వైసీపీ అధికారంలో ఉండగా.. చేస్తానని చెప్పిన వాటిలో రచ్చబండ కార్యక్రమం కీలకమైంది. సీఎంగా ఉన్న జగన్.. అప్పట్లో ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినాలని అనుకున్నారు. ఈ క్రమంలో నలుగురు కీలక నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్యక్రమానికి రూపకల్పన చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. 2009లో ఇదే కార్యక్రమానికి బయలు దేరిన అప్పటి సీఎం వైఎస్ దురదృష్టవ శాత్తు మరణించారు. దీంతో ఆ కార్యక్రమం ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో తన తండ్రి ప్రారంభించిన రచ్చ బండకార్యక్రమాన్ని తాను కొనసాగించాలని జగన్ భావిం చారు. కానీ, ఐదేళ్లలో అనుకున్నారే తప్ప.. చేయలేదు. అంతా బాగానే ఉందని.. ఇక, రచ్చబండతో పనే లేదని అనుకున్నారు. కానీ, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రజాదర్బార్ పేరుతో ఇదే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కానీ, ఇతర మంత్రులు కానీ.. వేరే ప్రాంతాలకు వెళ్లకుండా .. పార్టీ కార్యాలయాలనే ప్రజాదర్భార్లుగా మార్చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. ఎంతగా అంటూ.. గత వారం రోజుల్లో మంగళ గిరి వీధులు కిక్కిరిసి పోయేంతగా! అవును. నిజమే. ఇటు టీడీపీ కార్యాలయంలోనూ.. అటు జనసేన కార్యా లయంలోనూ, మరోవైపు.. నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్.. ఉండవల్లిలోనూ.. ప్రజలు కిక్కిరిసి పోతున్నారు. ఊహించని విధంగా జనాలు వస్తున్నారు. వీరి కోసం.. పార్టీ కార్యాలయంలో మూడు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారంటే.. ప్రజలు ఎలా తరలి వస్తున్నారో అంచనా వేయొచ్చు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలనే ప్రస్తావించవచ్చు. కానీ, వారికి కావాల్సింది అదే కాబట్టి.. చంద్రబాబు నుంచి ఇతర మంత్రుల వరకు కూడా ప్రజాదర్బార్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరిస్తున్నారు దీంతో దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయి. ఈ పరిణామాలను చూస్తున్న వైసీపీ.. అయ్యో.. మనం కూడా అప్పట్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేదని అనుకోవడం గమనార్హం. కానీ, అప్పట్లో చేసిన నిర్లక్ష్యం కారణంగా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
This post was last modified on August 4, 2024 11:45 am
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…