Political News

‘ఇది ‘డీఎన్ఏ’ ప్ర‌భుత్వం కాదు.. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం’

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్స్ వేదిక‌గా నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీ పీ నేత‌ల మ‌ధ్య నిత్యం ఏదో ఒక విష‌యంలో వాద‌న జ‌రుగుతూనే ఉంది. గ‌త వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌దా య శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతికి భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో త‌మ ప్ర‌భు త్వం అంద‌రికి స‌మానంగా శాంతి భ‌ద్ర‌త‌లు అందిస్తుంద‌ని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాట‌లు కోట‌లు దాటుతున్నా.. చేత‌లు గ‌డ‌ప దాటడం లేదు. బొల్లి మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భ‌యం గుప్పిట్లోకి జారుకుంద‌ని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. సాయిరెడ్డి కామెంట్ల‌కు అనిత త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అది కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాట‌కు మాట అన్నారు. ‘శాంతి’ భ‌ద్ర‌త‌ల విష‌యాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాల‌మే నిర్ణ‌యిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్ర‌భుత్వం కాదు. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం(శాంతి భ‌ర్త మ‌ద‌న్‌.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో). ప్ర‌జ‌లు బాగానే ఉన్నారు. దొంగ‌లే కోట‌ల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జ‌గ‌న్‌ను ఉద్దేశించి). ఎక్స్‌లో రెట్ట‌లు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.

This post was last modified on July 28, 2024 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago