2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తో రఘురామకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలపై రఘురామకృష్ణరాజు గత నాలుగున్నరేళ్లుగా సంచలన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక, తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అయితే, గతంలో తమపై విమర్శలు చేశారన్న కారణంతో రఘురామను టార్గెట్ చేస్తూ ఆయన వ్యాపారాలను దెబ్బకొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలోనే రఘురామకు చెందిన ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ దివాలా ప్రక్రియకు సంబంధించిన ఆయన బ్యాంకు ఖాతా మోసపూరితమైనదని ఎస్బిఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్బిఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ లకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను ఆగస్టు 28కి హైకోర్టు వాయిదా వేసింది. దాంతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ సీతారామంపై కూడా ఎస్బీఐ ప్రొసీడింగ్స్ ను నిలిపివేసేలాగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 2, 2024 2:23 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…