Political News

జగన్ స్థాయికి ఇది తగునా?

ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు కూడా రాకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. కానీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైసీపీ అధినేత జగన్ అలిగారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకే వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారు.

ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్లకుండా.. బయట కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఢిల్లీలో ధర్నా చేశారు. మళ్లీ అమరావతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అక్కడ ఢిల్లీలో, ఇక్కడ అమరావతిలో జగన్ చర్యలు, మాటలు ఆయనకు మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయే తప్ప.. పెద్దగా సాధించిందేమీ లేదు. ప్రెస్ మీట్ అంటే అనుకూల, వ్యతిరేక అని తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలనూ పిలవాలి. ఇరుకున పెట్టే ప్రశ్నలు వేసినా.. ఎదుర్కోవాలి. అంతే తప్ప నచ్చని మీడియాను అనుమతించకుండా.. అనుకూల మీడియానే పిలిపించుకుని వన్ సైడెడ్‌గా ప్రెస్ మీట్ నడిపించి ప్రయోజనం ఏంటన్నది ప్రశ్న.

ఈ ప్రెస్ మీట్లో పొరపాటున ఒక నెగెటివ్ ప్రశ్న జగన్‌కు ఎదురైంది. మీ కుటుంబంలో జరిగిన హత్య (వివేకా) గురించి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు కదా అని అడిగితే.. రాష్ట్రంలో 50 రోజులుగా ఇన్నిన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే మనమే ఇలా డైవర్ట్ చేసి మాట్లాడితే ఎలా అంటూ ఆ టాపిక్‌ను తనే డైవర్ట్ చేసి మాట్లాడ్డం గమనార్హం. ఈ ప్రెస్ మీట్ మొత్తంలో హైలైట్ ఏంటంటే.. తాను ఒక ముఖ్యమంత్రిగా పని చేశాననే సంగతి కూడా మరిచిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చేసిన ఓ ఆరోపణ.

చంద్రబాబు, తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు కలిసి చదువుకున్నారని.. ఐతే యూనివర్శిటీలో ఒకసారి పెద్దిరెడ్డి.. చంద్రబాబును కొట్టాడని, అది మనసులో పెట్టుకుని బాబు ఇప్పుడు ఆయన మీద కక్ష సాధిస్తున్నారని ఏదో ఛోటా మోటా నాయకుడిలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్. ఐతే చంద్రబాబు యూనివర్శిటీలో చదువుకునే రోజులంటే 50 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడు జరిగింది మనసులో పెట్టుకున్నట్లే అయితే 90వ దశకంలోనే బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా రెండు పర్యాయాలు సీఎంగా పని చేశారు. పెద్దిరెడ్డిని ఏమైనా చేయాలనుకుంటే.. ఇన్నేళ్లు ఆగాలా? ఓవైపు పెద్దిరెడ్డి భూ కబ్జా బాధితులైన సామాన్యులు వందల మంది తమకు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు సమర్పిస్తుంటే.. జగన్ ఏమో ఆయన ఉత్తముడని సర్టిఫై చేస్తూ 50 ఏళ్ల ముందు విషయాలు చెప్పి బాబు కక్ష సాధిస్తున్నాడని పేర్కొనడం విడ్డూరం. ఇలాంటి మాటలతో జగన్ పలుచన కావడం తప్ప పైసా ప్రయోజనం ఉండదని ఆయన పక్కనున్న వాళ్లు చెబితే మంచిది.

This post was last modified on July 27, 2024 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

14 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

36 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago