ఏపీ రాజకీయాల్లో ఎక్స్ వేదికగా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీ పీ నేతల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా.. వైసీపీ ఎంపీ, సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా నడుస్తున్న విషయం తెలిసిందే. దేవదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె బిడ్డ వ్యవహారం.. రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… రెండు మూడు రోజులుగా సాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
రాష్ట్రంలో శాంతికి భద్రత లేకుండా పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో తమ ప్రభు త్వం అందరికి సమానంగా శాంతి భద్రతలు అందిస్తుందని కూడా అనిత చెప్పారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. సాయిరెడ్డి ఎక్స్లో విమర్శలు గుపించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు. బొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే రాష్ట్రం భయం గుప్పిట్లోకి జారుకుందని” సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే.. సాయిరెడ్డి కామెంట్లకు అనిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అది కూడా ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి ముడిపెట్టి మాటకు మాట అన్నారు. ‘శాంతి’ భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. అయినా ఇది ‘డీఎన్ ఏ’ ప్రభుత్వం కాదు. ‘ఎన్డీఏ’ ప్రభుత్వం(శాంతి భర్త మదన్.. సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో). ప్రజలు బాగానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు పెడుతున్నారు(జగన్ను ఉద్దేశించి). ఎక్స్లో రెట్టలు వేస్తున్నారు(సాయిరెడ్డిని ఉద్దేశించి) అని అనిత వ్యాఖ్యానించారు.
This post was last modified on July 28, 2024 4:45 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…