Political News

చెప్పారు… చేశారు.. జగన్ ఫొటో మాయం

ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు స‌హా భూమి యాజ మాన్య హ‌క్కు ప‌త్రాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌ను మాత్ర‌మే ప‌రిమితం చేశారు. దీంతో రైతులు, భూ య‌జ‌మానులు సైతం ఊప‌రిపీల్చుకున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు.. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ పై అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫొటోల‌తో వాటిని సంబంధించి రైతుల‌కు, భూయ‌జ‌మానుల‌కు అందించారు. దీంతో త‌మ ప‌ట్టా పుస్త‌కాల‌ పై జ‌గ‌న్ ఫొటోలు ఎందుక‌ని రైతులు ప్ర‌శ్నించారు. ఇక‌, భూయ‌జ‌మానులు కూడా త‌మ భూముల‌ పై జ‌గ‌న్ ఫొటోలు ఎందుక‌ని నిల‌దీశారు.

క‌డ‌ప‌లోని జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి ఎన్నికల ప్ర‌చారం చేసిన‌ప్పుడు కూడా.. ప‌లువురు వైసీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌జ‌ల ఆస్థుల‌ పై జ‌గ‌న్ బొమ్మ‌లు వేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌శ్నించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. అనంత‌రం.. ఇదే విష‌యం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ‌ర‌కు సాగింది. ప‌ట్టా పుస్త‌కాల‌ పై జ‌గ‌న్ బొమ్మ వేసుకుంటున్న‌వారు.. రేపు మీ భూముల‌ను లాగేసుకోర‌ని గ్యారెంటీ ఏంట‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచారు.

ఈ ప‌రిణామం ఎన్నికల స‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఫ‌లితంగా వైసీపీకి తీవ్ర ఎదురు దెబ్బ త‌గిలింది. ఇక‌, అదే స‌మ‌యంలో తాము అధికార‌లోకి రాగానే ప‌ట్టా పుస్త‌కాల‌పై ఎవ‌రి బొమ్మ ఉండ‌ద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో అంద‌రికీ ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తూ.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 20 ల‌క్ష‌ల మందికి ఇచ్చిన ప‌ట్టా పుస్త‌కాల‌ను వెన‌క్కి తీసుకుని.. వాటిని తిరిగి రాజ‌ముద్ర‌తో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

కొత్త‌గా ఇచ్చేవాటికి మాత్రం ఎవ‌రి బొమ్మ లేకుండానే రైతుల‌కు, భూయజ‌య‌మానుల‌కు అందించ‌నున్నారు. దీంతో రైతుల‌కు, భూయ‌జ‌మానుల‌కు భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. నిజానికి ఏ రాష్ట్రంలో కూడా.. ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ప్ర‌జ‌ల సొంత ఆస్తుల‌పై త‌మ బొమ్మ‌లు చేసుకునేందుకు సాహ‌సించ‌లేదు. త‌మిళ‌నాడును పాలించిన జ‌య‌ల‌లిత కు ప్ర‌చార యావ ఎక్కువ‌గా ఉంద‌నే విష‌యం తెలిసిందే. అమ్మ‌ పేరుతో ఆమె ప్ర‌తి ప‌థ‌కానికి త‌న పేరు పెట్టుకుని, త‌న ఫొటో వేసుకున్నా.. ఇలాంటి విష‌యాల్లో మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కానీ, ఏపీలో మాత్రం ఎవ‌రు చెప్పారో..ఏమో.. జ‌గ‌న్ మాత్రం త‌న ఫొటోలు వేసుకుని చేతులు కాల్చుకున్నారు.

This post was last modified on July 29, 2024 6:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

6 minutes ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

11 minutes ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

2 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

2 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

2 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

2 hours ago