Political News

‘ఇది ‘డీఎన్ఏ’ ప్ర‌భుత్వం కాదు.. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం’

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్స్ వేదిక‌గా నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీ పీ నేత‌ల మ‌ధ్య నిత్యం ఏదో ఒక విష‌యంలో వాద‌న జ‌రుగుతూనే ఉంది. గ‌త వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌దా య శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతికి భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో త‌మ ప్ర‌భు త్వం అంద‌రికి స‌మానంగా శాంతి భ‌ద్ర‌త‌లు అందిస్తుంద‌ని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాట‌లు కోట‌లు దాటుతున్నా.. చేత‌లు గ‌డ‌ప దాటడం లేదు. బొల్లి మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భ‌యం గుప్పిట్లోకి జారుకుంద‌ని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. సాయిరెడ్డి కామెంట్ల‌కు అనిత త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అది కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాట‌కు మాట అన్నారు. ‘శాంతి’ భ‌ద్ర‌త‌ల విష‌యాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాల‌మే నిర్ణ‌యిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్ర‌భుత్వం కాదు. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం(శాంతి భ‌ర్త మ‌ద‌న్‌.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో). ప్ర‌జ‌లు బాగానే ఉన్నారు. దొంగ‌లే కోట‌ల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జ‌గ‌న్‌ను ఉద్దేశించి). ఎక్స్‌లో రెట్ట‌లు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.

This post was last modified on July 28, 2024 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

54 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

1 hour ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

4 hours ago