వైసీపీ పాలనలో జగన్ తన అనుయాయులకు, అనుచరులకు, తన మనుషులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీ పార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నప్పటికీ కేవలం తమ పార్టీ నేత కాబట్టే ఆమెకు పదవి కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ లక్ష్మీపార్వతికి ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.
ఈ ప్రకారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్ కిషోర్ బాబు ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీపార్వతికి యూనివర్సిటీ నుండి వేతనం చెల్లించలేదని ఆయన వెల్లడించారు. ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా విధులు నిర్వహించిన సమయంలో కూడా యూనివర్సిటీ పరిశోధికులకు గైడ్ గా విధులు నిర్వహించారు.
అయితే, తాజాగా ఆ విధుల నుంచి కూడా లక్ష్మీ పార్వతిని తప్పించినట్లుగా కిషోర్ చెప్పారు. ఆమె దగ్గర మార్గదర్శకం కోసం చేరిన రీసెర్చ్ స్కాలర్స్ ను మరో ఆచార్యునికి బదిలీ చేయాలని ఆదేశించినట్లుగా వెల్లడించారు. ఏదేమైనా జగన్ హయాంలో అప్పణంగా పదవులు పొందిన లక్ష్మీ పార్వతి వంటి నేతలపై చంద్రబాబు తన మార్కు నిర్ణయాలతో షాకిస్తున్న వైనం చర్చనీయాంశమైంది.
This post was last modified on August 2, 2024 2:22 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…