2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తో రఘురామకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలపై రఘురామకృష్ణరాజు గత నాలుగున్నరేళ్లుగా సంచలన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక, తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అయితే, గతంలో తమపై విమర్శలు చేశారన్న కారణంతో రఘురామను టార్గెట్ చేస్తూ ఆయన వ్యాపారాలను దెబ్బకొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలోనే రఘురామకు చెందిన ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ దివాలా ప్రక్రియకు సంబంధించిన ఆయన బ్యాంకు ఖాతా మోసపూరితమైనదని ఎస్బిఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్బిఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ లకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను ఆగస్టు 28కి హైకోర్టు వాయిదా వేసింది. దాంతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ సీతారామంపై కూడా ఎస్బీఐ ప్రొసీడింగ్స్ ను నిలిపివేసేలాగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 2, 2024 2:23 pm
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…