Political News

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత జిల్లాలో తన పర్యటనకు అడ్డు పెడతారా అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇది వివాదానికి దారితీసింది. అప్పట్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి. దీనిలో టిడిపి నాయకులు వైసిపి నాయకులు పరస్పరం రాళ్ల రువ్వుకోవడం చివరకు పోలీస్ వాహనాల ధ్వంసం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 21 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురైదుగురుపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అప్పట్లో తీవ్ర వివాదానికి, రాజకీయంగా విమర్శలకు దారి తీసిన అంగళ్లు ఘటన ఎన్నికల సమయంలోనూ ప్రచారాస్త్రంగా మారింది.

పోలీసులు ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును నిలువరించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలోని ప్ర‌బుత్వం వచ్చినా అంగళ్లు కేసు కు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్లు నమోదు చేయకపోవడం కీలకమైన నిందితుల్ని అరెస్టు చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు తమపై అన్యాయంగా కేసులు పెట్టారని, తమను అక్రమంగా ఇరికించారని చెబుతున్న టిడిపి నాయకులకు ఇప్పటివరకు ఎలాంటి ఊర‌ట‌ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పటి ఘటనలో మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆయన పేరును కూడా కేసులో నమోదు చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.

అదేవిధంగా వైసీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ ఘటంలో బాధ్యులేనని వారిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారని అంటున్నారు. కాబట్టి వారి పైన కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ కేసును పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తారా? తమ్ముళ్లకు ఊర‌ట‌ ఇస్తారా? అనేది చూడాలి.

Satya

Recent Posts

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

13 minutes ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

30 minutes ago

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

2 hours ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

12 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

14 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

16 hours ago