వైసీపీ పాలనలో జగన్ తన అనుయాయులకు, అనుచరులకు, తన మనుషులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీ పార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నప్పటికీ కేవలం తమ పార్టీ నేత కాబట్టే ఆమెకు పదవి కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీపార్వతికి యూనివర్సిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన వెల్లడించారు. ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా యూనివర్సిటీ పరిశోధికులకు గైడ్ గా విధులు నిర్వహించారు.
అయితే, తాజాగా ఆ విధుల నుంచి కూడా లక్ష్మీ పార్వతిని తప్పించినట్లుగా కిషోర్ చెప్పారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను మరో ఆచార్యునికి బదిలీ చేయాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. ఏదేమైనా జగన్ హయాంలో అప్పణంగా పదవులు పొందిన లక్ష్మీ పార్వతి వంటి నేతలపై చంద్రబాబు తన మార్కు నిర్ణయాలతో షాకిస్తున్న వైనం చర్చనీయాంశమైంది.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…