Political News

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత జిల్లాలో తన పర్యటనకు అడ్డు పెడతారా అంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

ఇది వివాదానికి దారితీసింది. అప్పట్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి. దీనిలో టిడిపి నాయకులు వైసిపి నాయకులు పరస్పరం రాళ్ల రువ్వుకోవడం చివరకు పోలీస్ వాహనాల ధ్వంసం కూడా చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో టిడిపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 21 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురైదుగురుపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అప్పట్లో తీవ్ర వివాదానికి, రాజకీయంగా విమర్శలకు దారి తీసిన అంగళ్లు ఘటన ఎన్నికల సమయంలోనూ ప్రచారాస్త్రంగా మారింది.

పోలీసులు ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని, మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును నిలువరించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఘటన జరిగి ఏడాది అయినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారి చంద్రబాబు నేతృత్వంలోని ప్ర‌బుత్వం వచ్చినా అంగళ్లు కేసు కు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్లు నమోదు చేయకపోవడం కీలకమైన నిందితుల్ని అరెస్టు చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు తమపై అన్యాయంగా కేసులు పెట్టారని, తమను అక్రమంగా ఇరికించారని చెబుతున్న టిడిపి నాయకులకు ఇప్పటివరకు ఎలాంటి ఊర‌ట‌ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసుకు సంబంధించి చంద్రబాబు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పటి ఘటనలో మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందని ఆయన పేరును కూడా కేసులో నమోదు చేయాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.

అదేవిధంగా వైసీపీకి చెందిన మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ ఘటంలో బాధ్యులేనని వారిని పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారని అంటున్నారు. కాబట్టి వారి పైన కేసులు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు నిరసనకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన ఈ కేసును పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికైనా ఈ కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తారా? తమ్ముళ్లకు ఊర‌ట‌ ఇస్తారా? అనేది చూడాలి.

This post was last modified on August 4, 2024 1:28 pm

Share

Recent Posts

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

10 minutes ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

12 minutes ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

26 minutes ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

35 minutes ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

49 minutes ago

చిట్టిబాబుకి ప్యాన్ ఇండియా ప్రాబ్లమ్ లేదు

సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…

50 minutes ago