Political News

వైసీపీలో.. ఎవ‌రికి వారే య‌మునా తీరే?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎవ‌రి దారిలో వారు ఉన్నారు. కొంద‌రు కూట‌మి స‌ర్కారుకు భ‌య ప‌డుతుం డ‌గా మ‌రికొంద‌రు.. వైసీపీ వ్య‌వ‌హార శైలినే త‌ప్పుప‌డుతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చి 50 రోజులు అయిపోయినా.. జ‌గ‌న్ పుంజుకోక‌పోవ‌డంతో ఇక‌, తాము మాత్రం పార్టీని ఏం చేస్తామ‌న్న ఉద్దేశంలో చాలా మంది నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నిత్యం మీడియాలో ఉండే వారు కూడా సైలెంట్ అయ్యారు.

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, త‌మ్మినేని సీతారామ్‌, దువ్వాడ శ్రీనివాస్‌, అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాట‌సాని బ్ర‌దర్స్‌, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి.. ఇలా ఒక‌ప్పుడు మీడియా ముందు గొంతు చించుకుని మాట్లాడిన వారు కూడా.. ఇప్పుడు మైకు క‌నిపిస్తే.. మాయం అవుతున్నారు. నోరు విప్ప‌డం లేదు. కూట‌మిని కార్న‌ర్ చేయ డ‌మూ లేదు. దీనికి కార‌ణం.. కేసుల భ‌యం ఒక‌టైతే.. వ్యాపారాల బెంగ మ‌రొక‌టి. ఈ రెండు కార‌ణాల‌తో అసలు వైసీపీని వారు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న చ‌ర్చ సాగుతోంది.

ఇంకో వైపు.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న కార‌ణంగా .. అప్ప‌ట్లో రుస‌రుస‌లా డిన నాయ‌కులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరంతా పార్టీలు మార‌తారా? లేక‌.. మౌనంగానే ఉంటారా? అనేది చెప్ప‌డం క‌ష్టం. కొంద‌రు జ‌గ‌న్‌కు విధేయులు ఉన్నారు. మ‌రికొంద‌రు స‌జ్జ‌ల బాధితు లు కూడా ఉన్నారు. ఇలాంటివారంతా ఇప్పుడు ఎవరి దారిలో వారు ఉన్నారు. వైసీపీ పిలిచినా.. త‌ల‌చినా.. క‌నిపించ‌డం లేదు.

ఇటీవ‌ల ఢిల్లీలో నిర్వ‌హించిన ధ‌ర్నాకు హాజ‌రు కావాలంటూ.. పార్టీ నుంచి పిలుపు వ‌చ్చింది. అయిన‌ప్ప టికీ.. కొంద‌రు కీల‌క నాయ‌కులే డుమ్మా కొట్టారు. దీంతో పార్టీలో చ‌ర్చ వ‌చ్చినా.. వారిని పిలిచి మంద‌లించే ప‌రిస్థితి లేదు. అస‌లు వారిని ఎక్క‌డ హెచ్చ‌రిస్తే.. ఎక్క‌డ పార్టీకి దూర‌మ‌వుతారోన‌ని.. కొంద‌రు సీనియ‌ర్లు చెబుతున్నారు. ప్రాంతానికొక నాయ‌కుడు లేదా జిల్లాకు ఒక నాయ‌కుడు మాత్ర‌మే ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన వారంతా మౌనంగానే ఉన్నారు. వారి దారిలో వారు న‌డుస్తున్నారు.

This post was last modified on July 30, 2024 10:58 am

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

8 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

19 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

38 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

59 minutes ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago