Political News

టైమొస్తే జ‌గ‌నైనా జైలుకే: ఏపీ మంత్రి

టైమొస్తే.. ఎవ‌రినీ ఊరుకోబోమ‌ని.. ఏపీ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఎవ‌రు త‌ప్పు చేసిన‌ట్టు రుజువైనా ఊరుకునేది లేద‌న్నారు. ఖ‌చ్చితంగా జైలుకు పంపిస్తామ‌న్నారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అయినా.. జ‌గ‌నైనా ఎవ‌రు త‌ప్పు చేసిన‌ట్టు తేలినా ఊరుకునేలేద‌ని తేల్చి చెప్పారు. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌ల‌క్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం.. ఉద్దేశ పూర్వ‌కంగా చేసిందేన‌ని, దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాన్ని కూపీ లాగే ప‌నిలో ఉన్నామని తెలిపారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ అధికారి సిసోడియా అక్క‌డ మూడు రోజులపాటు మ‌కాం వేసి.. విచార‌ణ సాగించార‌ని తెలిపారు.

ఆయ‌న ఇచ్చే నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన‌గాని తెలిపారు. అగ్ని ప్ర‌మాదాన్ని ఉద్దేశ పూర్వంగానే చేసిన‌ట్టు తెలిసిన ద‌రిమిలా.. ఈ ఘ‌ట‌న వెనుక ఎవ‌రు ఉన్నా.. శిక్షించి తీరుతామ‌ని ప‌రోక్షంగా ఆయ‌న జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవు” అని మంత్రి అనగాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీసుల్లో ప్రైవేటు వ్య‌క్తుల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉంద‌ని తెలిసింద‌న్నారు. వీటిపైనా విచార‌ణ చేయిస్తామ‌న్నారు. కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం వేల రూపాయ‌ల‌కు లీజులు ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

ఇలాంటివి ఎలా జ‌రిగాయో తేలుస్తామ‌ని మంత్రి చెప్పారు. వీటిపైనా విచార‌ణ చేయించాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అన‌గాని.. గ‌త ప్ర‌భుత్వం 22ఏ అసైన్డ్ బూమ‌లును ప‌ప్పు బెల్లాల్లా పంచిపెట్టేందుకే నిబంధ‌న‌లు ఎత్తేసింద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇలా ఎంత మంది ఆస్తులు చేజిక్కించుకున్నార‌నే విష‌యంపై కూపీ లాగుతున్న‌ట్టు తెలిపారు. భూముల స‌ర్వే పేరుతో ప్ర‌జ ధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌ని చెప్పారు. స‌రిహ‌ద్దు రాళ్ల కోసం, వాటిపై జ‌గ‌న్ ఫొటోలు వేసుకునేందుకు 350 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశార‌ని తెలిపారు. వీటిని తొల‌గించేందుకు మ‌రో 15 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. ఇదంతా వృథా ఖ‌ర్చేన‌ని..దీనిని అప్ప‌టి పాల‌కుల నుంచి రిక‌వ‌రీ చేసేందుకు ఆలోచిస్తున్న‌ట్టు తెలిపారు.

జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన‌ భూ పందేరాలపైనా విచార‌ణ చేయించాల‌ని చూస్తున్నామ‌న్నారు. కొన్ని మ‌ఠాల‌కు ఉదారంగా ప్ర‌జ‌ల‌కు చెందిన‌, ప్ర‌భుత్వానికి చెందిన భూములు కూడా ఇచ్చేశార‌ని తెలిపారు. వీటిని వెనక్కి తీసుకోవడంపై దృష్టి పెట్టామ‌ని.. కానీ, న్యాయ ప‌ర‌మైన చిక్కులు ఎదురవుతాయ‌ని.. అయిన‌ప‌ట్టికీ ముందుకు వెళ్లాల‌ని బావిస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే వీటిపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని మంత్రి అన‌గాని తేల్చి చెప్పారు.

This post was last modified on July 30, 2024 7:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

32 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago