Political News

బొత్స ఎఫెక్ట్ .. తూర్పు కాపుల ఆగ్ర‌హం రీజ‌నేంటి?

వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.  సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక‌గ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు.

కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజయనగరం జిల్లాకు చెందిన నాయకులు, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ను కూటమి నాయకులు దాదాపు హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే 21 మంది నాయకులు టిడిపి వైపు వచ్చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీనికి సంబంధించి చంద్రబాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మిగిలిన వారు కూడా వచ్చేస్తారని ఫలితంగా విశాఖపట్నం కార్పొరేషన్ మొత్తం కూట‌మి వ‌శం అవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులు కనిపించడం లేదు. ఈ క్రమంలో బొత్స‌ను నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి లేదని కేవలం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా ఆయనను నిలబెట్టినట్టే అవుతుందని తూర్పు కాపుల్లో చర్చ జరుగుతోంది.

తమ నాయకుడిని జగన్ బలి చేస్తున్నారని తూర్పు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఏదైనా పదవి ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి సాధ్యమయ్యే అవకాశం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, శాసన మండలిలో బలంగా ఉన్నప్పటికీ కొందరు ముఖ్య నేత‌లు దూరంగా ఉండటంతో  వైసిపికి ఎటూ పాలు పోని పరిస్థితి నెల‌కొంది. ఇలాంటి సమయంలో అనవసరంగా బొత్స‌ను బద్నాం చేస్తున్నారని తూర్పు కాపుల్లో ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతుండడం గమనార్హం. 

This post was last modified on August 4, 2024 7:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: BotsaMLC

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago