ఏపీ రాజకీయాల్లో ఎక్స్ వేదికగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీ పీ నేతల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా నడుస్తున్న విషయం తెలిసిందే. దేవదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె బిడ్డ వ్యవహారం.. రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతికి భద్రత లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో తమ ప్రభు త్వం అందరికి సమానంగా శాంతి భద్రతలు అందిస్తుందని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్లో విమర్శలు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు. బొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భయం గుప్పిట్లోకి జారుకుందని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే.. సాయిరెడ్డి కామెంట్లకు అనిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అది కూడా ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాటకు మాట అన్నారు. ‘శాంతి’ భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్రభుత్వం కాదు. ‘ఎన్డీఏ’ ప్రభుత్వం(శాంతి భర్త మదన్.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో). ప్రజలు బాగానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జగన్ను ఉద్దేశించి). ఎక్స్లో రెట్టలు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.
This post was last modified on July 28, 2024 4:45 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…