Political News

బొత్స ఎఫెక్ట్ .. తూర్పు కాపుల ఆగ్ర‌హం రీజ‌నేంటి?

వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.  సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక‌గ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు.

కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజయనగరం జిల్లాకు చెందిన నాయకులు, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ను కూటమి నాయకులు దాదాపు హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే 21 మంది నాయకులు టిడిపి వైపు వచ్చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీనికి సంబంధించి చంద్రబాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మిగిలిన వారు కూడా వచ్చేస్తారని ఫలితంగా విశాఖపట్నం కార్పొరేషన్ మొత్తం కూట‌మి వ‌శం అవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులు కనిపించడం లేదు. ఈ క్రమంలో బొత్స‌ను నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి లేదని కేవలం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా ఆయనను నిలబెట్టినట్టే అవుతుందని తూర్పు కాపుల్లో చర్చ జరుగుతోంది.

తమ నాయకుడిని జగన్ బలి చేస్తున్నారని తూర్పు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఏదైనా పదవి ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి సాధ్యమయ్యే అవకాశం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, శాసన మండలిలో బలంగా ఉన్నప్పటికీ కొందరు ముఖ్య నేత‌లు దూరంగా ఉండటంతో  వైసిపికి ఎటూ పాలు పోని పరిస్థితి నెల‌కొంది. ఇలాంటి సమయంలో అనవసరంగా బొత్స‌ను బద్నాం చేస్తున్నారని తూర్పు కాపుల్లో ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతుండడం గమనార్హం. 

This post was last modified on August 4, 2024 7:30 pm

Share
Show comments
Published by
Satya
Tags: BotsaMLC

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago