వైసీపీ పాలనలో జగన్ తన అనుయాయులకు, అనుచరులకు, తన మనుషులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీ పార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నప్పటికీ కేవలం తమ పార్టీ నేత కాబట్టే ఆమెకు పదవి కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీపార్వతికి యూనివర్సిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన వెల్లడించారు. ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా యూనివర్సిటీ పరిశోధికులకు గైడ్ గా విధులు నిర్వహించారు.
అయితే, తాజాగా ఆ విధుల నుంచి కూడా లక్ష్మీ పార్వతిని తప్పించినట్లుగా కిషోర్ చెప్పారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను మరో ఆచార్యునికి బదిలీ చేయాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. ఏదేమైనా జగన్ హయాంలో అప్పణంగా పదవులు పొందిన లక్ష్మీ పార్వతి వంటి నేతలపై చంద్రబాబు తన మార్కు నిర్ణయాలతో షాకిస్తున్న వైనం చర్చనీయాంశమైంది.
This post was last modified on August 2, 2024 2:22 pm
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…
షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సహా మరికొందరికి తాజాగా నాంపల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…