వైసీపీ అధికారంలో ఉండగా.. చేస్తానని చెప్పిన వాటిలో రచ్చబండ కార్యక్రమం కీలకమైంది. సీఎంగా ఉన్న జగన్.. అప్పట్లో ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినాలని అనుకున్నారు. ఈ క్రమంలో నలుగురు కీలక నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్యక్రమానికి రూపకల్పన చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. 2009లో ఇదే కార్యక్రమానికి బయలు దేరిన అప్పటి సీఎం వైఎస్ దురదృష్టవ శాత్తు మరణించారు. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో తన తండ్రి ప్రారంభించిన రచ్చ బండకార్యక్రమాన్ని తాను కొనసాగించాలని జగన్ భావిం చారు. కానీ, ఐదేళ్లలో అనుకున్నారే తప్ప.. చేయలేదు. అంతా బాగానే ఉందని.. ఇక, రచ్చబండతో పనే లేదని అనుకున్నారు. కానీ, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజాదర్బార్ పేరుతో ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కానీ, ఇతర మంత్రులు కానీ.. వేరే ప్రాంతాలకు వెళ్లకుండా .. పార్టీ కార్యాలయాలనే ప్రజాదర్భార్లుగా మార్చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. ఎంతగా అంటూ.. గత వారం రోజుల్లో మంగళ గిరి వీధులు కిక్కిరిసి పోయేంతగా! అవును. నిజమే. ఇటు టీడీపీ కార్యాలయంలోనూ.. అటు జనసేన కార్యా లయంలోనూ, మరోవైపు.. నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్.. ఉండవల్లిలోనూ.. ప్రజలు కిక్కిరిసి పోతున్నారు. ఊహించని విధంగా జనాలు వస్తున్నారు. వీరి కోసం.. పార్టీ కార్యాలయంలో మూడు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారంటే.. ప్రజలు ఎలా తరలి వస్తున్నారో అంచనా వేయొచ్చు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలనే ప్రస్తావించవచ్చు. కానీ, వారికి కావాల్సింది అదే కాబట్టి.. చంద్రబాబు నుంచి ఇతర మంత్రుల వరకు కూడా ప్రజాదర్బార్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నారు దీంతో దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తున్న వైసీపీ.. అయ్యో.. మనం కూడా అప్పట్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేదని అనుకోవడం గమనార్హం. కానీ, అప్పట్లో చేసిన నిర్లక్ష్యం కారణంగా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
This post was last modified on August 4, 2024 11:45 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…