వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాకు చెందిన నాయకులు, అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా విశాఖపట్నంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ను కూటమి నాయకులు దాదాపు హస్తగతం చేసుకున్నారు. ఇప్పటికే 21 మంది నాయకులు టిడిపి వైపు వచ్చేసారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన వారు కూడా వచ్చేస్తారని ఫలితంగా విశాఖపట్నం కార్పొరేషన్ మొత్తం కూటమి వశం అవుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకులు కనిపించడం లేదు. ఈ క్రమంలో బొత్సను నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి లేదని కేవలం ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్టుగా ఆయనను నిలబెట్టినట్టే అవుతుందని తూర్పు కాపుల్లో చర్చ జరుగుతోంది.
తమ నాయకుడిని జగన్ బలి చేస్తున్నారని తూర్పు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఏదైనా పదవి ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి సాధ్యమయ్యే అవకాశం లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండటం, శాసన మండలిలో బలంగా ఉన్నప్పటికీ కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉండటంతో వైసిపికి ఎటూ పాలు పోని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అనవసరంగా బొత్సను బద్నాం చేస్తున్నారని తూర్పు కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on August 4, 2024 7:30 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…