Political News

ఇండియా కూట‌మిలో జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు

గ‌త కొన్నాళ్లుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం కాంగ్రెస్ కూట‌మి ప‌క్షాలైన ఇండియాలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. డిల్లీలో ధ‌ర్నా చేసిన స‌మ‌యంలో జ‌గ‌న్‌.. కొంద‌రు ఇండియా కూట‌మి పార్టీల నాయ‌కుల‌ను ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌, జార్ఖండ్‌కు చెందిన జేఎంఎం పార్టీ నాయ‌కులు, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు స‌హా బిహార్‌లోని ఇండియా కూట‌మి పార్టీ ఆర్జేడీ నేత‌లు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే.. కాంగ్రెస్‌కు చెందిన వారు ఎవ‌రూ రాలేదు. అయితే.. కాంగ్రెస్ చెప్ప‌కుండానే వీరు వ‌చ్చారా? అనేది డౌటు.

ఒక‌వేళ చెప్ప‌క‌పోయినా వ‌చ్చారంటే జ‌గ‌న్‌పై వారికి ఉన్న సానుభూతి కావొచ్చు. లేదామున్ముందు త‌మ‌కు ఉప‌యోగ ప‌డ‌తాడ నే అభిప్రాయం కావొచ్చు. గ‌తంలో ఎంపీగా కూడా చేసిన జ‌గ‌న్‌తో ఉన్న స్నేహ సంబంధాలు కూడా అయి ఉంటాయి. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్‌కు వారి నుంచి ఆశించిన మేర‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. అయితే.. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ వంతు వ‌చ్చింది. ఇండియా కూట‌మికి అటు పార్ల‌మెంటులోనూ.. ఇటు బ‌య‌ట కూడా మ‌రింత మ‌ద్ద‌తు అవ‌స‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో కూట‌మి నాయ‌కులు డీఎంకే ఎంపీ తిరుమావళన్, ఎస్పీ అధినేత అఖిలేష్, ఆర్జేడీ నేతలు కూడా.. జ‌గ‌న్‌ను కూట‌మిలోకి ఆహ్వానించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

ఈ విష‌యం గ‌త వారం రోజులుగా జాతీయ రాజ‌కీయాల్లో నానుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్‌.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే తోనూ కొంద‌రు నాయ‌కులు ఇదే విష‌యంపై చ‌ర్చించారు. దీనికి సంబంధించి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే.. విష‌యంపై మాత్రం అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బుధవారం జ‌ర‌గ‌నున్న‌ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించే అంశంపై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది.

అయితే.. జ‌గ‌న్ నేరుగా ఇండియా కూట‌మికి మ‌ద్ద‌తిస్తే.. ఆయ‌న‌పై ఉన్న కేసుల తుట్టె క‌దులుతుంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. పైగా.. కేసులు పెట్టించిందే కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయంలో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న కూడా ఇండియా కూట‌మిలో ఏమేర‌కు చేర‌తారు? అనేది కూడా ప్ర‌శ్నే. అయితే.. ఇదంతా రాజ‌కీయంగా హైప్ తెచ్చేందుకు జ‌రుగుతున్న చ‌ర్చ‌గా కొంద‌రు చెబుతుంటే.. కాదు నిజంగానే వైసీపీ విష‌యాన్ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీలో చ‌ర్చించ‌నున్నార‌ని సీనియ‌ర్లు కూడా చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

This post was last modified on July 30, 2024 10:38 pm

Share

Recent Posts

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

6 minutes ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

7 minutes ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

21 minutes ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

30 minutes ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

44 minutes ago

చిట్టిబాబుకి ప్యాన్ ఇండియా ప్రాబ్లమ్ లేదు

సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…

45 minutes ago