Political News

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత జిల్లాలో తన పర్యటనకు అడ్డు పెడతారా అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇది వివాదానికి దారితీసింది. అప్పట్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి. దీనిలో టిడిపి నాయకులు వైసిపి నాయకులు పరస్పరం రాళ్ల రువ్వుకోవడం చివరకు పోలీస్ వాహనాల ధ్వంసం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 21 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురైదుగురుపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అప్పట్లో తీవ్ర వివాదానికి, రాజకీయంగా విమర్శలకు దారి తీసిన అంగళ్లు ఘటన ఎన్నికల సమయంలోనూ ప్రచారాస్త్రంగా మారింది.

పోలీసులు ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును నిలువరించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలోని ప్ర‌బుత్వం వచ్చినా అంగళ్లు కేసు కు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్లు నమోదు చేయకపోవడం కీలకమైన నిందితుల్ని అరెస్టు చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు తమపై అన్యాయంగా కేసులు పెట్టారని, తమను అక్రమంగా ఇరికించారని చెబుతున్న టిడిపి నాయకులకు ఇప్పటివరకు ఎలాంటి ఊర‌ట‌ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పటి ఘటనలో మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆయన పేరును కూడా కేసులో నమోదు చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.

అదేవిధంగా వైసీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ ఘటంలో బాధ్యులేనని వారిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారని అంటున్నారు. కాబట్టి వారి పైన కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ కేసును పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తారా? తమ్ముళ్లకు ఊర‌ట‌ ఇస్తారా? అనేది చూడాలి.

Satya

Recent Posts

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

3 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

56 minutes ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

1 hour ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

2 hours ago

ఎవ‌రా త‌ల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్?

హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్త‌య్యాక త‌ల్లెప్పుడు…

2 hours ago

హీరోల ఫ్రెండ్ షిప్ గురించి చర్చలెందుకు

సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…

2 hours ago