Political News

టైమొస్తే జ‌గ‌నైనా జైలుకే: ఏపీ మంత్రి

టైమొస్తే.. ఎవ‌రినీ ఊరుకోబోమ‌ని.. ఏపీ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. ఎవ‌రు త‌ప్పు చేసిన‌ట్టు రుజువైనా ఊరుకునేది లేద‌న్నారు. ఖ‌చ్చితంగా జైలుకు పంపిస్తామ‌న్నారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అయినా.. జ‌గ‌నైనా ఎవ‌రు త‌ప్పు చేసిన‌ట్టు తేలినా ఊరుకునేలేద‌ని తేల్చి చెప్పారు. మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌ల‌క్ట‌ర్ కార్యాల‌యంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం.. ఉద్దేశ పూర్వ‌కంగా చేసిందేన‌ని, దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాన్ని కూపీ లాగే ప‌నిలో ఉన్నామని తెలిపారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ అధికారి సిసోడియా అక్క‌డ మూడు రోజులపాటు మ‌కాం వేసి.. విచార‌ణ సాగించార‌ని తెలిపారు.

ఆయ‌న ఇచ్చే నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన‌గాని తెలిపారు. అగ్ని ప్ర‌మాదాన్ని ఉద్దేశ పూర్వంగానే చేసిన‌ట్టు తెలిసిన ద‌రిమిలా.. ఈ ఘ‌ట‌న వెనుక ఎవ‌రు ఉన్నా.. శిక్షించి తీరుతామ‌ని ప‌రోక్షంగా ఆయ‌న జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “టైమొస్తే పెద్దిరెడ్డి అయినా, జగన్ అయినా చర్యలు తప్పవు” అని మంత్రి అనగాని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీసుల్లో ప్రైవేటు వ్య‌క్తుల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉంద‌ని తెలిసింద‌న్నారు. వీటిపైనా విచార‌ణ చేయిస్తామ‌న్నారు. కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం వేల రూపాయ‌ల‌కు లీజులు ఇవ్వ‌డాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

ఇలాంటివి ఎలా జ‌రిగాయో తేలుస్తామ‌ని మంత్రి చెప్పారు. వీటిపైనా విచార‌ణ చేయించాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అన‌గాని.. గ‌త ప్ర‌భుత్వం 22ఏ అసైన్డ్ బూమ‌లును ప‌ప్పు బెల్లాల్లా పంచిపెట్టేందుకే నిబంధ‌న‌లు ఎత్తేసింద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇలా ఎంత మంది ఆస్తులు చేజిక్కించుకున్నార‌నే విష‌యంపై కూపీ లాగుతున్న‌ట్టు తెలిపారు. భూముల స‌ర్వే పేరుతో ప్ర‌జ ధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌ని చెప్పారు. స‌రిహ‌ద్దు రాళ్ల కోసం, వాటిపై జ‌గ‌న్ ఫొటోలు వేసుకునేందుకు 350 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశార‌ని తెలిపారు. వీటిని తొల‌గించేందుకు మ‌రో 15 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. ఇదంతా వృథా ఖ‌ర్చేన‌ని..దీనిని అప్ప‌టి పాల‌కుల నుంచి రిక‌వ‌రీ చేసేందుకు ఆలోచిస్తున్న‌ట్టు తెలిపారు.

జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన‌ భూ పందేరాలపైనా విచార‌ణ చేయించాల‌ని చూస్తున్నామ‌న్నారు. కొన్ని మ‌ఠాల‌కు ఉదారంగా ప్ర‌జ‌ల‌కు చెందిన‌, ప్ర‌భుత్వానికి చెందిన భూములు కూడా ఇచ్చేశార‌ని తెలిపారు. వీటిని వెనక్కి తీసుకోవడంపై దృష్టి పెట్టామ‌ని.. కానీ, న్యాయ ప‌ర‌మైన చిక్కులు ఎదురవుతాయ‌ని.. అయిన‌ప‌ట్టికీ ముందుకు వెళ్లాల‌ని బావిస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే వీటిపై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌ని మంత్రి అన‌గాని తేల్చి చెప్పారు.

This post was last modified on July 30, 2024 7:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

2 minutes ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

19 minutes ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

20 minutes ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

1 hour ago

సుకుమార్ రైటింగ్స్.. ఎదురుచూపులు ఎన్నాళ్లు..?

దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…

2 hours ago

ఇక ఓలా, ఉబేర్ పని అయిపోయినట్లేనా?

దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…

3 hours ago