Political News

ఈ ఒక్క ప‌నైనా చేసి ఉంటే.. వైసీపీలో గుస‌గుస‌…!

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. చేస్తాన‌ని చెప్పిన వాటిలో ర‌చ్చ‌బండ‌ కార్య‌క్ర‌మం కీల‌క‌మైంది. సీఎంగా ఉన్న జ‌గ‌న్‌.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి వారి స‌మ‌స్య‌లు వినాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో న‌లుగురు కీల‌క నాయ‌కుల‌తో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసే బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించారు. 2009లో ఇదే కార్య‌క్ర‌మానికి బ‌య‌లు దేరిన అప్ప‌టి సీఎం వైఎస్ దుర‌దృష్ట‌వ శాత్తు మ‌ర‌ణించారు. దీంతో ఆ కార్య‌క్ర‌మం ఆగిపోయింది.

ఈ నేప‌థ్యంలో త‌న తండ్రి ప్రారంభించిన ర‌చ్చ బండ‌కార్య‌క్ర‌మాన్ని తాను కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ భావిం చారు. కానీ, ఐదేళ్ల‌లో అనుకున్నారే త‌ప్ప‌.. చేయ‌లేదు. అంతా బాగానే ఉంద‌ని.. ఇక‌, ర‌చ్చ‌బండ‌తో ప‌నే లేద‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మ‌రుక్ష‌ణం నుంచి ప్ర‌జాద‌ర్బార్ పేరుతో ఇదే కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో సీఎం కానీ, ఇత‌ర మంత్రులు కానీ.. వేరే ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా .. పార్టీ కార్యాల‌యాల‌నే ప్ర‌జాద‌ర్భార్‌లుగా మార్చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటెత్తుతున్నారు. ఎంత‌గా అంటూ.. గ‌త వారం రోజుల్లో మంగ‌ళ గిరి వీధులు కిక్కిరిసి పోయేంత‌గా! అవును. నిజ‌మే. ఇటు టీడీపీ కార్యాల‌యంలోనూ.. అటు జ‌న‌సేన కార్యా ల‌యంలోనూ, మ‌రోవైపు.. నారా లోకేష్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌.. ఉండ‌వ‌ల్లిలోనూ.. ప్ర‌జ‌లు కిక్కిరిసి పోతున్నారు. ఊహించ‌ని విధంగా జ‌నాలు వ‌స్తున్నారు. వీరి కోసం.. పార్టీ కార్యాల‌యంలో మూడు వ‌రుస‌ల క్యూలైన్ల‌ను ఏర్పాటు చేశారంటే.. ప్ర‌జ‌లు ఎలా త‌ర‌లి వ‌స్తున్నారో అంచ‌నా వేయొచ్చు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌నే ప్ర‌స్తావించ‌వ‌చ్చు. కానీ, వారికి కావాల్సింది అదే కాబ‌ట్టి.. చంద్ర‌బాబు నుంచి ఇత‌ర మంత్రుల వ‌ర‌కు కూడా ప్ర‌జాద‌ర్బార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని స‌మ‌స్య‌ల‌ను అక్క‌డే ప‌రిష్క‌రిస్తున్నారు దీంతో ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కాని అనేక స‌మ‌స్య‌లు ఇప్పుడు ప‌రిష్కారం అవుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను చూస్తున్న వైసీపీ.. అయ్యో.. మ‌నం కూడా అప్ప‌ట్లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ఉంటే బాగుండేద‌ని అనుకోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, అప్ప‌ట్లో చేసిన నిర్ల‌క్ష్యం కార‌ణంగా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

Satya

Recent Posts

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

1 hour ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

11 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

13 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

15 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

16 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

16 hours ago