Political News

జగన్ స్థాయికి ఇది తగునా?

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారు.

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా.. బయట కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. మళ్లీ అమరావతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో జగన్ చర్యలు, మాటలు ఆయనకు మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయే తప్ప.. పెద్దగా సాధించిందేమీ లేదు. ప్రెస్ మీట్ అంటే అనుకూల, వ్యతిరేక అని తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలనూ పిలవాలి. ఇరుకున పెట్టే ప్రశ్నలు వేసినా.. ఎదుర్కోవాలి. అంతే తప్ప నచ్చని మీడియాను అనుమతించకుండా.. అనుకూల మీడియానే పిలిపించుకుని వన్ సైడెడ్‌గా ప్రెస్ మీట్ నడిపించి ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.

ఈ ప్రెస్ మీట్లో పొరపాటున ఒక నెగెటివ్ ప్రశ్న జగన్‌కు ఎదురైంది. మీ కుటుంబంలో జరిగిన హత్య (వివేకా) గురించి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు కదా అని అడిగితే.. రాష్ట్రంలో 50 రోజులుగా ఇన్నిన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే మనమే ఇలా డైవర్ట్ చేసి మాట్లాడితే ఎలా అంటూ ఆ టాపిక్‌ను తనే డైవర్ట్ చేసి మాట్లాడ్డం గమనార్హం. ఈ ప్రెస్ మీట్ మొత్తంలో హైలైట్ ఏంటంటే.. తాను ఒక ముఖ్యమంత్రిగా పని చేశాననే సంగతి కూడా మరిచిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన ఓ ఆరోపణ.

చంద్రబాబు, తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు కలిసి చదువుకున్నారని.. ఐతే యూనివర్శిటీలో ఒకసారి పెద్దిరెడ్డి.. చంద్రబాబును కొట్టాడని, అది మనసులో పెట్టుకుని బాబు ఇప్పుడు ఆయన మీద కక్ష సాధిస్తున్నారని ఏదో ఛోటా మోటా నాయకుడిలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్. ఐతే చంద్రబాబు యూనివర్శిటీలో చదువుకునే రోజులంటే 50 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడు జరిగింది మనసులో పెట్టుకున్నట్లే అయితే 90వ దశకంలోనే బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా రెండు పర్యాయాలు సీఎంగా పని చేశారు. పెద్దిరెడ్డిని ఏమైనా చేయాలనుకుంటే.. ఇన్నేళ్లు ఆగాలా? ఓవైపు పెద్దిరెడ్డి భూ కబ్జా బాధితులైన సామాన్యులు వందల మంది తమకు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు సమర్పిస్తుంటే.. జగన్ ఏమో ఆయన ఉత్తముడని సర్టిఫై చేస్తూ 50 ఏళ్ల ముందు విషయాలు చెప్పి బాబు కక్ష సాధిస్తున్నాడని పేర్కొనడం విడ్డూరం. ఇలాంటి మాటలతో జగన్ పలుచన కావడం తప్ప పైసా ప్రయోజనం ఉండదని ఆయన పక్కనున్న వాళ్లు చెబితే మంచిది.

This post was last modified on July 27, 2024 3:34 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

5 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

7 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

7 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

8 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

8 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

8 hours ago