Political News

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత జిల్లాలో తన పర్యటనకు అడ్డు పెడతారా అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇది వివాదానికి దారితీసింది. అప్పట్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి. దీనిలో టిడిపి నాయకులు వైసిపి నాయకులు పరస్పరం రాళ్ల రువ్వుకోవడం చివరకు పోలీస్ వాహనాల ధ్వంసం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 21 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురైదుగురుపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అప్పట్లో తీవ్ర వివాదానికి, రాజకీయంగా విమర్శలకు దారి తీసిన అంగళ్లు ఘటన ఎన్నికల సమయంలోనూ ప్రచారాస్త్రంగా మారింది.

పోలీసులు ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును నిలువరించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలోని ప్ర‌బుత్వం వచ్చినా అంగళ్లు కేసు కు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్లు నమోదు చేయకపోవడం కీలకమైన నిందితుల్ని అరెస్టు చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు తమపై అన్యాయంగా కేసులు పెట్టారని, తమను అక్రమంగా ఇరికించారని చెబుతున్న టిడిపి నాయకులకు ఇప్పటివరకు ఎలాంటి ఊర‌ట‌ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పటి ఘటనలో మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆయన పేరును కూడా కేసులో నమోదు చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.

అదేవిధంగా వైసీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ ఘటంలో బాధ్యులేనని వారిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారని అంటున్నారు. కాబట్టి వారి పైన కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ కేసును పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తారా? తమ్ముళ్లకు ఊర‌ట‌ ఇస్తారా? అనేది చూడాలి.

This post was last modified on August 4, 2024 1:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

17 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago