Political News

వైసీపీ పతనమే షర్మిల లక్ష్యమా ?!

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన అన్న, వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన షర్మిల వైసీపీ ప్రభుత్వ పరాజయంలో కీలకపాత్ర పోషించింది.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా అధికార టీడీపీ పార్టీని వదిలేసి అన్న జగన్, ఆయన పార్టీనే లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నది. వైసీపీ ప్రభుత్వ పతనం తర్వాత కూడా షర్మిల చేస్తున్న ఆరోపణలు రాజకీయ పరిశీలకులను ఆకర్షిస్తున్నాయి. ప్రతీ విషయంలో జగన్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న విమర్శల వెనక షర్మిల వ్యూహం ఏమిటా అని ఉత్కంఠగా గమనిస్తున్నారు.

అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల వైసీపీ పార్టీ పూర్తిగా పతనం అయితేనే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుందని, అప్పుడే తన రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అని షర్మిల బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏపీ రాజకీయాలలోకి రావడం మూలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా జనం తనను గుర్తించలేదని, జగన్ కన్నా తానే బెటర్ అన్న నమ్మకాన్ని కలిగించాలి అన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తుంది.

వైసీపీ పార్టీలో ఉన్న నేతలు 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారే. వారిలో విశ్వాసం కలిగించ గలిగితే వారంతా తన వెంట నడుస్తారని, 151 శాసనసభ స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ పార్టీని, జగన్ ను ప్రజలు ఇక ఆదరించరు అన్న సంకేతాలు బలంగా పంపడమే లక్ష్యంగా ఓటమి తర్వాత కూడా షర్మిల అన్న మీద విమర్శలు ఎక్కుపెట్టినట్లు చెబుతున్నారు. మరి షర్మిల ఎత్తులు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

This post was last modified on July 28, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

1 hour ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

1 hour ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

1 hour ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

5 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

5 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

6 hours ago