టైమొస్తే.. ఎవరినీ ఊరుకోబోమని.. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ఎవరు తప్పు చేసినట్టు రుజువైనా ఊరుకునేది లేదన్నారు. ఖచ్చితంగా జైలుకు పంపిస్తామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా.. జగనైనా ఎవరు తప్పు చేసినట్టు తేలినా ఊరుకునేలేదని తేల్చి చెప్పారు. మదనపల్లె సబ్ కలక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం.. ఉద్దేశ పూర్వకంగా చేసిందేనని, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూపీ లాగే పనిలో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే సీనియర్ అధికారి సిసోడియా అక్కడ మూడు రోజులపాటు మకాం వేసి.. విచారణ సాగించారని తెలిపారు.
ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అనగాని తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశ పూర్వంగానే చేసినట్టు తెలిసిన దరిమిలా.. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా.. శిక్షించి తీరుతామని పరోక్షంగా ఆయన జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవు” అని మంత్రి అనగాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసుల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందని తెలిసిందన్నారు. వీటిపైనా విచారణ చేయిస్తామన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కేవలం వేల రూపాయలకు లీజులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇలాంటివి ఎలా జరిగాయో తేలుస్తామని మంత్రి చెప్పారు. వీటిపైనా విచారణ చేయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అనగాని.. గత ప్రభుత్వం 22ఏ అసైన్డ్ బూమలును పప్పు బెల్లాల్లా పంచిపెట్టేందుకే నిబంధనలు ఎత్తేసిందని విమర్శించారు. ఇప్పటివరకు ఇలా ఎంత మంది ఆస్తులు చేజిక్కించుకున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్టు తెలిపారు. భూముల సర్వే పేరుతో ప్రజ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పారు. సరిహద్దు రాళ్ల కోసం, వాటిపై జగన్ ఫొటోలు వేసుకునేందుకు 350 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలిపారు. వీటిని తొలగించేందుకు మరో 15 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇదంతా వృథా ఖర్చేనని..దీనిని అప్పటి పాలకుల నుంచి రికవరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
జగన్ పాలనలో జరిగిన భూ పందేరాలపైనా విచారణ చేయించాలని చూస్తున్నామన్నారు. కొన్ని మఠాలకు ఉదారంగా ప్రజలకు చెందిన, ప్రభుత్వానికి చెందిన భూములు కూడా ఇచ్చేశారని తెలిపారు. వీటిని వెనక్కి తీసుకోవడంపై దృష్టి పెట్టామని.. కానీ, న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని.. అయినపట్టికీ ముందుకు వెళ్లాలని బావిస్తున్నామని తెలిపారు. త్వరలోనే వీటిపై మరింత క్లారిటీ వస్తుందని మంత్రి అనగాని తేల్చి చెప్పారు.
This post was last modified on July 30, 2024 7:18 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…