Political News

‘ఇది ‘డీఎన్ఏ’ ప్ర‌భుత్వం కాదు.. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం’

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్స్ వేదిక‌గా నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వ‌ర్సెస్ టీడీ పీ నేత‌ల మ‌ధ్య నిత్యం ఏదో ఒక విష‌యంలో వాద‌న జ‌రుగుతూనే ఉంది. గ‌త వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దేవ‌దా య శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి, ఆమె బిడ్డ వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో అనేక మ‌లుపులు తిరిగింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతికి భ‌ద్ర‌త లేకుండా పోయింద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో త‌మ ప్ర‌భు త్వం అంద‌రికి స‌మానంగా శాంతి భ‌ద్ర‌త‌లు అందిస్తుంద‌ని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాట‌లు కోట‌లు దాటుతున్నా.. చేత‌లు గ‌డ‌ప దాటడం లేదు. బొల్లి మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భ‌యం గుప్పిట్లోకి జారుకుంద‌ని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే.. సాయిరెడ్డి కామెంట్ల‌కు అనిత త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అది కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాట‌కు మాట అన్నారు. ‘శాంతి’ భ‌ద్ర‌త‌ల విష‌యాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాల‌మే నిర్ణ‌యిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్ర‌భుత్వం కాదు. ‘ఎన్‌డీఏ’ ప్ర‌భుత్వం(శాంతి భ‌ర్త మ‌ద‌న్‌.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో). ప్ర‌జ‌లు బాగానే ఉన్నారు. దొంగ‌లే కోట‌ల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జ‌గ‌న్‌ను ఉద్దేశించి). ఎక్స్‌లో రెట్ట‌లు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.

This post was last modified on July 28, 2024 4:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago