Political News

వైసీపీ పతనమే షర్మిల లక్ష్యమా ?!

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో కీలకపాత్ర పోషించింది.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా అధికార టీడీపీ పార్టీని వదిలేసి అన్న జగన్, ఆయన పార్టీనే లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ పతనం తర్వాత కూడా షర్మిల చేస్తున్న ఆరోపణలు రాజకీయ పరిశీలకులను ఆకర్షిస్తున్నాయి. ప్రతీ విషయంలో జగన్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న విమర్శల వెనక షర్మిల వ్యూహం ఏమిటా అని ఉత్కంఠగా గమనిస్తున్నారు.

అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల వైసీపీ పార్టీ పూర్తిగా పతనం అయితేనే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందని, అప్పుడే తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని షర్మిల బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏపీ రాజకీయాలలోకి రావడం మూలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా జనం తనను గుర్తించలేదని, జగన్ కన్నా తానే బెటర్ అన్న నమ్మకాన్ని కలిగించాలి అన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తుంది.

వైసీపీ పార్టీలో ఉన్న నేతలు 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారే. వారిలో విశ్వాసం కలిగించ గలిగితే వారంతా తన వెంట నడుస్తారని, 151 శాసనసభ స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ పార్టీని, జగన్ ను ప్రజలు ఇక ఆదరించరు అన్న సంకేతాలు బలంగా పంపడమే లక్ష్యంగా ఓటమి తర్వాత కూడా షర్మిల అన్న మీద విమర్శలు ఎక్కుపెట్టినట్లు చెబుతున్నారు. మరి షర్మిల ఎత్తులు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

This post was last modified on July 28, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

36 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago