా రెండేళ్ల ముందే యాత్ర ప్రారంభించి రెండు విడతలుగా పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీలో 2.8% మాత్రమే ఉన్న ఓటు బ్యాంకును పుంజుకునేలా చేయడంతో పాటు నాయకులను బలోపేతం చేయాల్సిన అవసరం షర్మిలకు ఏర్పడింది. ఇప్పటినుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా వైసిపి నుంచి బలమైన నాయకులు బయటకు రావాలన్నా, తన పార్టీలో చేరాలన్నా ముందు ప్రజల్లో తన విశ్వసనీయతను పెంచుకోవడంతోపాటు ప్రజల్లో బలోపేతం కావాలని వ్యూహాన్ని ఆమె రచించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి షర్మిల సమాచారం అందించినట్లు రఘువీరారెడ్డి వంటి నాయకులు చెప్తున్నారు. అంటే ఇది అధికారికంగా బయటికి రాకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయాన్ని చాలామంది నాయకులు ఒప్పుకుంటున్నారు.
మొత్తంగా మూడు విడతల్లో చేయాలనే ఉద్దేశంతో షర్మిలో ఉన్నారని సమాచారం. ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల్లో మూడు విడతలుగా పాదయాత్ర చేసి సుదీర్ఘ కాలం పాటు ప్రజల్లో ఉండటం ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైయస్ వారసత్వాన్ని కూడా తాను అందిపుచ్చుకునేలా అడుగులు వేస్తున్నారనేది మీరు మాట.
దీనికి పార్టీ అధిష్టానం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని వస్తే కనుక షర్మిల వచ్చే ఏడాది ప్రారంభం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు చెబుతుండడం గమనార్హం. అయితే ఇది అధికారికంగా కాదు. కానీ అంతర్గత చర్చల్లో మాత్రం జోరుగానే ప్రచారం జరుగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…